logo

అమ్మా.. వెళ్లిపోతున్నా!

‘అమ్మా.. వెళ్లిపోతున్నా. క్షమించు.. నా పిల్లలను బాగా చూసుకోండి’ అంటూ పట్టాలపై పడుకుని సెల్ఫీవీడియోతో పోలీసు వాహన డ్రైవర్‌ ఖాసీం పీరా(32) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

Published : 01 Jun 2023 02:34 IST

పోలీసు వాహన డ్రైవర్‌ ఆత్మహత్య

ఖాసీం పీరా  (పాత చిత్రం)

ఆదోని పట్టణం, న్యూస్‌టుడే: ‘అమ్మా.. వెళ్లిపోతున్నా. క్షమించు.. నా పిల్లలను బాగా చూసుకోండి’ అంటూ పట్టాలపై పడుకుని సెల్ఫీవీడియోతో పోలీసు వాహన డ్రైవర్‌ ఖాసీం పీరా(32) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆదోని- ఇస్వీ రైల్వే స్టేషన్ల మధ్య కి.మీ. సంఖ్య 500-16 వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై రామస్వామి తెలిపారు. ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన ఎస్‌.ఖాసీం పీరా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై జీపు డ్రైవర్‌ గా పనిచేసేవారు. ఆయనకు భార్య ఫాతీమా, తొమ్మిదేళ్ల కుమారుడు అబ్బాస్‌, 11ఏళ్ల కుమార్తె ఆఫ్రీన్‌ ఉన్నారు. కడుపు నొప్పి తాళలేక ఖాసీం పీరా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య, తల్లి తోఫియా బేగం  తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని