నిరీక్షించి.. నిరాశ చెంది
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. సోమవారం ఆన్లైన్ సర్వర్ మొరాయించటంతో సేవలు నిలిచిపోయిన సంగతి విదితమే.
రెండోరోజూ రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం
కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేచి ఉన్న జనం
కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. సోమవారం ఆన్లైన్ సర్వర్ మొరాయించటంతో సేవలు నిలిచిపోయిన సంగతి విదితమే. మంగళవారం సైతం అదే పరిస్థితి కొనసాగింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లతోపాటు ఈసీ, ఇతరత్రా సేవలు పూర్తిగా ఆగిపోయాయి. జూన్ 1 నుంచి భూములు, స్థలాల విలువలు పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు మంగళవారం సైతం జనం భారీగా తరలివచ్చారు. రాత్రి వరకు వేచి చూసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి నిరాశతో వెనుదిరిగారు.
ఉన్నతాధికారులు స్పందించక..
ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మంగళవారం ఉదయమే జనం తరలివచ్చారు. ఎంతకీ సర్వర్ పనిచేయకపోవడంతో కార్యాలయాల ఉద్యోగులు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో సర్వర్ ఎప్పుడు పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. భూములు, స్థలాల విలువ పెంపు అమలులోకి వస్తున్న నేపథ్యంలో అప్పటివరకు సర్వర్ పనిచేయకపోతే అదనపు రుసుము భారం పడుతుందని అవసరార్థులు ఆందోళన చెందారు.
ఆదాయానికి భారీగా గండి
గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో బుధవారం నుంచి మాన్యువల్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఒకవేళ సర్వర్ పనిచేస్తే మాత్రం మాన్యువల్ విధానం అవసరం లేదని సూచించారు. రెండు రోజులపాటు రిజిస్ట్రేషన్లు సేవలు నిలిచిపోవటంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమయ్యే దాదాపు రూ.2 కోట్ల రాబడి నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
‘‘మద్యం కారణంగా అన్యాయానికి గురవుతున్న అక్కచెల్లెమ్మల బాధ చూడలేకున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని’’ 2017లో ప్రజా సంకల్ప పాదయాత్రకు చాగలమర్రికి వచ్చిన సందర్భంలో జగన్ ప్రగల్భాలు పలికారు.