భక్తుల.. నిలువు దోపిడీ
పలు దేవస్థానాల్లో స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.
గేటు వసూళ్ల పేరుతో జేబుకు చిల్లు
ఆలయాల పరిసరాల్లో కానరాని పార్కింగ్ స్థలాలు
అహోబిలంలో గేటు వసూలు చేస్తున్న సిబ్బంది
ఆళ్లగడ్డ, బేతంచెర్ల, మహానంది, న్యూస్టుడే : పలు దేవస్థానాల్లో స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఆలయ ఆవరణలో అడుగు పెట్టకముందే అక్రమ వసూళ్ల బారిన పడుతున్నారు. అహోబిలం, మహానంది, మద్దిలేటి తదితర క్షేత్రాల్లో ఇష్టానుసారంగా టోల్ వసూలు చేస్తున్నారు. వాహనాలకు వందల రూపాయలు వసూలు చేసే దేవస్థానం, పంచాయతీరాజ్ అధికారులు కనీసం వాహనాలను నిలిపేందుకు స్థలాలు కేటాయించకపోవడం గమనార్హం.
అహోబిలంలో భారీగా..
అహోబిల క్షేత్రంలో దోపిడీ మరీ ఎక్కువగా ఉంది. కారుకు రూ.50 వసూలు చేయాల్సి ఉండగా రూ.100, ఆటోకు రూ.50, కొన్ని సందర్భాల్లో బస్సుకు రూ.200 తీసుకుంటున్నారు. ఇక్కడ వాహనాల గేటు వసూళ్ల బాధ్యత పంచాయతీవారు నిర్వహిస్తున్నారు. అహోబిలంలోని స్థలాల్లో 80 శాతం అటు దేవస్థానానికి, ఇటు అటవీ శాఖలకు చెందినవి ఉంటాయి. అహోబిలం అటవీ అందాలను చూసేందుకు యాత్రికులు వస్తుంటారు. వారు తమ వాహనాలను దేవస్థానం స్థలంలో, ఎగువ అహోబిలంలో అటవీ శాఖకు చెందిన స్థలంలోనే ఆపుతారు. ఇక్కడ ఏ వాహనానికి ఎంత వసూలు చేయాలో తెలిపే బోర్డు ప్రదర్శించకపోవడం గమనార్హం.
భద్రత కల్పించరు..
అహోబిలంలో లారీకి రూ.100, ఆటోకు రూ.40, ట్రాక్టర్కు రూ.80, కారుకు రూ.50 తీసుకుంటున్నారు. అధికంగా వసూలు చేస్తున్న వీరు స్థలం చూపి వాహనాలకు భద్రత కల్పించాలి. క్షేత్రంలో ఇవేమీ కనిపించవు. నగదు తీసుకోవడం తప్ప మరేమీ పట్టించుకోరు.
సంబంధం లేదంటూ..
* జిల్లాలోని ప్రముఖ దేవస్థానాలకు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇలాంటి వాహనాలు వస్తే గేటు వసూలు చేసేవారికి పండగే. వారి నుంచి ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతుంటారన్న ఆరోపణలున్నాయి. అహోబిలంలో గేటు వసూళ్లపై ఇటీవల తెలంగాణకు చెందినవారు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేయగా, వసూళ్లకు.. దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదంటూ ఆలయ అధికారులు చేతులు దులిపేసుకున్నారు.
* నిబంధనల ప్రకారం ఆటోకు రూ.20, కారు రూ.30, బస్సు రూ.100, ట్రాక్టరుకు రూ.50 వసూలు చేయాల్సి ఉంది. ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు.
రూ.కోటికిపైగా ఆదాయం ఉన్నా..
మహానందిలో కారుకు రూ.80, బస్సు రూ.150, ఆటో రూ.30, లారీకి రూ.150 వసూలు చేస్తున్నారు. ఇక్కడ వాహనాల రుసుము కోసం నిర్వహించిన వేలం పాట ద్వారా రూ.1.56 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంత భారీగా వస్తున్నా వాహనాలకు సరైన పార్కింగ్ సౌకర్యం లేదు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపాల్సిన దుస్థితి. ఉగాది, శివరాత్రి సమయాల్లో వాహనాలను క్షేత్రానికి 1.50 కి.మీ. దూరంలోనే ఆపేస్తారు. అయినా గేటు మాత్రం యథావిధిగా చెల్లించాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు