నాడు కట్టమన్నారు.. నేడు వద్దంటున్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘‘మన బడి నాడు- నేడు’’ పనులు కొనసా...గుతూనే ఉన్నాయి. ఎంతకీ పూర్తికావడం లేదు.. దీంతో ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించని పాఠశాలల్లో పనులు చేపట్టవద్దని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
పురోగతి లేకుంటే నిధులు వెనక్కి
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పనులు
చాపిరేవుల ప్రత్యేక పాఠశాలలో అసంపూర్తిగా నిర్మాణం
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘‘మన బడి నాడు- నేడు’’ పనులు కొనసా...గుతూనే ఉన్నాయి. ఎంతకీ పూర్తికావడం లేదు.. దీంతో ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించని పాఠశాలల్లో పనులు చేపట్టవద్దని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగానే అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేసింది. మన బడి నాడు- నేడు రెండో విడత కింద ఉమ్మడి జిల్లాలో 952 పాఠశాలలను ఎంపిక చేశారు. 312 పాఠశాలల్లో 991 అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు, 415 ప్రహరీలకు కలిపి రూ.365.75 కోట్లు విడుదల చేశారు. మరో రూ.45 కోట్ల వరకు రావాల్సి ఉంది. కొన్నిరోజుల కిందట రూ.4 కోట్లు వచ్చాయి. వారం కిందట మరో రూ.5 లక్షలు విడుదలయ్యాయి. రెండు జిల్లాల పరిధిలో ఒక్కో పాఠశాలలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. నిధుల కొరతతో పనులు చాలాచోట్ల సగంలోనే ఆగిపోయాయి.
నిధులు సర్దుపాట్లు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నిధుల సర్దుబాటుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు పాట్లు పడుతున్నారు. సగం చోట్ల నిధులు, పనుల వివరాలను కంప్యూటర్ స్వీకరించడం లేదు. ఇది ప్రధానోపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది. సగం పనులు పూర్తయిన చోట్ల నిధులు మిగిలితే వాటిని అవసరం ఉన్న పాఠశాలలకు మళ్లించాలని ఆదేశాలు ఉన్నాయి. ఇందుకు చాలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంగీకరించడం లేదు. ఆడిట్ సమయంలో ఇబ్బందులు వస్తాయనే భావనలో వారు ఉన్నారు. కంప్యూటర్లో వివరాలు అప్లోడ్ చేయలేక ఎంఈవోలు సతమతమవుతున్నారు.
ఆరా తీస్తున్న అధికారులు
- ఎక్కడెక్కడ పనులు జరగలేదు.. ఎన్నిచోట్ల సగం వరకే పూర్తి చేశారు.. తదితర వివరాలను ఎంఈవోలు సేకరిస్తున్నారు. ఇసుక లభ్యత లేకపోవడం, సకాలంలో నిధులు రాకపోవడం, వేసవి సెలవులు తదితర కారణాలతో రెండో విడత పనులు చాలా పాఠశాలల్లో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సగం పనులే జరిగిన చోట ఏమైనా నిధులు మిగిలుంటే వాటిని ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసే యోచనలో భాగంగా ప్రధానోపాధ్యాయుల నుంచి ఎంఈవోలు వివరాలు ఆరా తీస్తున్నారు.
- గత విద్యా సంవత్సరం ప్రవేశాల ఆధారంగా ఈ ఏడాది మార్చిలో ఉమ్మడి జిల్లాలోని 312 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరం చాలా పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గాయి. ఎన్ని అదనపు గదులు అవసరమో గుర్తించి ఆ మేరకు నిర్మించాలని తాజా ఆదేశాలు వెలువడ్డాయి. వాటి వివరాలు ఆన్లైన్లో ఎలా పొందుపరచాలో తెలియక ప్రధానోపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు.
పిల్లలు లేరు కదా వెనక్కి ఇవ్వండి
- నంద్యాల మండలం పాండురంగాపురం ఎంపీయూపీ పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలకు రూ.12 లక్షల నిధులొచ్చాయి. ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. పిల్లలు తక్కువగా ఉన్నారు కాబట్టి మిగిలిన నిధులు వెనక్కి పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ పాఠశాల నుంచి సుమారు రూ.1.50 లక్షలు వెనక్కి పంపించారు. దీనికి సమీపంలోనే చాపిరేవుల గ్రామంలో ఉన్న స్పెషల్ స్కూల్లో 57 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ అదనపు గదుల నిర్మాణంలో భాగంగా పైకప్పు పనులు జరుగుతున్నాయి. రూ.2.50 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయి. అధికారుల ఆదేశాలతో ప్రస్తుతం ఈ నిధులు వెనక్కి పంపాలనుకుంటున్నారు.
- మహానంది, బండిఆత్మకూరు, ఓర్వకల్లు, గడివేముల, హాలహర్వి, తుగ్గలి, మద్దికెర, మంత్రాలయం, కోసిగి, ఉయ్యాలవాడ, చాగలమర్రి మండలాల్లోని 43 పాఠశాలల్లో 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆయాచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఈ మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో కొన్ని గదులే నిర్మించాలని తాజాగా భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తుత్తి సవాళ్లు.. అడుగడుగునా అక్రమాలు
[ 08-12-2023]
నంద్యాల మిర్చి యార్డులో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని శీతల గోదాముల్లో దాచుకుని విక్రయించేందుకు యార్డుకు తీసుకొస్తే విపణిలో ఉన్న అసలు ధరను దాచి రైతుల అవసరాలు గుర్తించి ఎంతోకొంత చేతుల్లో పెడుతున్నారు. -
పాఠాలు బోధపడక
[ 08-12-2023]
క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని పలు సమస్యలు వేధిస్తున్నాయి. నిధులలేమితో మౌలిక వసతులు కరవయ్యాయి. దీనికితోడు అధికారుల మధ్య సమన్వయం కరవవడం శాపంగా మారింది. చివరికి విద్యార్థులు సైతం ఇక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారు. ఇక్కడ విద్యనభ్యసించలేమని. -
కొత్తగా పనులు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
[ 08-12-2023]
‘గతంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు రాలేదు. కొత్తగా పనులు చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. -
యువతరం.. కదిలితేనే నవ్యపథం
[ 08-12-2023]
ప్రజాస్వామ్యానికి యువతే వెన్నెముక. అయినా ఓటు నమోదు విషయంలో వెనుకడుగు వేస్తోంది. 18 ఏళ్లు నిండినవారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు, పాలకులు కోరుతున్నా ప్రయోజనం లేకపోతోంది. -
జాబితాలో తప్పులు సవరించండి
[ 08-12-2023]
ఓటరు జాబితాలో తప్పులను వెంటనే సరి చేయాలని, స్వీప్ కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఓటరు అవగాహన సదస్సులు చేపట్టాలని రాష్ట్ర అదనపు ముఖ్య ఎలక్టోరల్ అధికారి హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. -
అధికారం అండగా.. మట్టి దందా
[ 08-12-2023]
కల్లూరు మండల పరిధిలోని తడకనపల్లె, ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సరిహద్దులో ఎర్రమట్టి మాఫియా పేట్రేగిపోతోంది. నిత్యం వందల సంఖ్యలో భారీ టిప్పర్లతో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మట్టి దందా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. -
బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం
[ 08-12-2023]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, 11వ పీఆర్సీ, సంపాదిత సెలవుల బకాయిలు రూ.30 కోట్లకుపైగా ఉన్నాయని, వీటి చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు. ఎమ్మిగనూరులో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. -
గెలుపు కిరీటంలో పల్లెపగడాలు
[ 08-12-2023]
క్రీడల్లో పతకాలు.. చదువులో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఆ పాఠశాలకు ఆటస్థలం లేదు. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయుడూ బదిలీపై వెళ్లారు. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు హరికృష్ణ తర్ఫీదుతో ఆ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. -
పన్ను చెల్లిస్తారా.. కుళాయి కనెక్షన్ తొలగించాలా
[ 08-12-2023]
చెత్త పన్ను చెల్లింపు విషయంలో కర్నూలు నగరంలోని సచివాలయ సిబ్బంది నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అపార్టుమెంటువాసులకు తాఖీదులు జారీ చేసి, వసూలు కోసం సాయంత్రాలు వెళ్తున్నారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్లోని సాయిసదన్ అపార్ట్మెంట్లో చెత్తపన్ను వసూలుకు సాయంత్రం వేళ వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. -
గాలిమరల ఉద్యోగిపై వైకాపా నాయకుల దాడి
[ 08-12-2023]
ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ పరిధిలోని గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మేకల రాజేష్పై వైకాపా నాయకులు దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొలగవల్లి గ్రామానికి చెందిన మేకల రాజేష్ అక్కడే గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. -
భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దు
[ 08-12-2023]
జిల్లా పరిషత్ స్థాయీసంఘ సమావేశాల ద్వారా ఆశించిన ప్రయోజనం ఏమాత్రం చేకూరడం లేదు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇక్కడి వచ్చి అనవసర ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. -
నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలి
[ 08-12-2023]
నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. కార్డు ప్రైమ్ 2.0 నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబరు 30 నుంచి కర్నూలులో దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్డౌన్ నిరసన కార్యక్రమానికి తెదేపా మద్దతు ఇచ్చింది. -
అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ కనపడకూడదు
[ 08-12-2023]
అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సీడీపీవో చేసిన సూచనలు, హెచ్చరికల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
కాటసాని x బైరెడ్డి
[ 08-12-2023]
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, శాప్ అధ్యక్షుడు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరు నాయకుల అనుచరులు పరస్పరం తమతమ నాయకులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా పోస్టింగులు చేస్తున్నారు. -
కొత్తగా పనులు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
[ 08-12-2023]
‘గతంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు రాలేదు. కొత్తగా పనులు చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు