ప్రకృతి సేద్యం.. వేతన కష్టం
పెట్టుబడి లేని సాగు వైపు ప్రోత్సహించేలా క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యవంతులను చేసేందుకు ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని నియమించారు.
పది నెలలుగా జీతం అందక ఇబ్బందులు
అల్లాడుతున్న సిబ్బంది
నగరంలోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయం
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: పెట్టుబడి లేని సాగు వైపు ప్రోత్సహించేలా క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యవంతులను చేసేందుకు ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని నియమించారు. ప్రతి నెలా వారికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. పది నెలలుగా బడ్జెట్ లేకపోవడంతో జీతాలు జమ కాలేదు. అధికారులను అడగలేక పస్తులుంటూ.. అప్పులు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులకు సమస్య విన్నవించినా పట్టించుకోకపోవడంతో వారి జీవనం దయనీయంగా మారింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత పదేళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ సాగు విధానం అమలవుతోంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పలు రకాల పంటలు పండిస్తున్నారు. వర్షాధారం, వ్యవసాయ బోర్ల కింద రైతులు ఏటా రెండు, మూడు రకాల పంటలు సాగు చేస్తున్నారు. సాగు ఖర్చులు తగ్గడంతోపాటు మార్కెట్లో ఆశాజనకమైన ధరలు లభిస్తుండటంతో ఏటా సాగుదారులు పెరుగుతున్నారు. వీరికి చేయూతగా ఉంటూ మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. కషాయం, జీవామృతం వంటివి క్షేత్రస్థాయిలో రైతులే స్వచ్ఛందంగానే తయారు చేసుకునేలా అవగాహన కల్పిస్తూ, సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
లక్ష్యం ఇలా..
2022-23 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు జిల్లాలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సాగు చేయించాలని ఉన్నతాధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. 60 వేల మందికిపైగా రైతులతో 70 వేల ఎకరాల్లో పలు రకాల పంటలతోపాటు పండ్ల తోటలు సాగు చేయించారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. గతేడాది సాగు చేసినవారితోపాటు అదనంగా మరో పది వేల మంది రైతులను సాగు వైపు మళ్లించాల్సి ఉంది.
కార్యాలయాలకు బడ్జెట్ ఉన్నా..
జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం (డీపీఎం) పరిధిలో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బడ్జెట్ అందుబాటులో ఉంది. కనీసం కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికైనా ఆ బడ్జెట్ సర్దుబాటు చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుసాధికార సంస్థ నుంచి వేతనాలకు బడ్జెట్ విడుదల చేసినప్పుడు వస్తాయని.. అంతవరకు నిరీక్షించాల్సిందేనని.. కార్యాలయ బడ్జెట్ ఇచ్చేందుకు వీలులేదంటూ చెబుతుండటం గమనార్హం.
అధికారి పెత్తనం
ఓ వ్యవసాయాధికారి (ఏవో).. కర్నూలు జిల్లా డీపీఎంగా డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. అంతా తాను చెప్పినట్లే జరగాలని సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారు. ఓ పక్క వేతనాలు రాక.. మరోపక్క అధికారి వేధింపులు భరించలేక ఉద్యోగులు నలిగిపోతున్నారు. గతంలో ఓసారి సదరు అధికారి తీరుపై రైతుసాధికార సంస్థ ఉన్నతాధికారులకు ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తనపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఆ అధికారి ఉద్యోగులపై కక్ష కట్టారు. ఇలాగైతే తాము ఎలా పనిచేయాలో అర్థం కావడం లేదని ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
రూ.10.42 కోట్ల వరకు బకాయిలు
ప్రకృతి వ్యవసాయం కింద జిల్లావ్యాప్తంగా (ఐసీఆర్పీ, సీఆర్పీలు, ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేడర్) వివిధ హోదాల్లో 301 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, జిల్లా డీపీఎం కార్యాలయంలో డిజిటల్ ఎంటీలు, ఎన్ఎఫ్ఏ, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్లు.. 8 మంది కలిపి మొత్తం 309 మంది పనిచేస్తున్నారు. నంద్యాల జిల్లాలో క్షేత్రస్థాయి సిబ్బంది వివిధ హోదాల్లో 429 మందికిపైగా, కార్యాలయంలో మరో 8 మంది కలిపి 437 మంది ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్షేత్రస్థాయిలో, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది 746 మంది వరకు ఉన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 10 నెలల వేతనాలు రావాలి. నెలకు రూ.కోటి చొప్పున పది నెలలకు రూ.10 కోట్లు, రెండు జిల్లాల్లో కార్యాలయ సిబ్బందికి గతేడాది నవంబరు నుంచి ఇప్పటివరకు 7 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. నెలకు రూ.6 లక్షల చొప్పున ఏడు నెలలకు రూ.42 లక్షలు కలిపి రూ10.42 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?