తైక్వాండోలో బాద్షా నవాజ్
ఆత్మరక్షణ క్రీడ అయిన తైక్వాండోకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. గతంలో క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ వంటి క్రీడల పట్ల మొగ్గుచూపుతున్న యువత ప్రస్తుతం తైక్వాండోపై దృష్టి సారిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న యువకుడు
న్యూస్టుడే, నంద్యాల గాంధీచౌక్: ఆత్మరక్షణ క్రీడ అయిన తైక్వాండోకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. గతంలో క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ వంటి క్రీడల పట్ల మొగ్గుచూపుతున్న యువత ప్రస్తుతం తైక్వాండోపై దృష్టి సారిస్తున్నారు. క్రీడా సంఘాల వారు శిక్షణ ఇస్తూ.. టోర్నమెంట్లు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో చాలామంది ఈ ఆట నేర్చుకుని పోటీల్లో సత్తా చాటుతూ విజయ పథంలో సాగిపోతున్నారు. ఇదే కోవలో నంద్యాలకు చెందిన షానవాజ్ఖాన్ తైక్వాండో నేర్చుకుని జాతీయస్థాయిలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.
* నంద్యాల పట్టణం సంజీవనగర్కు చెందిన సర్ధార్ఖాన్, రుక్సానా ఖాతూన్ దంపతుల కుమారుడు షానవాజ్ఖాన్. ఇంటర్ పూర్తిచేశాడు. తండ్రి తైక్వాండో కోచ్గా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకున్న షానవాజ్ తైక్వాండోలో రాణించాలని నిర్ణయించుకున్నాడు. 2015 నుంచి తండ్రి వద్దే శిక్షణ తీసుకుంటూ ఆటపై పట్టు సాధించాడు. పోటీల్లో ప్రతిభ చూపుతూ విజేతగా నిలుస్తున్నాడు.
సివిల్స్ సాధించడమే లక్ష్యం
- షానవాజ్ఖాన్
నాకు చదువుతో పాటు ఆటలంటే మక్కువ. రెండింట్లో రాణిస్తున్నా. ప్రస్తుతం తైక్వాండోలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నా. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాధన చేస్తున్నా. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత సివిల్స్లో రాణించి ఐఏఎస్ లేదా ఐపీఎస్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నా.
ఆటలో ప్రతిభ..
* 2015లో నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని బంగారు పతకం అందుకున్నాడు.
* 2017లో కర్నూలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం గెలుపొందాడు.
* 2017లో కడపలో జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో బంగారు పతకం సాధించాడు.
* 2018లో నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం అందుకున్నాడు.
* 2020లో బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు.
* 2021లో బెంగళూరులో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం అందుకున్నారు.
* 2022లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో టోర్నమెంట్లో స్వర్ణం గెలుపొందాడు.
* 2022లో దిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించాడు.
* 2022లో బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి టోర్నమెంట్లో సత్తాచాటి బంగారు పతకం అందుకున్నాడు.
* 2023లో గోవాలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో రాణించి స్వర్ణం గెలుపొందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!