పరదాలు అడ్డుపెట్టి.. వేడికి మస్కా కొట్టి..
ఎండకు బయటకెళ్లలేక.. వేడికి ఇంట్లో ఉండలేక చెమటలు కక్కుతున్నారు. ఉపశమనానికి గదుల్లో ఏసీలు బిగించుకునే స్థోమత అందరికీ ఉండదు. తక్కువ ఖర్చుతో..
ఎండకు బయటకెళ్లలేక.. వేడికి ఇంట్లో ఉండలేక చెమటలు కక్కుతున్నారు. ఉపశమనానికి గదుల్లో ఏసీలు బిగించుకునే స్థోమత అందరికీ ఉండదు. తక్కువ ఖర్చుతో.. అసలు ఖర్చే లేకుండా ఇంటిని చల్లగా మార్చేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
* వేసవిలో గాలి వస్తుందని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం చాలా మందికి అలవాటు. గాలితో పాటు వేడి సైతం ఇంట్లోకి వస్తుంది. మొదటగా వేడికి అడ్డుకట్ట వేయాలి. కిటికీలు, తలుపులకు పరదాలు వేయాలి. కిటికీల వద్ద ఉన్న బ్లైండ్స్లను మూయాలి. ప్రత్యేకించి ఉత్తరం, పశ్చిమ వైపు ఉన్న కిటికీల నుంచి వేడి రాకుండా ముదురు రంగు పరదాలతో మూయాలి. వెలుతురు తగ్గితే లైట్లు వేసుకోవచ్చు. దీంతో చాలావరకు వేడి తగ్గిపోతుంది.
* కిటికీల్లో పూలు, అలంకరణ మొక్కలను పెంచుకోవడం ద్వారా వేడి నేరుగా ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడొచ్చు. మేడపైన తోట పెంచుకోవడం ద్వారా గ్రీన్రూఫ్గా మార్చుకోవచ్చు.
* అపార్ట్మెంట్ బాల్కనీల్లో ప్రస్తుతం స్లైడ్ డోర్లు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బాల్కనీల్లోంచి నేరుగా ఎండ, వేడి గాలి లోపలికి రాకుండా సమ్మర్ షేడ్ మ్యాట్లను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం వెదురుతో సహా రకరకాల సామగ్రితో అందంగా తయారు చేసిన చాపలు దొరుకుతున్నాయి. ఇవి చాలావరకు వేడిని అడ్డుకుంటాయి. ఈ చాపలను నీటితో తడిపితే చల్లని గాలి లోపలికి వస్తుంది. సైడ్డోర్లు మూయాల్సిన పని ఉండదు. వేసవిలోనే కాదు వర్షాకాలంలో వాననీరు లోపలికి రాకుండా ఉపయోగపడుతుంది. ఇవేవి లేకపోయినా.. ఇంట్లో పాతబెడ్షీట్ను సైతం అడ్డుగా వేసుకోవచ్చు.
* వేసవిలో ఇంట్లో ఫ్యాన్లు 24 గంటలూ తిరుగుతుంటాయి. ఎక్కువ వేగంతో తిరిగితే మరింత వేడి గాలే వస్తుంది. అందుకే కావాల్సిన వేగంతో పెట్టుకోవాలి. మధ్యమధ్యలో ఆపి తిరిగి వేసుకోవాలి.
* సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గగానే కిటికీలు, తలుపులు తెరవడం ద్వారా బయటి నుంచి చల్లనిగాలి ఇంట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఇంట్లో ఉక్కపోత ఎక్కువ కాబట్టి గంటసేపు ఆరుబయట గడపడం మేలు.
* మేడపైన చల్లదనానికి కూల్ పెయింట్స్ వేసుకోవచ్చు.
* తెలుపు రంగు ఎల్ఈడీలు మేలు. వానాకాలం, శీతాకాలంలో వామ్ వైట్ లైటింగ్ను వినియోగించుకోవచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వినాసికారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు