ఆర్యూలో ఆయన చెప్పిందే వేదం
రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఏదో ఒక అంశంపై ఆరోపణలు రావడం.. పలు అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిపై కమిటీలు వేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక శాఖ, ఈసీ ఆమోదం లేకుండానే నోటిఫికేషన్
రోస్టర్ పాయింట్ల కేటాయింపులో జాప్యం
కర్నూలు విద్య, న్యూస్టుడే : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఏదో ఒక అంశంపై ఆరోపణలు రావడం.. పలు అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిపై కమిటీలు వేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు జిల్లా విద్యాశాఖ తేల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఇటీవల ఆర్యూ అధికారులు ప్రకటించారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆర్యూలో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రొఫెసర్ అంతా నేను చూసుకుంటాలే.. అంటూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అభయం ఇస్తున్నట్లు సమాచారం.
యూజీసీ నిబంధనల బేఖాతరు
ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ విషయంలో రోస్టర్ పాయింట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగిందంటూ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. యూజీసీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేముందు ఆర్యూ పాలకమండలిలో ఆమోదించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి అనుమతి కోసం పంపాల్సి ఉంది. నోటిఫికేషన్లో మహిళా రిజర్వేషన్ ఒక్కటీ చూపకపోవడం గమనార్హం. వీసీ పదవీ విరమణ సమయం ఆరు నెలలు ఉంటే ఈ వ్యవధిలో కొత్త పోస్టుల నియామకం, నూతన కోర్సుల ప్రారంభం చేపట్టకూడదని జీవో నంబరు 167 స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధనలూ ఉల్లంఘించారని పలువురు అభ్యర్థులు గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
* రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో నియామకాలు చేపట్టే అంశం డివిజన్ బెంచ్ కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ ఆర్యూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలు ఎలా భర్తీ చేస్తారని పలువురు ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు.
* పీహెచ్డీ పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యమిస్తూ పీజీ, ఎన్ఐటీ, ఐఐటీ, బిట్స్ పిలానీలో చదివిన వారికి నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఈ నిబంధన ఎక్కడా పాటించలేదని తెలుస్తోంది.
కోర్టును ఆశ్రయించి..
* 2021లో ఆర్యూలోని ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం 1 నుంచి 26 వరకు రోస్టర్ పాయింట్లు చూపారు. ఇంతవరకు బాగానే ఉన్నా 2023 ఏప్రిల్ 25న మరోసారి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లో 27వ నంబరు నుంచి రోస్టర్ పాయింట్ల చూపాల్సి ఉండగా 22వ నంబరు నుంచి 91వ నంబరు వరకు చూపారు. రోస్టర్ పాయింట్లు వరుసగా లేకపోవడంతో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ఆపేయాలంటూ హైకోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ కొందరు ప్రొఫెసర్లు అత్యుత్సాహం ప్రదర్శించి దరఖాస్తులు తీసుకొని అక్రమాలకు పాల్పడుతూ పలువురు అభ్యర్థులకు అభయం ఇస్తున్నట్లు సమాచారం.
* నోటిఫికేషన్లో చూపించని రోస్టర్ పాయింట్లు: 23, 26, 28, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 46, 47, 54, 55, 59, 62, 64, 65, 66, 67, 70, 71, 72, 73, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90. యూజీసీ నిబంధన మేరకు ఈ రోస్టర్ పాయింట్లు నోటిఫికేషన్లో చూపించాల్సి ఉండగా చూపకపోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* ఈ విషయమై రాయలసీమ విశ్వవిద్యాలయం వీసీ ఆనందరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించి యూజీసీ నిబంధన మేరకే దరఖాస్తులు తీసుకుంటున్నామని చెప్పారు. కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ ఉన్నత విద్యామండలి అనుమతితో దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
[ 28-03-2024]
మండలంలోని కెశింగవరం గ్రామానికి చెందిన నాగరాజు (48) ఏండ్లుపలొడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. -
ఎన్నికల విధులపై అలసత్వం వద్దు
[ 28-03-2024]
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అలసత్వం లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు
[ 28-03-2024]
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద సీఎం జగన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. -
వైకాపాకు ఓటు వేయాలి
[ 28-03-2024]
నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వై. బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి అన్నారు. -
శ్రీశైలంలో వైకాపాకు మరో షాక్
[ 28-03-2024]
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. -
కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం
[ 28-03-2024]
మండలం కేంద్రమైన కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. -
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 28-03-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో గురువారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
కేంద్ర బలగాల కవాతు
[ 28-03-2024]
ఆదోని పట్టణంలో కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-03-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
పాదయాత్ర మాటపాలనలో జూట
[ 28-03-2024]
ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. -
ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
[ 28-03-2024]
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. -
బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు
[ 28-03-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. -
మఠం స్థలానికి ఎసరు
[ 28-03-2024]
ఆదోని పట్టణ శివారులోని బైపాస్ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. -
ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి
[ 28-03-2024]
ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. -
29న బనగానపల్లికి చంద్రబాబు రాక
[ 28-03-2024]
బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి బుధవారం తెలిపారు. -
కేసులు నమోదైతే కొలువు కష్టమే
[ 28-03-2024]
చట్ట నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వాలంటీర్లపై కేసులు నమోదైతే మళ్లీ వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. -
తెదేపాలోనే బీసీలకు పెద్దపీట
[ 28-03-2024]
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. -
వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు
[ 28-03-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి
[ 28-03-2024]
ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 28-03-2024]
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. -
అభివృద్ధికి ఓటేయండి
[ 28-03-2024]
కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ అన్నారు. -
తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా
[ 28-03-2024]
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
[ 28-03-2024]
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!