మృత్యుకేళి..పంచ ప్రాణాలు బలి
కర్ణాటక రాష్ట్రం కలబురగిలోని ఖ్వాజా బందే నవాజ్ దర్గాను సందర్శించాలన్నది వారి చిరకాల కోరిక. ఎట్టకేలకు పరిస్థితులు అనుకూలించడంతో బంధువులంతా కలిసి.. అద్దె వాహనంలో ఆనందంగా ప్రయాణమయ్యారు.
వెలుగోడు, బండి ఆత్మకూరులో విషాదం
కలబురగి దర్గా సందర్శనకు వెళుతుండగా ప్రమాదం
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
బండిఆత్మకూరు, న్యూస్టుడే : కర్ణాటక రాష్ట్రం కలబురగిలోని ఖ్వాజా బందే నవాజ్ దర్గాను సందర్శించాలన్నది వారి చిరకాల కోరిక. ఎట్టకేలకు పరిస్థితులు అనుకూలించడంతో బంధువులంతా కలిసి.. అద్దె వాహనంలో ఆనందంగా ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్న సమయంలో వీరి ప్రయాణంపై మృత్యువు పంజా విసిరింది. ఘోర రహదారి ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 14 మంది గాయాలపాలయ్యారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన వెలుగోడు, బండిఆత్మకూరులోని బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది.
* వెలుగోడుకు చెందిన రమీజాబేగంకు అస్మా, నసీమ ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరిలో ఆస్మాను బండిఆత్మకూరుకు చెందిన మునీర్బాషాకు, నసీమను వెలుగోడుకు చెందిన న్యామతుల్లాకు ఇచ్చి 12 ఏళ్ల కిందట వివాహం జరిపించారు. ఈ రెండు కుటుంబాలకు చెందిన 18 మంది సభ్యులు కలబురగి దర్గా సందర్శన కోసం సోమవారం రాత్రి తుఫాను వాహనంలో బయల్దేరారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా సైదాపూరు సమీపంలోని బళిచక్రి గ్రామ క్రాస్లో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని మంగళవారం తెల్లవారుజామున 2.30-3.00 గంటల ప్రాంతంలో వీరి వాహనం వెనుకవైపు నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రమీజాబేగం (50), ఈమె మనవరాలు సుమ్మి (12), మునీర్బాషా (40), ఆయన కుమారుడు ముదష్షిర్ (12), న్యామతుల్లా (40) మృతి చెందారు. మునీర్బాషా భార్య అస్మా, మరో కుమారునికి గాయాలయ్యాయి. రమీజాబేగం సోదరి రియాజున్, ఆమె కుమార్తెలు అక్రిన్, ముజఫీర్, రమీజాబేగం కుమారుడు మాసుంబాషా, కోడలు హనీఫాతోపాటు మిగతా వారికీ గాయాలయ్యాయి. వాహన చోదకుడు సుభాన్కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కర్ణాటకకు బయల్దేరారు. మృతదేహాలను బుధవారం తీసుకొచ్చే అవకాశం ఉంది.
పేదల బతుకు అతలాకుతలం
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రహదారి ప్రమాదం.. రెండు పేద కుటుంబాలను అతలాకుతలం చేసింది. బండి ఆత్మకూరుకు చెందిన మునీర్బాషాకు ఎకరాన్నర భూమి ఉంది. దీనిని సాగు చేయడంతోపాటు తాపీ పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. వెలుగోడుకు చెందిన న్యామతుల్లా గౌండా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ప్రమాదంలో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పెద్దలతో పాటు ఇద్దరు చిన్నారులు సైతం మృతి చెందడంతో రెండు కుటుంబాలవారు తీవ్రంగా విలపించారు. తల్లితోపాటు భర్త, పిల్లలను కోల్పోయి అస్మా, నసీమ శోకసంద్రంలో మునిగిపోయారు. తమకెవరు దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల రోదనలతో బండి ఆత్మకూరు, వెలుగోడు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM