Theft: నంద్యాల జిల్లా.. వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
వ్యాపారి ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా అవుకు మండలంలో చోటుచేసుకుంది.
అవుకు: నంద్యాల జిల్లాలో భారీ చోరీ జరిగింది. నాపరాళ్ల పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో దండగులు చొరబడి 80 తులాల బంగారం, రూ.14 లక్షల నగదు దోచుకెళ్లారు. శనివారం రాత్రి అవుకు మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు.
ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు.. తలుపులకు వేసిన తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాలో దాచిన బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అవుకు ఎస్సై జగదీశ్వరరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కర్నూలు నుంచి క్లూస్టీమ్ను రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.