logo

ప్రజలను నట్టేట ముంచిన జగన్‌

తెదేపా ఆధ్వర్యంలో ‘ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాన్ని ఈనెల 10 నుంచి నిర్వహిస్తున్నట్లు కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 08 Jun 2023 04:31 IST

సమావేశంలో మాట్లాడుతున్న సోమిశెట్టి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: తెదేపా ఆధ్వర్యంలో ‘ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమాన్ని ఈనెల 10 నుంచి నిర్వహిస్తున్నట్లు కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో ప్రజలు అన్నివిధాలా నష్టపోయారని, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, పన్నుల భారం.. దీనికితోడు చెత్త పన్ను ఇలా ఎన్నో రకాలుగా భారాలు మోపి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10 నుంచి తెదేపా.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సోమిశెట్టి తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అందరినీ మోసగించిన జగన్‌కు రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో కోడుమూరు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రకుమార్‌, శివశంకర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు