రిజిస్ట్రేషన్లకు వరుస కట్టారు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బుధవారం కిటకిటలాడాయి. గత రెండు రోజులుగా సర్వర్ పనిచేయక రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో మాన్యువల్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.
కిటకిటలాడిన కార్యాలయాలు
కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రద్దీ
కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బుధవారం కిటకిటలాడాయి. గత రెండు రోజులుగా సర్వర్ పనిచేయక రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో మాన్యువల్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. పైగా జూన్ ఒకటో తేదీ నుంచి భూములు, స్థలాల మార్కెట్ విలువలు పెరుగుతున్న సంగతి విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలో క్రయవిక్రయదారులు బుధవారం పెద్ద సంఖ్యలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తరలివచ్చారు. ఫలితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సబ్ రిజిస్ట్రార్లతోపాటు కార్యాలయాల ఉద్యోగులు అవిశ్రాంతంగా పనిచేయాల్సి వచ్చింది.
రూ.2 కోట్లకుపైగా ఆదాయం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారులు రెండు పద్ధతులు (మాన్యువల్, ఆన్లైన్) అనుసరించి రిజిస్ట్రేషన్లు చేశారు. బుధవారం సాయంత్రానికే కర్నూలులో 230, కల్లూరులో 180కిపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఉమ్మడి జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1,500కుపైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. రూ.2 కోట్లకుపైగా ఆదాయం వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎట్టకేలకు ప్రక్రియ జరగటంతో క్రయవిక్రయదారులకు ఎంతో ఊరట కలిగింది. ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాలకు జనం భారీగా తరలిరావడంతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరికి గురై ఇబ్బందులు పడ్డారు.
నేటి నుంచి పెరగనున్న విలువలు
జిల్లాలో భూములు, స్థలాల మార్కెట్ విలువల పెంపు గురువారం నుంచి అమలులోకి రానుంది. దీనికి సంబంధించి జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు వివరాలు సిద్ధం చేశారు. కర్నూలు జిల్లాలోని 11 కార్యాలయాల పరిధిలో 452 ప్రాంతాలు ఉండగా 100 ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ప్రదేశాలను బట్టి 10 శాతం నుంచి 40 శాతం వరకు విలువ పెంచుతున్నారు. ఎక్కడెక్కడ ఎంత పెంచుతారన్నది గురువారం నాటికి స్పష్టత రానుంది. దీనికి సంబంధించిన జీవో బుధవారం రాత్రి విడుదలైంది.
* భూములు, స్థలాల మార్కెట్ విలువలు పెంచొద్దంటూ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు బ్యానర్ కట్టి నిరసన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్