గడువు ముగిసింది.. నిషేధం వచ్చింది
సాధారణ బదిలీల ప్రక్రియ మే నెలాఖరుకు ముగిసింది. జూన్ ఒకటో తేదీ నుంచి బదిలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రెవెన్యూలో ప్రారంభంకాని బదిలీల ప్రక్రియ
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: సాధారణ బదిలీల ప్రక్రియ మే నెలాఖరుకు ముగిసింది. జూన్ ఒకటో తేదీ నుంచి బదిలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ నిర్వహించలేదు. కర్నూలు జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా.. నంద్యాల కలెక్టర్ మెంబర్గా బదిలీలు చేపట్టాల్సి ఉంది. వీఆర్వో కేడర్ నుంచి డీటీ, తహసీల్దారు కేడర్ వరకు బదిలీలు చేయాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఆ ఊసే లేకుండా పోయింది.
దరఖాస్తు చేసుకున్నా..
కర్నూలు జిల్లాలో 11 మంది తహసీల్దార్లు, 19 మంది ఉప తహసీల్దార్లు, 20 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లు, ఆరుగురు డీటీలు బదిలీల కోసం కర్నూలు కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలకు సంబంధించిన జాబితా నంద్యాల జిల్లా నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి ఇప్పటి వరకు రాలేదు. ఇక జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్వోలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 60-70 మంది వరకు ఉంటారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా నుంచి కర్నూలు జిల్లా కలెక్టర్కు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ హడావుడి కనిపించడం లేదు.
సిఫార్సు లేఖలే అధికం
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వీఆర్వోల బదిలీలు సైతం కర్నూలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే జరగాల్సి ఉంది. నంద్యాల జిల్లా నుంచి బదిలీలకు సంబంధించిన వివరాలు రాలేదని జిల్లా రెవెన్యూ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కొందరు రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు బదిలీల కోసం అధికార పార్టీకి చెందిన నేతల సహకారంతో ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయం నుంచి జిల్లాకు బదిలీల సిఫార్సులు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి కోరుకున్న చోటుకు బదిలీ చేసేలా సిఫార్సు లేఖలు తీసుకుని దరఖాస్తులను కలెక్టరేట్లోని రెవెన్యూ అధికారులకు నివేదించారు. గ్రామ, వార్డు సచివాలయ గ్రేడ్-2 వీఆర్వోలు సైతం ప్రజాప్రతినిధుల సిఫార్సులతో బదిలీ కోసం దరఖాస్తులు ఇచ్చారు. మొత్తం మీద సిఫార్సు లేఖలే అధికంగా ఉన్నాయి. ఎలాంటి సిఫార్సులు లేకుండా బదిలీలకు దరఖాస్తు చేసుకున్న రెవెన్యూ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందనే చెప్పవచ్చు.
సీఎం పర్యటన కారణంగానే..
పరిపాలనాపరంగా అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ కీలకం. సాధారణ బదిలీల గడువు ముగిసి మూడు రోజులైనా బదిలీల ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఆయా శాఖల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించకుంటే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టే పరిస్థితి ఉంది. అయినా పాలనాధికారులు జాప్యం చేయడంపై ఎవరూ నోరు మెదపడం లేదు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి కార్యక్రమం ఉండటంతో బదిలీల ప్రక్రియ కాస్య ఆలస్యమైందని కొందరు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గడువు ముగిసినప్పటికీ మే 31వ తేదీతో బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారని.. దీనికి ఆందోళన చెందాల్సిన పనిలేదని మరికొందరు అంటున్నారు. అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన రెవెన్యూ శాఖలో ఏటా బదిలీల ప్రక్రియ గడువు ముగిసిన నాలుగైదు రోజుల తర్వాతే బదిలీల ఉత్తర్వులు బయటకు వస్తాయన్నది సర్వసాధారణమైంది. రెండు జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలు, జేసీలు సమావేశమై వీఆర్వో కేడర్ నుంచి తహసీల్దారు కేడర్ వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్