పెద్ద పులి సంచారంతో ఆందోళన
మండలంలోని శ్రీశైలం ముంపు ప్రాంతమైన పాత బట్టువారిపల్లి సమీపంలో పెద్ద పులి సంచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఉదయం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన యువకుడు
పాదముద్రలు పరిశీలిస్తున్న అటవీ అధికారులు
కొత్తపల్లి, న్యూస్టుడే : మండలంలోని శ్రీశైలం ముంపు ప్రాంతమైన పాత బట్టువారిపల్లి సమీపంలో పెద్ద పులి సంచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఉదయం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఈశ్వర్ ద్విచక్ర వాహనంపై ముంపు ప్రాంతంలోని రహదారి గుండా పగిడ్యాల మండలంలోని ఘణపురానికి వెళుతుండగా మార్గమధ్యలో పాత బట్టువారిపల్లి సమీపంలో పెద్ద పులి కనిపించిందని గ్రామస్థులకు చెప్పారు. తాను వెనుదిరిగి కొంతదూరం వచ్చి చూడగా ఎద్దులేరువాగు వైపు వెళుతూ కనిపించినట్లు ఆ యువకుడు వివరించారు. దీంతో జడ్డువారిపల్లి, సింగరాజుపల్లి, ముసలిమడుగు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు దాడి చేస్తుందోనని ఆందోళనలో మునిగిపోయారు. ఆదుకోవాలని వినవిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలు పరిశీలించారు. గొర్రెలు, మేకలు తిరగడంతో పాదముద్రలు చెదిరిపోయాయని, గురువారం ఉదయాన్నే వచ్చి మళ్లీ పాదముద్రలు పరిశీలిస్తామని ఎఫ్ఎస్వో నాగేశ్వరరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్