వలలో విజయాలు వాలిపోవాల్సిందే!
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం. ఆటల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు లభించేందుకు అదనపు అర్హతగా ఉపయోగపడుతుంది క్రీడలు.
రాష్ట్ర, జాతీయ స్థాయే లక్ష్యంగా సాధన
పత్తికొండలో చిన్నారులకు ఉచిత శిక్షణ
కేవీకే శిబిరంలో వాలీబాల్ ఆడుతున్న బాలబాలికలు
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం. ఆటల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు లభించేందుకు అదనపు అర్హతగా ఉపయోగపడుతుంది క్రీడలు. నైపుణ్యం ఉన్నా సరైన శిక్షణ లేక చాలా మంది గ్రామీణ విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేసవిలో ఉచిత క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల క్రీడా మైదానంలోని కేవీకే కేంద్రాల్లో ఉచితంగా వాలీబాల్ ఆటను బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు రామాంజనేయులు, ధనంజయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు సాధన చేస్తున్నారు.
న్యూస్టుడే, పత్తికొండ పట్టణం
మెలకువలతో నైపుణ్యం మెరుగు
పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల క్రీడా మైదానంలోని కేవీకే కేంద్రాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో వాలీబాల్ ఆటలు బాలబాలికలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ శిబిరాలకు ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు సుమారు వంద మంది బాలబాలికలు వస్తున్నారు. శిబిరంలో బాలబాలికలు నైపుణ్యం మెరుగుపడేలా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా, రాష్ట, జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తున్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రీడల దిశగా..
టి.గౌరిప్రియ, 9వ తరగతి
అమ్మానాన్న శారద, టి.నాగభూషణం ప్రోత్సాహంతో నేను వాలీబాల్ క్రీడను ఎంచుకున్నా. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడా. వేసవి సెలవులు ఇలా సద్వినియోగం చేసుకున్నా. చదువుతో పాటు ఆటల్లో శిక్షణ పొందుతున్నా. ఉదయం, సాయంత్రం వేసవి క్రీడా ఉచిత శిక్షణకు వస్తున్నా. శిక్షకులు ఇచ్చే మెలకువలు నేర్చుకుంటున్నా. వేసవి క్రీడా శిబిరం చాలా ఉపయోగపడుతోంది. జాతీయ స్థాయిలో రాణించేందుకు మరింత సాధన చేస్తున్నా.
భవిష్యత్తుకు ఎంతో ఉపయోగం..
ఎం.విఘ్నేష్, పదో తరగతి
మా తల్లిదండ్రులు ఎం.అనిత, ఎం.నరసింహరావు. నాన్న బార్బర్ షాపు నిర్వహిస్తున్నారు, అమ్మ కూలిపనికి వెళ్తుంది. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటకు మంచి డిమాండ్ ఉంది. ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉంటుంది. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఉంది. వేసవి క్రీడా శిబిరంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ పొందుతున్నా. శిక్షకులు నేర్పించే మెలకువలను బాగా నేర్చుకుంటున్నా.
బాలల్లో నైపుణ్యం వెలికితీస్తాం
రామాంజనేయులు, శిక్షకుడు, పత్తికొండ
గ్రామీణ ప్రాంతాల్లోని బాలబాలికలకు ఆటలపై మక్కువ ఉంది. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు వారికి చాలా ఉపయోగపడుతున్నాయి. శిబిరాలకు వచ్చే బాలబాలికల్లో దాగిఉన్న నైపుణ్యం వెలికితీస్తాం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రత్యేకంగా మెలకువలు నేర్పించి తీర్చిదిద్దేలా చేస్తున్నాం. శిబిరాలకు ఉదయం, సాయంత్రం విద్యార్థులు బాగా వస్తున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన శిక్షణలో విద్యార్థులు ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్