రూ.వేలు చెల్లిస్తూ.. రూ.కోట్లు గడిస్తూ
పులికనుమ జలాశయంలో చేపల పెంపకం పేరుతో అధికార పార్టీ నేతలు ధనదాహం తీర్చుకుంటున్నారు. తక్కువకు టెండర్లు వేసి చేప పిల్లలు వదిలి రూ.లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు.
పులికనుమలో చేపల వేట
అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం
పులికనుమ జలాశయంలో చేపల పెంపకం పేరుతో అధికార పార్టీ నేతలు ధనదాహం తీర్చుకుంటున్నారు. తక్కువకు టెండర్లు వేసి చేప పిల్లలు వదిలి రూ.లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు. గత రెండేళ్లుగా ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో ఇతరులు టెండర్లు వేసే సాహసం చేయడం లేదు.
ఎమ్మిగనూరు, కోసిగి, న్యూస్టుడే: కోసిగి-పెద్దకడబూరు మండలాల మధ్య పులికనుమ ప్రాజెక్టు 750 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ పరిధిలో) కోసం రూ.310 కోట్లతో దీనిని నిర్మించారు. ఇందులో 1.226 టీఎంసీల నీటిని నింపి ఎల్లెల్సీ కాలువ 270 కి.మీ. వద్ద అనుసంధానం చేయాల్సి ఉంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో సుమారు 11 మండలాల్లో 26,400 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. సాతనూరు వద్ద తుంగభద్ర నది నుంచి నీటిని తోడి జలాశయంలో నిల్వ చేస్తారు. దీని కోసం 53 రోజుల సమయం తీసుకుని వర్షాకాలంలో నీటిని నింపుతారు. ఎల్లెల్సీ ద్వారా పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది. పులికనుమ ప్రాజెక్టు సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా ప్రసుత్తం 0.465 టీఎంసీలు ఉంది. వీటిని ఎమ్మిగనూరు, మంత్రాలయంలోని కొన్ని గ్రామాల కోసం నిల్వ చేశారు. సమృద్ధిగా నీరు నిల్వ ఉండటంతో చేపల పెంపకానికి అనువుగా మారింది. ఇదే అవకాశంగా అధికార పార్టీ నేతలు దందాకు పాల్పడుతున్నారు.
తక్కువకు పాడుకుని..
అధికార పార్టీ నేతలు సిండికేట్గా మారి 2022లో రూ.60 వేలకు టెండరు వేసి లీజుకు తీసుకున్నారు. ఈ ఏడాది రూ.80 వేలకు వేలం పాట పాడుకున్నారు. రూ.కోట్లు కొల్లగొడుతూ ప్రభుత్వానికి రూ.వేలల్లో చెల్లిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అనుచరులే పాల్గొంటుండటంతో ఎవరూ అడ్డు వచ్చినా బెదిరిస్తున్నారు.
యథేచ్ఛగా ఎగుమతి
పులికనుమ జలాశయంలో చేపల పెంపకాన్ని గత రెండేళ్లుగా అధికార పార్టీ నేతలు దక్కించుకుంటున్నారు. మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు టెండరు దక్కించుకుని 8 లక్షలకుపైగా చేప పిల్లలు వదిలినట్లు సమాచారం. గతేడాది జలాశయంలో చేపలు పట్టుకుని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. ఒక మినీ లారీలో 12 క్వింటాళ్లకుపైగా చేపలను బెంగళూరు, హైదరాబాద్ తదితర మార్కెట్లకు నేరుగా తరలిస్తున్నారు. ఇలా ఏటా 200కిపైగా మినీ లారీలు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో లారీకి కనీసం రూ.3 లక్షల ప్రకారం ఆర్జిస్తున్నారు. ఏడాదిలో రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకుపైగా అమ్మకాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!