ఆ రైలులో ప్రయాణం నరకమే!
కర్నూలు నుంచి మచిలీపట్నం వరకు ప్రత్యేక సర్వీసు కేటగిరీలో నడుపుతున్న ‘మచిలీపట్నం ఎక్స్ప్రెస్’ ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. విజయవాడ వైపు ప్రయాణించే వేలాది మంది కర్నూలు వాసులకు నేరుగా అందుబాటులో ఉన్నది ఆ ఒక్క రైలు మాత్రమే.
ప్రతిసారీ కనీసం గంటన్నరకుపైగా ఆలస్యం
ఈనాడు, కర్నూలు : కర్నూలు నుంచి మచిలీపట్నం వరకు ప్రత్యేక సర్వీసు కేటగిరీలో నడుపుతున్న ‘మచిలీపట్నం ఎక్స్ప్రెస్’ ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. విజయవాడ వైపు ప్రయాణించే వేలాది మంది కర్నూలు వాసులకు నేరుగా అందుబాటులో ఉన్నది ఆ ఒక్క రైలు మాత్రమే. వారానికి మూడు రోజులు (బుధ, శుక్ర, ఆది) నడుపుతున్నా ఏనాడూ అది సరైన సమయానికి గమ్యస్థానం చేరుకున్న దాఖలాలు లేవు. విజయవాడ వెళ్లేసరికి కనీసం గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఆలస్యమవడం పరిపాటిగా మారింది. ఈ రైలు తెల్లవారుజామున 4.40 గంటలకు విజయవాడ వెళ్లాల్సి ఉంది. దీనిని నమ్ముకుని ఉత్తరాంధ్ర వైపు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.30 గంటలలోపు అందుబాటులో ఉన్న పలు రైళ్లకు రిజర్వేషన్లు చేయించుకుంటున్నారు. విజయవాడకు వెళ్లే సరికే పలు సందర్భాల్లో ఉదయం 6.30 దాటుతుండడంతో ఆయా లింకు రైళ్లన్నీ వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు రెండు రకాలుగా నష్టపోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది.
సమస్య పరిష్కరించరు..
రైళ్ల రాకపోకలకు సంబంధించి అధికారులు ప్రతి వారం, ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తారు. ఆలస్యానికి కారణాలు గుర్తించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోవడం లేదు. హైదరాబాద్, గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలోని మార్గంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఆలస్యంగా నడుస్తోంది. ఆ నాలుగు డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే ఉన్నాయి. సమస్యను రైల్వే జోనల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదన్న విమర్శలున్నాయి.
ఛార్జీలు భారీగా..
మచిలీపట్నం ఎక్స్ప్రెస్ను నేటికీ ప్రత్యేక రైలుగానే నడుపుతున్నారు. ఫలితంగా సాధారణ రైళ్ల కంటే అదనంగా రుసుములు ఉండడంతో ప్రయాణికులు చేతి చమురు భారీగా వదిలించుకోవాల్సి వస్తోంది.
కారణాలెన్నో....
రైళ్ల రాక ఆలస్యమైతే విషయాన్ని నమోదు చేసి కారణాలు రాయాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోంది. ఫలితంగా తప్పు సరిదిద్దే ప్రయత్నాలు జరగని దుస్థితి తలెత్తుతోంది. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఇంజిన్ను డోన్ స్టేషన్ వద్ద ‘రివర్స్’ చేయాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. పలు సందర్భాల్లో 45 నుంచి 60 నిమిషాల వరకు సమయం తీసుకుంటుండటం గమనార్హం.
* డోన్-నంద్యాల మధ్య డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. ఆయా పనుల కారణంగానూ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ కొంత ఆలస్యంగా నడుస్తోంది. దీనిని ఓ కారణంగా చూపుతున్నారు.
* రైలు నంద్యాల స్టేషన్కు చేరుకునే సరికే సగటున 1.05 గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ వెళ్లేసరికి దాదాపు 2 గంటల సమయం వరకు ఆలస్యమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ పర్యటనకు బయలుదేరిన అహోబిలం పీఠాధిపతి
[ 29-03-2024]
అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ దేశ పర్యటనకు బయలుదేరారు. -
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరవేస్తాం
[ 29-03-2024]
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ను గెలిపించి తెదేపా జెండా ఎగరవేస్తామని ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షులు సాలి సాహెబ్, మండల తెదేపా నాయకులు సతీష్ కుమార్ అన్నారు. -
రానున్న ఎన్నికల్లో తెదేపాదే అధికారం
[ 29-03-2024]
బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
ఎమ్మిగనూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్
[ 29-03-2024]
ఆలూరు తెదేపా అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ను అదిష్ఠానం ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం జాబితాను విడుదల చేసింది. -
ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుందాం
[ 29-03-2024]
ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. -
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు