ఫార్మాసిస్ట్ సంఘం నూతన కమిటీ ఎన్నిక
ఏపీ ఎన్జీవో సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, పి.కృష్ణుడు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్జీవో కార్యాలయంలో ఉమ్మడిజిల్లా ఫార్మాసిస్ట్ ఎన్నికలు నిర్వహించారు.
ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యవర్గ సభ్యులు
కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే: ఏపీ ఎన్జీవో సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, పి.కృష్ణుడు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్జీవో కార్యాలయంలో ఉమ్మడిజిల్లా ఫార్మాసిస్ట్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఫార్మాసిస్ట్ సంఘం అధ్యక్షుడిగా రమేష్, జిల్లా కార్యదర్శిగా భాస్కర్, అసోసియేట్ అధ్యక్షుడిగా వెంకటరమణ, ట్రెజరర్గా వి.ఎస్.వి.జి.కృష్ణమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శిగా మురళీధర్రావు ఎన్నికయ్యారు. అనంతరం వారిచేత ప్రమాణం చేయించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నిక అయిన రమేష్, భాస్కర్లకు అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.