ఖాళీలు ప్రకటించి పదోన్నతులు చేపట్టాలి
ఉపాధ్యాయ ఖాళీలు చూపించి పదోన్నతులు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రఘు పేర్కొన్నారు.
నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
కర్నూలు విద్య, న్యూస్టుడే: ఉపాధ్యాయ ఖాళీలు చూపించి పదోన్నతులు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రఘు పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఉన్న జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలుగు, హిందీ, పీడీ ఖాళీలను బ్లాక్ చేయడంతో సీనియర్ పండిత ఉపాధ్యాయులకు తీరని నష్టం చేకూరుతుందన్నారు. నాన్ లాంగ్వేజ్ ఖాళీలను బ్లాక్ చేయకుండా తెలుగు, హిందీ, పీడీ ఖాళీలు బ్లాక్ చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు హబీబుల్లా, ప్రధాన కార్యదర్శి నాగేంద్రుడు, రాష్ట్ర కార్యదర్శులు ప్రేమ్కుమార్, చిన్న రామన్న, వెంకటరామిరెడ్డితోపాటు పండిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్