సాంకేతిక తోటలో సమస్యల మేట
కర్నూలు నగర పరిధిలోని జగన్నాథగట్టుపై సాంకేతిక విద్య అందిస్తున్న ట్రిపుల్ ఐటీ డీఎంలో సమస్యలు తిష్ఠవేశాయి. ఈనెల 23న ఐదో స్నాతకోత్సవం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యార్థులకు కరవైన రక్షణ
ముగ్గురు ప్రొఫెసర్లదే తుది నిర్ణయం
న్యూస్టుడే, కర్నూలు విద్య
ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని వసతిగృహాలు
కర్నూలు నగర పరిధిలోని జగన్నాథగట్టుపై సాంకేతిక విద్య అందిస్తున్న ట్రిపుల్ ఐటీ డీఎంలో సమస్యలు తిష్ఠవేశాయి. ఈనెల 23న ఐదో స్నాతకోత్సవం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాంపస్లో నెలకొన్న సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం క్యాంపస్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు సాంకేతిక విద్య నేర్చుకుంటున్నారు. క్యాంపస్ కొండప్రాంతంలో ఉండడంతో ఇక్కడ నెలకొంటున్న సమస్యలు బయటి ప్రపంచానికి తెలియకుండా ఆ ముగ్గురు ప్రొఫెసర్ల పాత్ర కీలకంగా ఉందని పలువురు ట్రిపుల్ ఐటీ డీఎం ఛైర్మన్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఆ ముగ్గురు ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారి ఆ ముగ్గురు ప్రొఫెసర్లకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆహారం వికటించి అస్వస్థత
ట్రిపుల్ ఐటీ డీఎంలో చదువుకుంటున్న విద్యార్థులకు రక్షణ కరవైందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై డైరెక్టర్ సోమయాజులను నేరుగా కలిసి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడం గమనార్హం. క్యాంపస్లో విద్యార్థులకు, విద్యార్థినులకు వేర్వేరుగా వసతిగృహాలున్నాయి. ఆహారం నాణ్యతగా లేక పలుమార్లు హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై ప్రశ్నించిన పదిమంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో చేసేది లేక వసతిగృహంలో నాణ్యతగా లేని భోజనమే ఇంజినీరింగ్ విద్యార్థులకు దిక్కైంది. ఆరు నెలల కింద ఆహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గతంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.
అధ్వానంగా ఉన్న ట్రిపుల్ ఐటీ ప్రధాన రహదారి
ప్రారంభం నుంచి నీటి ఎద్దడి
ట్రిపుల్ ఐటీలో ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, శాస్త్రవేత్తలు అక్కడే నూతనంగా నిర్మించిన భవనాల్లో ఉంటున్నారు. వీరికి సరిపడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై నగరపాలక అధికారులు స్వయంగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ను సందర్శించారు. ఇక్కడ నెలకొన్న నీటి సమస్య గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
విద్యార్థులకు రక్షణ కల్పిస్తాం
- గురుమూర్తి, ట్రిపుల్ ఐటీ డీఎం, రిజిస్ట్రార్
క్యాంపస్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఇంకా ఏమైనా సమస్యలుంటే విద్యార్థులు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తాం. భోజన విషయంలో మరోసారి కమిటీ వేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పన్ను చెల్లిస్తారా.. కుళాయి కనెక్షన్ తొలగించాలా
[ 08-12-2023]
చెత్త పన్ను చెల్లింపు విషయంలో కర్నూలు నగరంలోని సచివాలయ సిబ్బంది నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అపార్టుమెంటువాసులకు తాఖీదులు జారీ చేసి, వసూలు కోసం సాయంత్రాలు వెళ్తున్నారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్లోని సాయిసదన్ అపార్ట్మెంట్లో చెత్తపన్ను వసూలుకు సాయంత్రం వేళ వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. -
గాలిమరల ఉద్యోగిపై వైకాపా నాయకుల దాడి
[ 08-12-2023]
ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ పరిధిలోని గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మేకల రాజేష్పై వైకాపా నాయకులు దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొలగవల్లి గ్రామానికి చెందిన మేకల రాజేష్ అక్కడే గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. -
భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దు
[ 08-12-2023]
జిల్లా పరిషత్ స్థాయీసంఘ సమావేశాల ద్వారా ఆశించిన ప్రయోజనం ఏమాత్రం చేకూరడం లేదు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇక్కడి వచ్చి అనవసర ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. -
నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలి
[ 08-12-2023]
నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. కార్డు ప్రైమ్ 2.0 నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబరు 30 నుంచి కర్నూలులో దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్డౌన్ నిరసన కార్యక్రమానికి తెదేపా మద్దతు ఇచ్చింది. -
అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ కనపడకూడదు
[ 08-12-2023]
అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సీడీపీవో చేసిన సూచనలు, హెచ్చరికల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
కాటసాని x బైరెడ్డి
[ 08-12-2023]
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, శాప్ అధ్యక్షుడు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరు నాయకుల అనుచరులు పరస్పరం తమతమ నాయకులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా పోస్టింగులు చేస్తున్నారు. -
కొత్తగా పనులు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
[ 08-12-2023]
‘గతంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు రాలేదు. కొత్తగా పనులు చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
విద్యుత్పైనే తొలి గురి!.. ఆ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం
-
‘నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే!’
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
-
IPL 2024: గుజరాత్ టైటాన్స్కు మరో షాక్ తప్పదా! షమి ఫ్రాంఛైజీ మారతాడా?