ఉపాధి పనుల్లో పురోగతి తప్పనిసరి
ఉపాధి పనుల పురోగతిని ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంగళవారం సమీక్షించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ డా.జి.సృజన
కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే: ఉపాధి పనుల పురోగతిని ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో 60 శాతం వివరాలు నమోదు చేసిన కల్లూరు, దేవనకొండ, చిప్పగిరి, కర్నూలు, కోడుమూరు మండలాల సిబ్బంది అలసత్వం వహించకుండా పూర్తిస్థాయిలో పురోగతి సాధించాలన్నారు. కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలన్నారు. కల్లూరు, వెల్దుర్తి, హొళగుంద మండలాలకు సంబంధించి ఎన్ఎంఎంఎస్ యాప్లో హాజరు శాతం తక్కువగా నమోదు చేశారన్నారు. సాంకేతిక కారణాలు చూపకుండా హాజరు శాతం నమోదు చేయాలని ఏపీడీలను ఆదేశించారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్లో ఉన్న పనులను పంచాయతీరాజ్ ఇంజినీర్లు సమన్వయం చేసుకొని పూర్తి చేయాలన్నారు. ఉద్యాన పంటల సాగుకు సంబంధించి రైతుల భూములను గుర్తించి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. మినీ గోకులం పనులకు సంబంధించి పెండింగ్లో ఉన్న చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీపీవో నాగరాజునాయుడు, డ్వామా పీడీ అమర్నాథ్రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు