logo

శ్రీమఠంలో ద్వాదశి పూజలు

ద్వాదశి సందర్భంగా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో విశేష పూజలు నిర్వహించారు. మరోవైపు ద్వాదశిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Published : 02 Jun 2023 02:00 IST

మంత్రాలయం, న్యూస్‌టుడే: ద్వాదశి సందర్భంగా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో విశేష పూజలు నిర్వహించారు. మరోవైపు ద్వాదశిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామి బృందావనానికి జలాభిషేకం, పంచామృతాభిషేకం చేసి, బంగారు కవచాలు, విశేష పుష్పాలతో అలంకరించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు పూజా మందిరంలో జయ, దిగ్విజయ, మూల రాములకు పూజలు చేశారు. గ్రామ దేవత మంచాలమ్మకు, రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి మంగళహారతులు ఇచ్చారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు బంగారు పల్లకి సేవ, చెక్క, బంగారు, నవరత్న రథోత్సవంపై అశేష జనవాహిని మధ్య ఊరేగించారు. అనంతరం ఊంజల సేవ జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని