కరకట్ట భూమి కార్యాలయానికి
జిల్లా కేంద్రం నంద్యాలలో వైకాపా కార్యాలయ భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియను మున్సిపల్ పాలకవర్గం వ్యూహాత్మకంగా పూర్తిచేసింది. గత ఆరు నెలలుగా స్థలం కేటాయింపుపై వైకాపా వర్గాల్లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
సొంతం చేసుకున్న అధికార పార్టీ
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : జిల్లా కేంద్రం నంద్యాలలో వైకాపా కార్యాలయ భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు ప్రక్రియను మున్సిపల్ పాలకవర్గం వ్యూహాత్మకంగా పూర్తిచేసింది. గత ఆరు నెలలుగా స్థలం కేటాయింపుపై వైకాపా వర్గాల్లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తొలుత ఆర్ఏఆర్ఎస్ స్థలంలో కొంతభాగం తీసుకోవాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ జిల్లా నాయకులు అధికారులకు వినతి పత్రంఅందజేశారు. కాని ఈ స్థలం కేటాయింపు ప్రతిపాదనలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీనివాసనగర్లో ఓ విద్యా సంస్థ స్థలంపై కన్నేశారు. ఇది వివాదాస్పదం కావడంతో వెనక్కితగ్గారు. ఇదే సమయంలో జాతీయ రహదారిని అనుకుని ఉన్న రెవెన్యూ స్థలం తీసుకోవాలని సమాలోచనలు చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఈ క్రమంలో మూలసాగరంలో సర్వే నంబరు 504/2లో ఎకరం స్థలం ఖాళీగా ఉన్న విషయాన్ని వైకాపా నాయకులు గుర్తించారు.
ఆమోదం తెలిపిన పురపాలకం
కుందూనది వరదలతో ఏటా నంద్యాల పట్టణం మునిగిపోతోంది. ఆస్తి, పంటలు, ప్రాణనష్టం జరుగుతుండటంతో వరద ముప్పును నివారించేందుకు ఇక్కడ కరకట్ట నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 2007లో ఇక్కడ రైతుల నుంచి భూమిని సేకరించారు. ఆ తర్వాత కరకట్టల నిర్మాణం ప్రతిపాదనలు లేకపోవడంతో భూమి అలాగే ఉండిపోయింది. ఇందులో రెండేళ్ల క్రితం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల న్యాయస్థానంలో ఈ కేసును వేకెట్ చేయించారు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే ఇళ్ల స్థలాలకు పోగా మిగిలిన ఎకరా స్థలాన్ని వైకాపా కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించేలా గుట్టుచప్పుడు కాకుండా ప్రతిపాదనలు చేశారు.
అంతా వ్యూహాత్మకం
కౌన్సిల్లో అధికార పార్టీ కౌన్సిలర్ల సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో వ్యూహాత్మకంగా వారం రోజుల క్రితం అజెండాలో చేర్చారు. ఉన్నతాధికారులు పార్టీ కార్యాలయానికి నేరుగా భూమి కేటాయిస్తే విమర్శలు వ్యక్తమయ్యే ఆస్కారం ఉండటంతో కౌన్సిల్ ఆమోదంతోనే ముందుకెళ్లాలని ఇద్దరు ప్రజాప్రతినిధులు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతిపాదించిన స్థలానికి కొంతదూరంలో కొన్ని నెలల కిందట వైకాపా జిల్లా పార్టీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. తాజాగా ఇదే ప్రాంతంలో స్థలం కేటాయించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే కార్యాలయ భవనాన్ని నిర్మించి రాబోయే ఎన్నికల నాటికి జిల్లా వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించేలా నాయకులు అడుగులు వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం