రీసర్వే త్వరితగతిన పూర్తి చేయండి
భూముల సర్వేపై సర్వేయర్లు, వీఆర్వోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కర్నూలు డివిజన్లో రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలని జేసీ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు.
మాట్లాడుతున్న జేసీ మౌర్య
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: భూముల సర్వేపై సర్వేయర్లు, వీఆర్వోలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కర్నూలు డివిజన్లో రీసర్వే వేగవంతంగా పూర్తి చేయాలని జేసీ నారపురెడ్డి మౌర్య ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై కర్నూలు డివిజన్ స్థాయి తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు, వీఆర్వోలకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రామ, మండల సర్వేయర్లకు భూముల సర్వేపై పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములకు సరిహద్దులు ఏర్పాటు చేయాలని సర్వేయర్లు, వీఆర్వోలకు సూచించారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్, సర్వే అధికారి రామ్మోహన్, డిప్యూటీ కలెక్టర్ నాగ ప్రసన్నలక్ష్మి, డీఐ విజయసారథి, తహసీల్దార్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు.
ఆయకట్టుకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
బాధ్యతలు చేపట్టిన రఘురామిరెడ్డి
కర్నూలు జలమండలి, న్యూస్టుడే: ఆయకట్టు రైతులకు అండగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని డీఈఈ రఘురామిరెడ్డి అన్నారు. జలవనరులశాఖ పరిధిలోని కేసీ కాలువ కర్నూలు సబ్ డివిజన్ డీఈఈగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సుంకేసుల బ్యారేజీపై శ్రద్ధ వహించి వరద నీటిపై అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. బ్యారేజీ వద్ద నిరంతరం సిబ్బందికి సూచనలు చేయడంతోపాటు పర్యవేక్షణ చేస్తామన్నారు. ఆయకట్టుకు ఇబ్్భ రాకుండా చూస్తామని తెలిపారు. నగరం మీదుగా వెళ్లే కేసీ కాలువ పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అంతకుముందు ఆయన సీఈ, ఎస్ఈలను మర్యాదపూర్వకంగా కలిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్