ఆర్యూలో అధనంగా ధారపోత
రాయలసీమ విశ్వవిద్యాలయంలో 170 మంది బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 105 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు.
పరిపాలన నిధుల నుంచి వేతనాలు
ప్రభుత్వ ఉత్తర్వులు బుట్టదాఖలు
రాయలసీమ విశ్వవిద్యాలయంలో 170 మంది బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 105 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఏపీ ఆప్కాస్ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. అలాకాకుండా ఆర్యూ పరిపాలన నిధుల నుంచి ఏటా సుమారు రూ.5 కోట్ల మేర ధారబోస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకపోయినా పోస్టులు సృష్టించి రూ.వేలకు వేలు జీతాలు ఇస్తుండటం గమనార్హం.
న్యూస్టుడే, కర్నూలు విద్య
ట్రెజరీలో నిలిపివేత
105 మంది ఉద్యోగుల వేతనాల కోసం ప్రతి నెలా జిల్లా ట్రెజరీ కార్యాలయానికి వివరాలు పంపుతున్నారు. ట్రెజరీ అధికారులు వీటిని తిరస్కరిస్తున్నారు. ఉద్యోగుల పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రతి నెలా ట్రెజరీ అధికారులు కోరుతూనే ఉన్నారు. అయినా ఆర్యూ నుంచి స్పందన లేకపోవడంతో గత 8 నెలలుగా ట్రెజరీ అధికారులు వేతనాలు నిలిపివేసినట్లు సమాచారం. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక ఆర్యూ ఈసీ కమిటీ పరిపాలన నిధుల నుంచి వేతనాలు చెల్లించేలా తీర్మానం చేయడం గమనార్హం.
లోకాయుక్త.. సీఐడీకి ఫిర్యాదు
* కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనాలపై ఆర్యూ పాలక మండలిలో తీర్మానం తీసుకునే అధికారం లేదని 2003లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. నిబంధన ప్రకారం 26 మందినే తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ఉన్న ఏ వర్సిటీలో లేనివిధంగా నాన్ టీచింగ్ సిబ్బంది రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఉండటం గమనార్హం. వీరికి వేతనాల చెల్లింపును.. 2008లో జారీ అయిన జీవో నంబరు 56 ప్రకారం చెల్లించాల్సి ఉంది. ఒకవేళ వేతనాలు చెల్లిస్తే బేసిక్ ఇవ్వాలి.
* నిబంధనలు తుంగలో తొక్కి రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే బేసిక్తోపాటు హెచ్ఆర్ఏ, సీసీఏ చెల్లించడంపై కొందరు విద్యార్థి సంఘం నాయకులు సీఐడీ, లోకాయుక్తలోనూ చేశారు. దీనిపై పూర్తి సమాచారం ఇవ్వాలని లోకాయుక్త, సీఐడీ నుంచి ఆర్యూ పరిపాలన అధికారులకు నోటీసులు వచ్చినట్లు తెలిసింది.
ఉత్తర్వులు ఏం చెబుతున్నాయి
నాన్ టీచింగ్ సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగులతోపాటు వేతనాలు చెల్లిస్తామని యోగి వేమన, విక్రమ సింహపురి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిని కోరాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ టీచింగ్ సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగులతోపాటు వేతనాలు చెల్లించే అవకాశం లేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇదే విషయమై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తర్వు సైతం జారీ చేసింది. అయినప్పటికీ ఆర్యూలో మాత్రమే బోధనేతర సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగులతోపాటు వేతనాలు చెల్లిస్తుండటం గమనార్హం.
నిబంధన మేరకే ముందుకు
సుందరానంద, రిజిస్ట్రార్, ఆర్యూ
ఆర్యూలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఈసీ కమిటీ నిర్ణయం మేరకు వేతనాలు చెల్లిస్తున్నాం. ఆర్యూలో జరిగే ప్రతి అంశంపై పాలక మండలిలో తీర్మానించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ధ్రువపత్రాల విషయాన్ని పరిశీలించి 17 మందిని విధుల నుంచి తొలగించాం. మిగిలిన సిబ్బందికి చెందిన పత్రాలు జిల్లా విద్యాశాఖ పరిశీలనలో ఉన్నాయి. అక్కడినుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఈసీ సమావేశంలో పెట్టి ఉన్నతాధికారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పశ్చిమాన సాగునీరు పారిస్తాం
[ 20-04-2024]
‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది. -
జగన్ సాయమెంత కౌలు రైతు కలవరింత
[ 20-04-2024]
ఈ మహిళ పేరు అయ్యమ్మ. మండల పరిధిలోని హోసూరుకు చెందిన ఈమె భర్త ఉప్పర తిక్కన్న 2022 ఏప్రిల్ 18న అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. -
జగన్ చోద్యం.. ‘కాడి’తప్పిన కౌలుసేద్యం
[ 20-04-2024]
ముఖ్యమంత్రి గారూ...! మీ ఆత్మబంధువు జగన్ పేరిట 2019 జులై 8న రైతులకు మీరు రాసిన లేఖ గుర్తుందా?... రైతు భరోసా ద్వారా కౌలుదార్లకు మేలు జరగబోతోందని చెప్పారు. మరి నిజంగా ఆదిశగా ఏమైనా చేశారా..? -
వైకాపాను సాగనంపేందుకు సిద్ధం
[ 20-04-2024]
వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. -
ఉల్లంఘనులు
[ 20-04-2024]
అధికారం చేతిలో ఉందని నిబంధనలు లెక్కచేయరు.. ఎన్నికల నియమావళిని పాటించరు.. అధికారులు పట్టించుకోరు.. -
‘జగన్ దగా’ఖానాలు
[ 20-04-2024]
కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలను తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వాసుపత్రుల ముఖ చిత్రాలు.. వాటి దశ, దిశ మార్చి ఈ చిత్రాలను కూడా రెండేళ్ల తర్వాత మీ ముందుంచుతాం. -
నామపత్రాల సందడి
[ 20-04-2024]
ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 20-04-2024]
కోడుమూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆదిమూలపు సతీశ్ శుక్రవారం నామపత్రాలు దాఖలు చేశారు. కర్నూలులోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్వో శేషిరెడ్డికి రెండు సెట్ల పత్రాలు అందజేశారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు: బీవీ
[ 20-04-2024]
రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ తెదేపాను గెలిపించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
రూ.కోట్లకు బీటలు.. రోగులతో జగన్ ఆటలు
[ 20-04-2024]
ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం. -
చంద్రబాబుకు జననీరాజనం
[ 20-04-2024]
వీధులన్నీ పసుపుమయంగా మారాయి. జనసైనికులు తరలివచ్చారు. కాషాయం కార్యకర్తలు కదలివచ్చారు. కూటమి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఓటు వినియోగంతోనే దృఢమైన ప్రజాస్వామ్యం
[ 20-04-2024]
ప్రతిఒక్కరు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం దృఢంగా ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. -
ట్యాబు జగన్ డాబు
[ 20-04-2024]
‘ట్యాబ్ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి. -
రెండోరోజు 6 నామపత్రాలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండోరోజు శుక్రవారం జిల్లాలో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
[ 20-04-2024]
ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులు(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తాలూకా ఎస్సై ఎర్రిస్వామి శుక్రవారం తెలిపారు. -
రెండో రోజు 20 మంది
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండో రోజైన శుక్రవారం నామినేషన్ల పర్వం కొనసాగింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఒకరు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 19 మంది అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు. -
గుట్టుగా ట్యాబ్ల పంపిణీ
[ 20-04-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపుతున్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుక్రవారం ట్యాబ్ల పంపిణీ విషయం చర్చనీయాంశంగా మారింది.