logo

ఘనంగా స్వాతి వేడుకలు

అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా గురువారం విశేష పూజలు నిర్వహించారు.

Published : 02 Jun 2023 02:00 IST

అహోబిలం (ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా గురువారం విశేష పూజలు నిర్వహించారు. ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుంచి ఆభరణాలు, పట్ట్టువస్త్రాలతో అలంకరించారు.   స్వాతి సుదర్శన హోమం జరిపారు. ఉత్సవమూర్తులకు మంగళహారతులిచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్‌, ప్రత్యేకాధికారి శివప్రసాద్‌, జీపీఏ సంపత్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని