ముంచెత్తితే ముప్పే
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలాశయాలు ప్రమాదకరంగా మారాయి.
ప్రమాదకరంగా జలాశయాలు
నిర్వహణకు నిధులివ్వని ప్రభుత్వం
కర్నూలు జలమండలి, న్యూస్టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 7.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే జలాశయాలు ప్రమాదకరంగా మారాయి. మూడేళ్లుగా నిర్వహణ వ్యయం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) కింద నిధులు విడుదల చేయడం లేదు. గేట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. ఎప్పుడు.. ఏ ప్రాజెక్టు వద్ద...ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోతిరెడ్డిపాడు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, సుంకేసుల బ్యారేజి, వెలుగోడు సమతుల జలాశయం, గాజులదిన్నె ప్రాజెక్టు, అవుకు, గోరుకల్లు జలాశయాలకు నిర్వహణ నిధులు విడుదల చేయడం లేదు.
అవుకు అధోగతి
4.150 టీఎంసీల సామర్థ్యం కలిగిన అవుకు జలాశయానికి ఏర్పాటు చేసిన 6 ద్వారాల్లో రెండు ద్వారాలు గత నాలుగున్నరేళ్లుగా పనిచేయడం లేదు. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.2.50 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి. మిగిలిన 4 ద్వారాల నిర్వహణకు సంబంధించి అరకొర నిధులతో లాక్కొస్తూ గండికోట జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ జలాశయం కింద 3,200 ఎకరాల ఆయకట్టు ఉంది. అవుకు జలాశయం నిర్వహణకు ఏళ్ల తరబడి నిధులు విడుదల కావడం లేదు.
సుంకేసుల విలవిల
* కర్నూలు, వైఎస్సార్ జిల్లాలో 2.75 లక్షల ఎకరాలకు నీరు అందించడంతోపాటు ఎన్నో గ్రామాల దాహార్తి తీర్చే సుంకేసుల జలాశయం పరిస్థితి దయనీయంగా మారింది. 1.200 టీఎంసీ సామర్థ్యం కలిగిన సుంకేసుల ప్రాజెక్టుకు 30 ద్వారాలున్నాయి.
* ఆగస్టు నుంచి వరద నీటి ప్రవాహం ప్రారంభమవుతుంది. నాలుగు నెలల పాటు గేట్లు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. గేట్లకు ఏర్పాటు చేసిన (రోప్స్) తాళ్లు నాలుగు వరకు తెగిపోయాయి.
* గేట్లకు నిరంతరం గ్రీసు వేయడంతోపాటు ఆయిల్ మార్చుతూ ఉండాలి. ఇక్కడ సీల్ రబ్బర్స్ సరిగా లేకపోవడంతో గేట్ల నుంచి నీరు లీకవుతోంది. ఒక గేటుకు ఏర్పాటుచేసే రోప్ రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. గత మూడేళ్లు నిధుల జాడ లేకపోవడంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు.
వెలుగోడు వినేదెవరు
కర్నూలు, వైఎస్సార్ జిల్లాలోని 2.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదలతోపాటు 16.950 టీఎంసీలు నిల్వ ఉండే వెలుగోడు సమతుల జలాశయం నిర్వహణ కష్టంగా మారింది. ఇక్కడి మూడు ద్వారాలకు రెగ్యులర్గా గ్రీస్, గేర్ ఆయిల్ సమకూర్చకపోవడంతో ద్వారాలు సరిగా పనిచేయక మొండికేస్తున్నాయి. ఏటా కనీసం రూ.32 లక్షలు బడ్జెట్ కేటాయిస్తే జలాశయం వద్ద నిర్వహణ చేసేందుకు అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.
గోరుకల్లు గోస
12.440 టీఎంసీల సామర్థ్యం కలిగిన గోరుకల్లు రిజర్వాయర్కు మూడు ద్వారాలున్నాయి. వీటిలో రెండు మాత్రమే పనిచేస్తుండగా.. ఒక్క గేటు నిర్మాణ దశలోనే నిలిచిపోయింది. కొత్త గేటు ఏర్పాటు చేయక.. పెండింగ్ గేటు నిర్మాణం పూర్తి చేయక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గత నాలుగేళ్లుగా జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నప్పటికీ.. నిర్వహణ నిధుల సమస్య వేధిస్తోంది.
ముఖ్య మార్గంలో గడబిడ
* పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలుగోడు జలాశయానికి, ఎస్సార్బీసీ, ఎస్కేప్ ఛానల్ ద్వారా మూడు పాయల ద్వారా నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఎస్కేప్ ఛానల్ వద్ద ఏర్పాటు చేసిన ద్వారాల్లో రెండు సరిగా పనిచేయడం లేదు. ద్వారాలు కిందికి.. పైకి రాకపోవడంతో నీటి ప్రవాహం అధికంగా ఉన్నపుడు పైకెక్కి ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ద్వారాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని మెకానికల్ ఇంజినీర్లు గుర్తించి హెచ్చరించారు.
* రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలు అందించే పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థ వద్ద 10 ద్వారాలున్నాయి. వీటి ద్వారా 44 వేల క్యూసెక్కుల వరద జలాలు విడుదలవుతాయి. నిర్వహణ నిధులు విడుదల కాక మరమ్మతులు చేయకపోవడంతో నీరు లీకేజీ అవుతోంది. 5 పాత ద్వారాలకు మరమ్మతులు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. మెకానికల్ ఇంజినీర్ల బృందం ఏటా తనిఖీలు నిర్వహించి నివేదికలు అందిస్తున్నా తీసుకుంటున్న చర్యలు శూన్యమే.
పరిశీలించి నివేదిక ఇస్తాం
కుమారస్వామి, ఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, వైఎస్సార్ జిల్లా
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు, జలాశయాలను పరిశీలించి లోపాలు గుర్తించి నివేదికను సంబంధిత ఇంజినీర్లకు అందజేస్తాం. ప్రమాదాలనూ తెలియజేస్తూ నివేదికలు ఇస్తాం.. నిర్వహణ వ్యయానికి సంబంధించి అంచనా వేసి సంబంధిత ప్రాజెక్టు ఇంజినీరుకు తెలియజేస్తాం. బడ్జెట్ కేటాయింపు, నిధుల విడుదల మా పరిధిలో ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా తోనే అభివృద్ధి
[ 18-04-2024]
మండలంలోని కలుగొట్ల, కృష్ణాపురం గ్రామాలలో మండల తెదేపా నాయకులు సుబ్బరాయుడు, బలరాం గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
రామళ్లకోటలో స్వామివారి కళ్యాణం
[ 18-04-2024]
మండలంలోని రామళ్లకోట గ్రామంలో శ్రీ వనం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా గురువారం స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. -
అక్రమ మద్యం పట్టివేత
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
[ 18-04-2024]
మండల కేంద్రమైన చిప్పగిరికి చెందిన రైతు కొండా చంద్ర విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందారు. -
ఆస్పత్రిలో కనీస సదుపాయాలు కల్పించాలి
[ 18-04-2024]
ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో మంచాల కోరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఎన్నికల భేరి.. ప్రచార వే‘ఢీ’
[ 18-04-2024]
రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18 నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. -
జనం గుండెల్లో జగన్ విల్లం‘భూ’
[ 18-04-2024]
ప్రాజెక్టులు నిర్మించలేదు.. పరిశ్రమలు ఏర్పాటు లేదు.. రోడ్లు లేవు.. పల్లె మొదలు పట్టణం వరకు ప్ర‘గతి’ తప్పింది. ఫలితంగా స్థిరాస్తి రంగం కుప్పకూలింది. -
ఎమ్మెల్యే వస్తున్నారని.. ఉపాధి పనులు బంద్
[ 18-04-2024]
ఆదోని మండలం అరేకల్లో బుధవారం ఉపాధి పనులు చేపట్టలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ఉపాధి పనులు బంద్ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్య
[ 18-04-2024]
తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం. -
నిలువెల్లా గాయాలు.. నీళ్లు పారని కాల్వలు
[ 18-04-2024]
‘మాది రైతు ప్రభుత్వం.. పంటలు ఎండనీయం.. అన్నదాతల కంట నీరు రానీయం’ అని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రసంగాలు ఊదరగొట్టారు. తీరా చూస్తే.. పంట కాల్వలు దయనీయంగా మారాయి. -
ఓట్ల ఆట!
[ 18-04-2024]
ఆటైనా.. ఓటైనా ప్రజలకు ఆసక్తికరమైన అంశాలే. ఉత్కంఠ రేకిత్తించే విషయాలే. తరచి చూస్తే ఈ రెండింటి మధ్య పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎక్కడ నలుగురు కలిసినా.. వీటికి సంబంధించిన విషయాలపైనే చర్చ కొనసాగుతోంది. -
పోలింగ్ శాతం పెంచేలా చర్యలు
[ 18-04-2024]
విధి నిర్వహణలో భాగంగా అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించాల్సిందేనని.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన అన్నారు. -
జగన్ మామయ్య దీవెనా.. అంతా మాయ
[ 18-04-2024]
విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. -
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పండి
[ 18-04-2024]
సైకో ముఖ్యమంత్రికి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ‘ప్రజాగళం’లో భాగంగా పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన పర్యటించారు. -
రహదారుల బాగుకు చర్యలు : బుగ్గన
[ 18-04-2024]
వైకాపా వెన్నుపోటుదారులకు, అవాకులు చవాకులు మాట్లాడే వారికి ఎన్నికల తర్వాత కోలుకోలేని విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. -
కర్నూలు నియోజకవర్గం చుట్టూ మూడు చెక్పోస్టులు
[ 18-04-2024]
కర్నూలు నియోజకవర్గం చుట్టూ 24 గంటలు నిఘా ఉంచేందుకు మూడు స్టాటస్టికల్ సరైలైన్స్ టీమ్లతో కూడిన చెక్పోస్టులను ఏర్పాటుచేస్తూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కర్నూలు నగరపాలకసంస్థ కమిషనర్ భార్గవ్తేజ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. -
వైకాపా అంతర్గత వైరం.. బహిరంగం
[ 18-04-2024]
వైకాపా అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బలనిరూపణ, సామాజికవర్గంలో పెత్తనం, గ్రామాలు, మండలాల్లో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ విభేదాలు బహిర్గతమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రుణం కోసం.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్