logo

పీఠాధిపతికి సత్కారం

రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయానికి వచ్చిన కర్నాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బసవరాజు శనివారం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులును కలిశారు.

Published : 02 Apr 2023 02:49 IST

మెమెంటో అందజేస్తున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయానికి వచ్చిన కర్నాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బసవరాజు శనివారం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులును కలిశారు. పూర్వ పీఠాధిపతుల ఆరాధనలో పాల్గొని శ్రీమఠం చేరుకున్నారు. న్యాయమూర్తి దంపతులు పీఠాధిపతులను సత్కరించారు. అనంతరం పీఠాధిపతి న్యాయమూర్తికి స్వామి శేషవస్త్రం, జ్ఞాపిక ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్‌ ఎస్కే.శ్రీనివాసరావు, నరసింహమూర్తి, అనంతస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని