logo

ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలి

ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి వారిని చైతన్యం చేయాలని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు డా.బ్రహ్మారెడ్డి అన్నారు.

Published : 30 May 2023 02:56 IST

మాట్లాడుతున్న జేవీవీ వ్యవస్థాపకుడు డా.బ్రహ్మారెడ్డి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి వారిని చైతన్యం చేయాలని జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకుడు డా.బ్రహ్మారెడ్డి అన్నారు. నగరంలోని బీఏఎస్‌ కల్యాణ మండపంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభ రెండో రోజైన సోమవారం కొనసాగింది. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డెమోక్రసీ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా నేత రత్నం ఏసేపు, తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు గిరిబాబు, శమంతకరెడ్డి, లక్ష్మీకాంత్‌, నాగేంద్ర, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని