విద్యా కానుక.. అరకొరే
ఏటా బడుల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
మరో 10 రోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
పూర్తిస్థాయిలో చేరుకోని కిట్లు
సి.బెళగల్ మండల విద్యావనరుల కేంద్రానికి చేరిన పుస్తకాలు
కర్నూలు విద్య, నంద్యాల పట్టణం, న్యూస్టుడే: ఏటా బడుల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలో మొదటి రోజే పూర్తి స్థాయిలో జగనన్న విద్యా కిట్లు అందించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాకు ఇప్పటి వరకు వచ్చిన బూట్లు, సమదుస్తులు, పిక్టోరియల్, ఆక్స్ఫర్డ్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను ఆయా మండల కేంద్రాలకు సరఫరా చేశారు. వాస్తవానికి పరిశీలిస్తే ఇప్పటికీ అవసరమైన సామగ్రి అందలేదు. నంద్యాల జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది.
నోటు పుస్తకాలు.. బ్యాగులు రాలేదు..
నంద్యాల జిల్లాకు పాఠ్య పుస్తకాలు (సెమ్ 1) 11,01,219 రావాల్సి ఉండగా 6,64,095 మాత్రమే వచ్చాయి. ఇంకనూ 4,37,124 పుస్తకాలు రావాల్సి ఉంది. సమదుస్తులు 1,62,276 అవసరం కాగా.. 1,13,055 వచ్చాయి. నోటు పుస్తకాలు 9,56,152 రావాల్సి ఉండగా ఒక్కటి కూడా రాలేదు. బూట్లు, సాక్సులు 1,62,276 రావాల్సి ఉండగా అందలేదు. బ్యాగులు 1,62,276 అవసరం కాగా ఒక్కటి కూడా రాకపోవడం గమనార్హం.
ఆయా మండలాల్లో ఇలా..
కర్నూలు జిల్లా పరిధిలో ఆదోని, ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి, హొళగుంద, కోసిగి, కౌతాళం, మంత్రాలయం, నందవరం, పెద్దకడబూరు, ఎమ్మిగనూరు మండలాలకు సమదుస్తులు ఒక్కటి కూడా కేటాయించలేదు. ఆస్పరి, ఆలూరు, సి.బెళగల్, దేవనకొండ, హాలహర్వి, హొళగుంద, కల్లూరు, కోడుమూరు, కౌతాళం, కృష్ణగిరి, మంత్రాలయం, ఓర్వకల్లు, పత్తికొండ, పెద్దకడబూరు, వెల్దుర్తి మండలాలకు బ్యాగులు అందలేదు. జిల్లా పరిధిలోని ఒక్క మండలానికి కూడా నోటు పుస్తకాలు, బెల్టులు అందకపోవడం గమనార్హం.
60 శాతం వరకు వచ్చిన సామగ్రి
కర్నూలు జిల్లాలో ఉన్న ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో సుమారు 2,92,955 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటి వరకు బ్యాగులు 1,01,700, బూట్లు 2,76,868, సమ దుస్తులు 1,46,765, పిక్టోరియల్ పుస్తకాలు 25,187, ఆక్స్ఫర్డ్ నిఘంటువులు 13,463, పాఠ్య పుస్తకాలు 11,34,536, వర్క్ బుక్స్ 3,50,607 వచ్చాయి. ఒక్కో విద్యార్థికి రెండు జతల సమ దుస్తులు ఇస్తారు. ఈ లెక్కన చూస్తే ఇంకనూ సుమారు 4.40 లక్షల వరకు సమ దుస్తులు రావాల్సి ఉంది. గతేడాది జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ సమయానికి పూర్తి స్థాయిలో కానుకలు లేకపోవడంతో ఒక్కో పాఠశాలకు ఐదు కిట్లు ఇచ్చి పంపిణీ చేశారు. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది విద్యా ప్రారంభం రోజు జగనన్న విద్యా కానుకలు పూర్తిగా అందజేస్తామని సమగ్ర శిక్ష ప్రాజెక్టు అదనపు సమన్వయకర్త వేణుగోపాల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా