నిర్వహణ గాలికి.. వాహనాలు మూలకు
డోన్ పట్టణంలో పురపాలక సంఘానికి సంబంధించి మినీ పొక్లెయిన్ ఓసారి మరమ్మతులకు గురైతే కర్నూలులోని షోరూంలో రూ.33 వేలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించారు.
స్వచ్ఛతపై దృష్టి సారించని అధికారులు
నిరుపయోగంగా వాహనాలు
తుప్పు పట్టి..
డోన్ పట్టణంలో పురపాలక సంఘానికి సంబంధించి మినీ పొక్లెయిన్ ఓసారి మరమ్మతులకు గురైతే కర్నూలులోని షోరూంలో రూ.33 వేలు ఖర్చు చేసి మరమ్మతులు చేయించారు. కొన్ని రోజులు పనిచేసి ప్రస్తుతం మూలకు చేరింది. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ కింద వచ్చిన వాహనాల్లో కొన్ని మరమ్మతులకు నోచుకోవడం లేదు. కాల్వల్లో పూడిక తొలగించే లోడర్ విలువ రూ.25 లక్షలు. వీధుల్లో కాల్వలు చిన్నవిగా ఉండటంతో ఈ వాహనం ద్వారా పూడిక తొలగించలేని పరిస్థితి. దీనిని జీడీపీ ప్లాంటు వద్ద వృథాగా ఉంచారు. మూడు కాంపాక్టర్లు రాగా వాటిలో ఒకటి మరమ్మతుకు గురై తుప్పు పట్టిపోతోంది. రూ.25 లక్షలతో స్వీపింగ్ యంత్రం తెప్పించారు. కొన్నాళ్లపాటు ఉపరితల వంతెన, వంతెనకు ఇరువైపులా రహదారులను శుభ్రం చేయించారు. ఆ యంత్రానికి ఉన్న బ్రష్లు పోవడం, ఇంజిన్ సరిగా పనిచేయక మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నిరుపయోగంగా ఉంచారు.
న్యూస్టుడే, డోన్ పట్టణం
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాల పురపాలక సంఘాల్లో యాంత్రీకరణ ద్వారా స్వచ్ఛ వాతావరణం కల్పించేందుకు అత్యాధునికమైన వాహనాలు, పరికరాలను ప్రభుత్వం అందించింది. యంత్రాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పని చేయించడం ద్వారా ఆయా ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలనేది లక్ష్యం. గత ప్రభుత్వంలో పారిశుద్ధ్య నిర్వహణకు కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చేయూతతో వివిధ రకాల వాహనాలు సమకూరాయి. ఇందులో చిన్న, పెద్ద కాంపాక్టర్లు, డోజర్లు, నాలా క్లీనర్లు, రోడ్డు స్వీపింగ్ యంత్రాలు, డంపర్ బిన్లు.. తదితర వాహనాలు అందించారు. వీటి నిర్వహణపై సరైన శ్రద్ధ చూపకపోవడంతో మూలనపడ్డాయి. ఫలితంగా రూ.కోట్లు వెచ్చించి కేటాయించిన వాహనాలు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పనిరాకుండా పోతున్నాయి. ఆదోని పురపాలకం, న్యూస్టుడే
మూలన పెట్టేశారు
ఆదోని పురపాలక సంఘానికి రెండు రోడ్డు స్వీపింగ్ వాహనాలు వచ్చాయి. ఒక్కో దాని విలువ రూ.లక్షల్లో ఉంటుంది. ఇవి వచ్చి ఐదేళ్లు దాటిపోయింది.. ఇంతవరకు పూర్తిస్థాయిలో వినియోగించలేదు. మధ్యలో ఓసారి విమర్శలు రావడంతో కొన్ని రోజులపాటు వినియోగించారు. ఆ తర్వాత మూలన పెట్టేశారు. ఏటా వీటి నిర్వహణ కోసం గతంలో రూ.20 లక్షలతో టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా వృథాగా పడేశారు. వీటితోపాటు మూడు నాలా క్లీనింగ్ వాహనాలు వచ్చాయి. ఇవన్నీ మూలనపడ్డాయి. గతంలో సైతం ఓ పెద్ద కాంపాక్టరు విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది.
నిపుణులు దొరక్క
నంద్యాల పురపాలక సంఘంలో గత ప్రభుత్వ హయాంలో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా పలు వాహనాలు వచ్చాయి. రెండు స్వీపింగ్ యంత్రాలు రాగా కొంత కాలం పాటు నిర్వహించారు. వీటికి డ్రైవర్లు దొరక్క మూలకు నెట్టేశారు. నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటంతో నంద్యాల పురపాలక సంఘం వీటి నిర్వహణకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. వాహనాలు తరచూ పాడవుతుండటం.. నిపుణులు దొరక్క చేసేదిలేక రూ.లక్షల విలువ చేసే వాహనాలు ఇలా మూలన పెట్టేశారు.
న్యూస్టుడే, నంద్యాల పురపాలకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు ఓటు వేయాలి
[ 28-03-2024]
నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వై. బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి అన్నారు. -
శ్రీశైలంలో వైకాపాకు మరో షాక్
[ 28-03-2024]
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. -
కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం
[ 28-03-2024]
మండలం కేంద్రమైన కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. -
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 28-03-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో గురువారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
కేంద్ర బలగాల కవాతు
[ 28-03-2024]
ఆదోని పట్టణంలో కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-03-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
పాదయాత్ర మాటపాలనలో జూట
[ 28-03-2024]
ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. -
ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
[ 28-03-2024]
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. -
బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు
[ 28-03-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. -
మఠం స్థలానికి ఎసరు
[ 28-03-2024]
ఆదోని పట్టణ శివారులోని బైపాస్ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. -
ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి
[ 28-03-2024]
ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. -
29న బనగానపల్లికి చంద్రబాబు రాక
[ 28-03-2024]
బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి బుధవారం తెలిపారు. -
కేసులు నమోదైతే కొలువు కష్టమే
[ 28-03-2024]
చట్ట నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వాలంటీర్లపై కేసులు నమోదైతే మళ్లీ వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. -
తెదేపాలోనే బీసీలకు పెద్దపీట
[ 28-03-2024]
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. -
వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు
[ 28-03-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి
[ 28-03-2024]
ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 28-03-2024]
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. -
అభివృద్ధికి ఓటేయండి
[ 28-03-2024]
కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ అన్నారు. -
తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా
[ 28-03-2024]
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
[ 28-03-2024]
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత