logo

ఏడు గంటలు ఉక్కిరి బిక్కిరి

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పత్తికొండలోని ప్రధాన రహదారిలో విద్యుత్తు తీగలు సరిచేసే పనులను ఆశాఖ అధికారులు చేపట్టారు.

Published : 29 May 2023 03:44 IST

విద్యుత్తు సరఫరా లేక అల్లాడిన జనం
సీఎం వస్తున్నారని హడావుడిగా మరమ్మతులు

పత్తికొండ పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పత్తికొండలోని ప్రధాన రహదారిలో విద్యుత్తు తీగలు సరిచేసే పనులను ఆశాఖ అధికారులు చేపట్టారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి పాత బస్టాండ్‌ అంబేడ్కర్‌ కూడలి వరకు విద్యుత్తు తీగలు తొలగించే పనులు మొదలు పెట్టారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఆపేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజులుగా ఇష్టానుసారంగా విద్యుత్తు సరఫరా ఆపేస్తున్నారని పలువురు వాపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఫ్యాన్లు తిరగక, లైట్లు లేక చీకట్లోనే విధులు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని