సర్ది చెప్పేందుకు వెళ్లి.. హత్యకు గురయ్యాడు
రస్తా విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంలో సర్దిచెప్పేందుకు వెళ్లిన రాముడు(54) అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటన వెల్దుర్తి మండలం సిద్దనగట్టు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
రాముడు (పాత చిత్రం)
వెల్దుర్తి, న్యూస్టుడే: రస్తా విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంలో సర్దిచెప్పేందుకు వెళ్లిన రాముడు(54) అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటన వెల్దుర్తి మండలం సిద్దనగట్టు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రస్తా విషయంలో దాయాదులైన లక్ష్మన్న, బాలకృష్ణ కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. ఈ విషయంపై రాముడుతో పాటు, గ్రామస్థులు పెద్దమనుషులుగా ఉండి సర్దుబాటు చేశారు. మంగళవారం ఉదయం లక్ష్మన్న భార్య లక్ష్మీదేవి ఇదే రస్తాలో బహిర్భూమికి వెళ్తుండగా.. ఇటు దారిలేదని బాలకృష్ణ, అతని సోదరుడు మహేష్ అడ్డుకున్నారు. గతంలో రస్తా పంచాయితీ చేసిన రాముడు ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆయన మహేష్, బాలకృష్ణకు సర్దిచెప్పేందుకు వెళ్లారు. ఆగ్రహానికి గురైన మహేష్, బాలకృష్ణ రాముడిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై చంద్రశేఖర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు బాలకృష్ణ, మహేష్పై కేసు నమోదు చేశామన్నారు.
ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరి దుర్మరణం
దేవనకొండ, న్యూస్టుడే: ద్విచక్రవాహనాలు ఎదురెదుగా ఢీకొన్న ఘటనలో రాజశేఖర్(29) అనే వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల మేరకు గోనెగొండ్ల మండలం హెచ్ కైరవాడి గ్రామానికి చెందిన వడ్డె రాజశేఖర్ సోమవారం కోడుమూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కర్నూలు-బళ్లారి రహదారిలోని వీరంపల్లి సమీపంలో ఎదురుగా రాంబాబు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురెదురుగా ఢీ కొనడంతో వడ్డే రాజశేఖర్ తీవ్ర గాయాలు కాగా కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం వేకువజామున మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు నుంచి జారి పడి..
కొండాపురం, న్యూస్టుడే : రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి చెందిన ఘటన కొండాపురం శివారులో మంగళవారం వేకువన చోటు చేసుకుంది. ఎర్రగుంట్ల రైల్వే ఎస్సై వర్మ వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సందీప్ (27) తిరుపతి వెళ్లేందుకు రైలు ఎక్కారు. వాకిలి వద్ద కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు జారిపడి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
అక్కను కాపాడబోయి.. చెల్లెలి మృతి
షబానా మృతదేహం
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: అక్కాబావల మధ్య జరిగిన ఘర్షణ ఆమె ప్రాణాలను హరించింది. భార్యాభర్తల గొడవలో అమాయకురాలు బలైంది. ఈ ఘటన కర్నూలు నగరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీ గడ్డావీధికి చెందిన బ్రెడ్ వ్యాపారి షేక్మహబూబ్బాషాకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. మూడో సంతానమైన ఫర్జానాను అదే కాలనీకి చెందిన బేల్దారు పనిచేసే షేక్ సలీంబాషాతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఫర్జానా పుట్టింటికి చేరుకుంది. దీంతో ఇరువురి మధ్య గొడవ మరింత పెరిగింది. పదిహేను రోజుల క్రితం సలీం బాషా తన కుటుంబసభ్యులతో కలిసి భార్య ఇంటికి వెళ్లి ఘర్షణ పడ్డారు. అతను ఫర్జానాను కొడుతుండగా ఆమె చెల్లెలు షబానా(25) అడ్డుకుంది. కోపోద్రేకంతో సలీం బాషా క్రికెట్బ్యాట్తో షబానా తలపై బలంగా కొట్టాడు. ఆమెకు తీవ్రగాయం కాగా కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. షబానా తండ్రి ఫిర్యాదు మేరకు షేక్ సలీంబాషాపై కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య
కోయిలకొండ (కృష్ణగిరి), న్యూస్టుడే: కృష్ణగిరి మండలంలోని కోయిలకొండ గ్రామానికి చెందిన ఆకుల సూర్యగంగాధర్(23) అనే యువకుడు పెళ్లి ఇష్టం లేక చెట్టుకు ఉరేసుకొని ఆత్యహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రశేఖరరెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన ఆకుల నాగరాజుకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దవాడు సూర్య గంగాధర్కు ఇటీవల కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఇది ఇష్టం లేని యువకుడు తన పొలానికి కొద్ది దూరంలో ఉన్న వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తండ్రి ఆకుల నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పోక్సో కేసులో నిందితుడి అరెస్టు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: నందికొట్కూరు నియోజకవర్గం నాగటూరుకు చెందిన నవీన్ను కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నట్లు నమ్మించి హైదరాబాద్, తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడిపైన కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి