అనుకూలతలున్నా.. నిర్లక్ష్యమే
కర్నూలు రైల్వేస్టేషన్కు మరిన్ని రైళ్లు తీసుకొచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. అధికారులు, పాలకులు ఆమేర దృష్టి సారించడం లేదు.
కర్నూలుకు రైళ్ల పొడిగింపుపై దృష్టేదీ?
పట్టించుకోని పాలకులు
ఈనాడు, కర్నూలు: కర్నూలు రైల్వేస్టేషన్కు మరిన్ని రైళ్లు తీసుకొచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. అధికారులు, పాలకులు ఆమేర దృష్టి సారించడం లేదు. రైల్వేలపై పెద్దగా భారం పడకుండా, కొత్తవి అవసరం లేకుండా సమీప స్టేషన్లకు వస్తున్న రైళ్లను కర్నూలు వరకు పొడిగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. సునాయాసంగా రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలను గాలికొదిలేసి కర్నూలు నుంచి విజయవాడ మీదుగా విశాఖ వరకు పెట్ సర్వే (ప్రిలిమినరీ ఇంజినీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే) పేరుతో హడావుడి చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
* విశాఖపట్నం నుంచి కాచిగూడ వరకు నడిచే రైలును ఇటీవల మహబూబ్నగర్ వరకు పొడిగించారు. ఈ రైలు ఉదయం 9.20 గంటలకు మహబూబ్నగర్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4.10 గంటలకు మహబూబ్నగర్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖ వెళ్తుంది. ఈ రైలు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంది. దీనిని కర్నూలు వరకు పొడిగించేందుకు అన్నిరకాల అనుకూలతలు ఉన్నాయి. మహబూబ్నగర్ నుంచి 2.50 గంటలలోపే కర్నూలు చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రైలు సాయంత్రం వరకు ఖాళీగా ఉంటోంది. అలాకాక కర్నూలు వరకు పొడిగిస్తే నిత్యం వేలాది మందికి సౌకర్యంగా ఉండటంతోపాటు రైల్వేకు ఆదాయం సైతం లభిస్తుంది. కర్నూలు జిల్లా వాసులతోపాటు గద్వాల, వనపర్తి తదితర ప్రాంతాలవారు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నేరుగా వెళ్లేందుకు రైలు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.
డోన్ వరకు నడిపితే..
సికింద్రాబాద్లో ఉదయం 7.40 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు వచ్చే తుంగభద్ర ఎక్స్ప్రెస్ సాయంత్రం మూడు గంటల వరకు స్టేషన్లోనే ఉంటోంది. ఈ ఖాళీ సమయంలో డోన్ వరకు వెళ్లి వచ్చేందుకు అన్నిరకాల అనుకూలతలు ఉన్నాయి. అయినప్పటికీ కర్నూలు స్టేషన్లోనే నిరుపయోగంగా ఉంచుతున్నారు. తుంగభద్ర రైలును డోన్ వరకు పొడిగిస్తే నగరం నుంచి డోన్ వెళ్లాల్సినవారు.. డోన్ నుంచి నేరుగా సికింద్రాబాద్ వైపు వెళ్లాలనుకునేవారు సులువుగా తమతమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తుంగభద్ర రైలు పొడిగింపుపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
ఆదాయం కోల్పోతూ..
రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైన రైలు సర్వీసులను సాధించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు లేఖలు రాసి మమ అనిపించేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులైతే అసలు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రైల్వే అధికారులు నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ అదనపు సర్వీసులపై పెద్దగా ఒత్తిడి తీసుకురావడం లేదు. ఫలితంగా కర్నూలు రైల్వేస్టేషన్ నుంచి ఆశించిన స్థాయిలో రైలు సర్వీసులు లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైల్వే శాఖ అదనపు ఆదాయాన్ని కోల్పోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
-
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?