నిల్వలు నిండుకున్నాయ్
రానున్న రోజుల్లో పేదలకు కందిపప్పు అందే పరిస్థితి కానరావడంలేదు. ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రాయితీపై కిలో రూ.67 చొప్పున కార్డుదారులకు కందిపప్పు అందజేస్తోంది.
కందిపప్పు పంపిణీ ప్రశ్నార్థకమే
కర్నూలు పౌరసరఫరాల గోదాము నుంచి లారీలోకి బస్తాలు లోడు చేస్తున్న కార్మికుడు
కర్నూలు సచివాలయం, వెల్దుర్తి, న్యూస్టుడే: రానున్న రోజుల్లో పేదలకు కందిపప్పు అందే పరిస్థితి కానరావడంలేదు. ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా రాయితీపై కిలో రూ.67 చొప్పున కార్డుదారులకు కందిపప్పు అందజేస్తోంది. ప్రస్తుతం చేతులెత్తేసింది. రానున్న రోజుల్లో వాటిని అందిస్తారో? లేదో? తెలియని పరిస్థితి. కందిపప్పు సరఫరా కష్టమేనని, పరిస్థితులు చూస్తుంటే ఆగిపోయినట్లేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదాముల్లో కందిపప్పు నిల్వలు పూర్తిగా లేకపోవడంతో జూన్ నెల కోటా లేనట్లేనని స్పష్టంగా అర్థమవుతోంది.
సరఫరా కాక..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్డుదారులకు ప్రతి నెలా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు అందజేస్తున్నారు. గత కొద్ది నెలలుగా బియ్యం మినహా చక్కెర, కందిపప్పు సరిగా ఇవ్వడం లేదు. జూన్ నెల కోటాకు సంబంధించి కర్నూలు జిల్లాకు 636, నంద్యాల జిల్లాకు 530 టన్నుల వరకు కందిపప్పు కేటాయింపులు చేశారు. ప్రస్తుతం పౌరసరఫరాల గోదాముల్లో కందిపప్పు నిల్వలు నిండుకున్నాయి. హైదరాబాద్, వినుకొండ ప్రాంతాల్లోని సరఫరాదారుల నుంచి కందిపప్పు రాలేదు. జూన్ 1 నుంచి బియ్యం పంపిణీ మొదలు కానుంది. గోదాముల నుంచి చౌక దుకాణాలకు నిత్యావసర సరకుల సరఫరా కొనసాగుతోంది. ఇప్పటివరకు జిల్లాకు కందిపప్పు సరఫరాపై ఎలాంటి ఆదేశాలు రాలేదు.
బయట రెట్టింపు ధర....
ప్రభుత్వం కిలో కందిపప్పు రూ.67కు విక్రయిస్తోంది. మార్కెట్లో కిలో రూ.125 నుంచి రూ.140 వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు.
* ఉమ్మడి జిల్లాలోని పౌరసరఫరాల గోదాముల్లో నిల్వలు నిండుకున్నాయి. అరకొర కందిపప్పును అంగన్వాడీ కేంద్రాలకు పూర్తి కోటా ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి.
డీడీలు చెల్లించినా..
*కందిపప్పు కోసం డీలర్లు పూర్తి కోటా కోసం డీడీలు చెల్లించారు. తీరా గోదాముల్లో నిల్వలు కానరావడం లేదు. కందిపప్పు సరఫరాలో జాప్యం జరుగుతోందని.ప్రస్తుతం గోదాముల్లో ఉన్న కందిపప్పు నిల్వల్లో 25 శాతం కార్డుదారులకు పంపిణీ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
* కర్నూలు పౌరసరఫరాల గోదాము పరిధిలో కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కల్లూరు, ఓర్వకల్లు మండలాల పరిధిలో 287 చౌక దుకాణాలు ఉన్నాయి. బియ్యం 2,800 టన్నులు, చక్కెర 70 టన్నులు, కందిపప్పు 25 శాతం కేటాయించినట్లు చెబుతున్నారు. సోమవారం నుంచి చౌక దుకాణాలకు బియ్యం, కందిపప్పు, చక్కెర సరఫరా చేస్తున్నామని.. ఇప్పటివరకు వందకుపైగా దుకాణాలకు పంపిణీ చేశామని చెబుతున్నారు. 50 దుకాణాలకు మాత్రమే 20 శాతం కందిపప్పు సరఫరా చేశారని డీలర్లు పేర్కొంటున్నారు. డీడీలు చెల్లించామని.. ఇప్పుడేమో మళ్లీ కందిపప్పు గోదాముకు వస్తే ఇస్తామని అధికారులు చెబుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ