ఫుట్బాల్... గోల్పైనే గురి
పేదింటి బిడ్డలు ఫుట్బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. లక్ష్య సాధనకు కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో పతకాలు సాధిస్తున్నారు.
జాతీయస్థాయిలో రాణిస్తున్నవిద్యార్థులు
న్యూస్టుడే,ఎమ్మిగనూరు
పేదింటి బిడ్డలు ఫుట్బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. లక్ష్య సాధనకు కఠోర శ్రమ, కృషి, పట్టుదలతో పతకాలు సాధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుతోపాటు ఆటల్లోనూ ఆరితేరుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులు రెండు రోజుల క్రితం ఏపీ జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
సెంటర్ ఫార్వర్డ్లో సత్తా
ఎమ్మిగనూరుకు చెందిన నడవలయ్య ఇంటర్ చదువుతూ మరోవైపు కూలీ పనులకు వెళ్తుంటారు. ఆటలపై ఆసక్తితో పీఈటీ నరసింహరాజు శిక్షణతో ఫుట్బాల్లో రాణిస్తున్నారు. ఆటలో సెంటర్ ఫార్వర్డ్లో ఎదుటి జట్టును గోల్ చేయకుండా అడ్డుగోడలా నిలవడంలో నిష్ణాతులు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ నెల 7 నుంచి జరుగనున్న పోటీల్లో ఏపీ జట్టు తరఫున తలపడనున్నారు. గతంలోనూ ఏపీ జట్టులో కర్నూలులో జరిగిన పోటీల్లో పాల్గొని ఉత్తమ క్రీడాకారునిగా నిలిచారు. 2021లో రాష్ట్ర స్థాయి పోటీల విభాగంలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన పోటీల్లో పాల్గొని విజయవాడ, గుంటూరు జట్లను ఒడించడంలో కీలకంగా వ్యవహరించి అవార్డును అందుకున్నారు. అదే ఏడాది వైఎస్సార్ జిల్లా పుట్టంపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. సబ్ జూనియర్ విభాగంలో 2019లో ముంబయిలో జరిగిన నేషనల్ ఫుట్బాల్ క్రీడా పోటీలకు ఏపీ జట్టు తరఫున ఆడారు. కోల్కత్తా, మిజోరాం జట్లను ఓడించడంలో ప్రతిభ కనబరిచి ఉత్తమ క్రీడాకారునిగా అవార్డు తీసుకున్నారు.
ఉత్తమ క్రీడాకారునిగా ప్రతిభ
పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థి సిద్ధూ ఆరేళ్లుగా ఫుట్బాల్ పోటీల్లో రాణిస్తున్నారు. ప్రతిరోజూ మైదానంలో మూడు గంటలపాటు సాధన చేసి మెలకువలు నేర్చుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారు. జూనియర్ అండర్-19 విభాగంలో మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 2019, 2021, 2022, 2023లో నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలులో జరిగిన పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొని ఉత్తమ క్రీడాకారునిగా అవార్డు తీసుకున్నారు. ముంబయిలో 2019లో జరిగిన జాతీయ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బెంగళూరులో జరిగిన సబ్ జూనియర్ విభాగంలోనూ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం