ఈ నిర్లక్ష్యంపై ఎక్స్రే తీసేదెన్నడో
ప్రమాదాలు జరిగినప్పుడు అవయవాలకు ఏమైనా నష్టం జరిగితే వాటి పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్రే యంత్రాలు ఎంతో కీలకం.
పలు ఆస్పత్రుల్లో పనిచేయని యంత్రాలు
కోవెలకుంట్లలో వృధాగా ఎక్స్రే యంత్రం
డోన్ పట్టణం, నంద్యాల పాత పట్టణం, కోవెలకుంట్ల గ్రామీణ, న్యూస్టుడే : ప్రమాదాలు జరిగినప్పుడు అవయవాలకు ఏమైనా నష్టం జరిగితే వాటి పరిస్థితిని తెలుసుకునేందుకు ఎక్స్రే యంత్రాలు ఎంతో కీలకం. వీటి ద్వారా సమస్య తెలుసుకుని చికిత్స అందించవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రుల్లో ఎక్స్రే యంత్రాలు మూలనపడ్డాయి. రూ.లక్షలు ఖర్చు పెట్టి వీటిని ఏర్పాటుచేయగా ప్రసుత్తం పనిచేయడం లేదు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 17 సీహెచ్సీలు, కర్నూలు, నంద్యాల సర్వజన ఆసుపత్రులు, ఆదోని ఎంసీహెచ్, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, బనగానపల్లి ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు పొందేందుకు రోగులు వస్తుంటారు. జీజీహెచ్, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ఎక్స్రే యంత్రాలు ఉన్నాయి. డార్క్రూమ్ అసిస్టెంట్లు, రేడియోగ్రాఫర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేడియోగ్రాఫర్స్, డార్క్రూమ్ అసిస్టెంట్ల కొరత వేధిస్తోంది. ఫలితంగా సమస్యలు ఎదురవుతున్నాయి. రహదారి ప్రమాదాలు తదితర కారణాలతో చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వచ్చినప్పుడు దెబ్బతిన్న భాగాలను ఎక్స్రే ద్వారా గుర్తించాల్సి ఉంది. సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ఎక్స్రే ప్లాంట్లు అందుబాటులో లేక క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చివరికి ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ కేంద్రాలకు వెళ్తున్నారు. బయట ఎక్స్రే కోసం రూ.500కుపైగా ఖర్చు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.
డిజిటల్ ఎక్స్రేలు ఉన్నా..
డోన్ సీహెచ్సీ కేంద్రంగా ఉన్న సమయంలో ఎక్స్రే యంత్రం కేటాయించారు. పదేళ్ల కిందట మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రి హోదా లభించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి చొరవ చూపి డోన్, బేతంచెర్ల ఆసుపత్రులకు ఒక్కొక్కటి రూ.11.20 లక్షల విలువ చేసే డిజిటల్ ఎక్స్రే యంత్రాలను 2022 మార్చిలో తెప్పించారు. నందికొట్కూరు, సున్నిపెంట సీహెచ్సీల్లో డిజిటల్ సీఆర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. కంప్యూటర్ రీడర్, ప్రింటర్ తదితరాలు లేక ఎక్స్రే తీయలేని పరిస్థితి. డోన్ ఏరియా ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్, డార్క్ రూమ్ అసిస్టెంట్ను నియమించారు. రేడియోగ్రాఫర్ గైనిక్లో, డార్క్రూమ్ అసిస్టెంట్ ఓపీ రాసిచ్చే పనులు చేస్తున్నారు.
మరమ్మతులు ఎప్పుడో..
కోడుమూరు, వెల్దుర్తి, ఓర్వకల్లు, పత్తికొండ మండలాల్లోని ఆసుపత్రుల్లో ఎక్స్రే యంత్రాల ఊసే లేదు. ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రిలో అదనంగా ఉన్న యంత్రాన్ని కోడుమూరు సీహెచ్సీకి తరలించారు. ఆలూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్రే ప్లాంటు మరమ్మతులకు గురవడంతో గత కొన్నేళ్లుగా మూలన పడింది. ఫలితంగా రహదారి ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారిని గుంతకల్లు, బళ్లారి, ఆదోని, కర్నూలు వంటి ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. కర్నూలు సర్వజన ఆసుపత్రిలోనూ ఎక్స్రే యంత్రాలు పనిచేయడం లేదు. ఆదోనిలో విద్యుత్తు సరఫరా ఆగిపోతే ఎక్స్రే తీయలేని పరిస్థితి నెలకొంది. జనరేటర్ సౌకర్యం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
సేవలందక ఇబ్బందులు
ఆళ్లగడ్డ, ఆత్మకూరు, పాణ్యం, వెలుగోడు, మిడుతూరు, అవుకు తదితర ప్రాంతాల్లోని సీహెచ్సీల్లో ఎక్స్రే యంత్రాలు లేక క్షతగాత్రులకు సేవలు అందించడం లేదు. కోవెలకుంట్ల సీహెచ్సీలో ఎక్స్రే యంత్రం మూలకు చేరి ఏడాదికిపైగా కావస్తోంది. నంద్యాల జిల్లాలోని సర్వజన ఆసుపత్రిలో రెండు ఎక్స్రే యంత్రాలు పని చేయడం లేదు. దీనికితోడు సిబ్బంది కొరతతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరం ఉన్నవారిని ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం