జనంపై పిడుగు
ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం పిడుగుపాటుకు గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
నలుగురి మృత్యువాత
పలువురికి అస్వస్థత
ఆలూరు, హాలహర్వి, న్యూస్టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం పిడుగుపాటుకు గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. హాలహర్వి మండలం బలగోటలోని బసవేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఓ వివాహ వేడుకకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు వచ్చారు. మధ్యాహ్నం కొందరు ఆలయం సమీపంలోని చెట్టు వద్ద ఉండగా ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. శిరుగుప్ప తాలుకా బొమ్మలాపురానికి చెందిన బసవరాజ్గౌడ్, ఉత్నూరుకు చెందిన శేఖర్ గౌడ్ మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా ఆలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉరుములు, గాలుల కారణంగా విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. ఆసుపత్రిలోనూ విద్యుత్తు లేకపోవడంతో బాధితులకు టార్చిలైట్, సెల్ఫోన్ వెలుతురులో చికిత్స అందించాల్సి వచ్చింది.
* కోసిగి మండలం వందగల్లు గ్రామానికి చెందిన యువ రైతు ఈరేష్ పొలం పనులకు వెళ్లి పిడుగు పడటంతో ప్రాణాలు వదిలారు. ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నెలో చక్రవర్తి (20) పిడుగు పాటుకు గురై మృతి చెందారు.
గడివేముల : గడివేములకు చెందిన దూదేకుల మాబాషా, దూదేకుల మాసుంవలి పొలానికి వెళ్లగా పిడుగు పడటంతో అస్వస్థతకు గురయ్యారు. 108లో ఆస్పత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
‘‘మద్యం కారణంగా అన్యాయానికి గురవుతున్న అక్కచెల్లెమ్మల బాధ చూడలేకున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని’’ 2017లో ప్రజా సంకల్ప పాదయాత్రకు చాగలమర్రికి వచ్చిన సందర్భంలో జగన్ ప్రగల్భాలు పలికారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)