చెరువుకు చేరని నీరు
ఇక్కడ నిల్వ ఉన్న నీటిని చూసి చెరువు అనుకుంటే మీరు నీళ్లల్లో కాలేసినట్లే. ఇది డోన్ మండలంలోని ఉడుములపాడు జగనన్న కాలనీ. వర్షమే కురవలేదు..
అసంపూర్తి పనులతో అవస్థలు
జగనన్న కాలనీకి దారి మళ్లిన వైనం
ఇక్కడ నిల్వ ఉన్న నీటిని చూసి చెరువు అనుకుంటే మీరు నీళ్లల్లో కాలేసినట్లే. ఇది డోన్ మండలంలోని ఉడుములపాడు జగనన్న కాలనీ. వర్షమే కురవలేదు.. ఇంత పెద్ద ఎత్తున నీళ్లు ఎలా వచ్చాయో ఆశ్చర్యంగా ఉంది కదూ. హంద్రీ నీవా కాల్వ నుంచి 77 చెరువులకు నీటిని విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం ఊదరగొట్టారు. జగదూర్తి చెరువుకు చేరాల్సిన నీరు ఇలా కాలనీని ముంచెత్తింది. కాల్వ పరిస్థితి సరిగా లేకపోవడంతో నీరు దారి మళ్లి జగనన్న కాలనీలోకి ప్రవహించింది. కుంటను తలపించేలా నీరు నిల్వ ఉండటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పనులు పూర్తి చేయకుండానే పథకానికి ప్రారంభోత్సవం చేశారనడానికి ఇది చక్కని నిదర్శనం.
డోన్ , డోన్ గ్రామీణం న్యూస్టుడే: ‘‘ రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా.. కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి చేసేందుకు శ్రీకారం చుట్టాం. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రధాన కాల్వ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు 77 చెరువులు నింపే కార్యక్రమం చేపట్టినట్లు’’ డోన్ మండలం వెంకాయపల్లిలో మంగళవారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్పగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, కృష్ణగిరి, డోన్, ప్యాపిలి, వెల్దుర్తి తదితర మండలాల్లోని 68 చెరువుల్లో హంద్రీ నీవా కాల్వ ద్వారా కృష్ణాజలాలు తరలించాలని తెదేపా హయాంలోనే నిర్ణయించారు. 10,130 ఎకరాలకు సాగు, 57 గ్రామాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. అప్పటి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చొరవ తీసుకొని రూ.224.31 కోట్లతో పాలనాపరమైన ఉత్తర్వులు విడుదల చేయించారు. 2019 ఎన్నికల నాటికి 40 శాతం పనులు పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా మరో 9 తటాకాలను ఈ పథకం జాబితాలో చేర్చి పనులు పూర్తి చేస్తామని చెప్పింది. పనులు మాత్రం తాత్సారం చేస్తూ వచ్చారు. ఇప్పటికీ పైపులైన్ పనులే పూర్తి కాలేదు. ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో హడావుడిగా నీటి విడుదల ప్రారంభించారు. పనులు అస్తవ్యస్తంగా ఉండటంతో ఎక్కడికక్కడ నీళ్లు ‘దారి’ మళ్లుతున్నాయి.
ట్రయల్ రన్లో గుర్తించినా
పథకంలో భాగంగా డోన్ మండలం అబ్బిరెడ్డిపల్లె, ఉడుములపాడు, జగదూర్తి చెరువులకు నీటిని అందించాల్సి ఉంది. వాటి పరిధిలో సాగుభూమి ఎక్కువగా ఉంది. అబ్బిరెడ్డిపల్లె చెరువు కింద దాదాపు 2 వేల ఎకరాల వరకు సాగవుతోంది. జగదూర్తికి చెరువుకు ఉడుములపాడు సమీపంలోని జగనన్నకాలనీ వద్ద చేపట్టిన పైపులైన్ ద్వారా కొంత దూరం వెళ్లి చిన్నపాటి వాగులో కలిసి చెరువుకు చేరాల్సి ఉంటుంది. పనులు పూర్తికాకపోవడంతో నీళ్లు జగనన్నకాలనీకి దారి మళ్లాయి. అధికారులు హడావుడిగా పనులు చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ట్రయల్రన్లో సమస్య ఎదురైనా అధికారులు పరిష్కరించలేదు. ఈ విషయమై ఏఈ వెంకటేశ్నాయక్ మాట్లాడుతూ ఉడుములపాడు చెరువు వైపు వెళ్లే పైపులైన్కు నీటి విడుదల నిలిపివేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తుత్తి సవాళ్లు.. అడుగడుగునా అక్రమాలు
[ 08-12-2023]
నంద్యాల మిర్చి యార్డులో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని శీతల గోదాముల్లో దాచుకుని విక్రయించేందుకు యార్డుకు తీసుకొస్తే విపణిలో ఉన్న అసలు ధరను దాచి రైతుల అవసరాలు గుర్తించి ఎంతోకొంత చేతుల్లో పెడుతున్నారు. -
పాఠాలు బోధపడక
[ 08-12-2023]
క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని పలు సమస్యలు వేధిస్తున్నాయి. నిధులలేమితో మౌలిక వసతులు కరవయ్యాయి. దీనికితోడు అధికారుల మధ్య సమన్వయం కరవవడం శాపంగా మారింది. చివరికి విద్యార్థులు సైతం ఇక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారు. ఇక్కడ విద్యనభ్యసించలేమని. -
కొత్తగా పనులు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
[ 08-12-2023]
‘గతంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు రాలేదు. కొత్తగా పనులు చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. -
యువతరం.. కదిలితేనే నవ్యపథం
[ 08-12-2023]
ప్రజాస్వామ్యానికి యువతే వెన్నెముక. అయినా ఓటు నమోదు విషయంలో వెనుకడుగు వేస్తోంది. 18 ఏళ్లు నిండినవారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు, పాలకులు కోరుతున్నా ప్రయోజనం లేకపోతోంది. -
జాబితాలో తప్పులు సవరించండి
[ 08-12-2023]
ఓటరు జాబితాలో తప్పులను వెంటనే సరి చేయాలని, స్వీప్ కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఓటరు అవగాహన సదస్సులు చేపట్టాలని రాష్ట్ర అదనపు ముఖ్య ఎలక్టోరల్ అధికారి హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. -
అధికారం అండగా.. మట్టి దందా
[ 08-12-2023]
కల్లూరు మండల పరిధిలోని తడకనపల్లె, ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సరిహద్దులో ఎర్రమట్టి మాఫియా పేట్రేగిపోతోంది. నిత్యం వందల సంఖ్యలో భారీ టిప్పర్లతో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మట్టి దందా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. -
బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం
[ 08-12-2023]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, 11వ పీఆర్సీ, సంపాదిత సెలవుల బకాయిలు రూ.30 కోట్లకుపైగా ఉన్నాయని, వీటి చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు. ఎమ్మిగనూరులో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. -
గెలుపు కిరీటంలో పల్లెపగడాలు
[ 08-12-2023]
క్రీడల్లో పతకాలు.. చదువులో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఆ పాఠశాలకు ఆటస్థలం లేదు. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయుడూ బదిలీపై వెళ్లారు. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు హరికృష్ణ తర్ఫీదుతో ఆ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. -
పన్ను చెల్లిస్తారా.. కుళాయి కనెక్షన్ తొలగించాలా
[ 08-12-2023]
చెత్త పన్ను చెల్లింపు విషయంలో కర్నూలు నగరంలోని సచివాలయ సిబ్బంది నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అపార్టుమెంటువాసులకు తాఖీదులు జారీ చేసి, వసూలు కోసం సాయంత్రాలు వెళ్తున్నారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్లోని సాయిసదన్ అపార్ట్మెంట్లో చెత్తపన్ను వసూలుకు సాయంత్రం వేళ వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. -
గాలిమరల ఉద్యోగిపై వైకాపా నాయకుల దాడి
[ 08-12-2023]
ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ పరిధిలోని గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మేకల రాజేష్పై వైకాపా నాయకులు దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొలగవల్లి గ్రామానికి చెందిన మేకల రాజేష్ అక్కడే గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. -
భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దు
[ 08-12-2023]
జిల్లా పరిషత్ స్థాయీసంఘ సమావేశాల ద్వారా ఆశించిన ప్రయోజనం ఏమాత్రం చేకూరడం లేదు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇక్కడి వచ్చి అనవసర ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. -
నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలి
[ 08-12-2023]
నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. కార్డు ప్రైమ్ 2.0 నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబరు 30 నుంచి కర్నూలులో దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్డౌన్ నిరసన కార్యక్రమానికి తెదేపా మద్దతు ఇచ్చింది. -
అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ కనపడకూడదు
[ 08-12-2023]
అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సీడీపీవో చేసిన సూచనలు, హెచ్చరికల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
కాటసాని x బైరెడ్డి
[ 08-12-2023]
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, శాప్ అధ్యక్షుడు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరు నాయకుల అనుచరులు పరస్పరం తమతమ నాయకులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా పోస్టింగులు చేస్తున్నారు. -
కొత్తగా పనులు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
[ 08-12-2023]
‘గతంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు రాలేదు. కొత్తగా పనులు చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా
-
వాట్సప్లో ఇకపై వాయిస్ మెసేజ్లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు.. అప్పుడు హీరోలు వీరే!
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు