మహిళకు మకుటం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వారే అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తున్నారు.
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్
లోక్సభలో ఆమోద ముద్ర
ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వారే అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తున్నారు. ఆకాశంలో సగం.. అభ్యర్థుల గెలుపులో కీలకం అంటూ రాజకీయ పార్టీలు మహిళా ఓటర్లకు గాలం వేస్తున్నాయి.. తప్పితే వారిని బరిలో నిలిపేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర పడింది.
పార్లమెంటులో ఇద్దరే
1952 నుంచి ఇప్పటివరకు ఏడు దశాబ్దాల కాలంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నుంచి ఇద్దరే మహిళలు ఎంపీలుగా గెలుపొందారు. 1962లో కర్నూలు పార్లమెంటు నుంచి యశోదారెడ్డి (కాంగ్రెస్), 2014లో కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక (వైకాపా) గెలుపొందారు.
శాసనసభలో ఏడుగురే
శాసనసభలో కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచి అడుగుపెట్టారు. మొట్టమొదటగా సుబ్బరత్నమ్మ (పత్తికొండ), శోభా నాగిరెడ్డి (ఆళ్లగడ్డ), కోట్ల సుజాతమ్మ (డోన్), నీరజారెడ్డి (ఆలూరు), గౌరు చరితారెడ్డి (పాణ్యం), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), కంగాటి శ్రీదేవి (పత్తికొండ) ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే ఉమ్మడి జిల్లాలో నలుగురు మహిళలు శాసనసభకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
10 నియోజకవర్గాల్లో కీలకం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కర్నూలు, పాణ్యం, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లి, డోన్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వారే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశిస్తున్నారు.
స్థానిక సంస్థల్లో 50 శాతం అమలు
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో 53 మంది జడ్పీటీసీ సభ్యులు ఉండగా 26 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. 804 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా అందులో 342 మంది పురుషులు, 462 మంది మహిళలు ఉన్నారు. ఎంపీపీలు 53 మందికిగాను 26 మంది పురుషులు, 27 మంది మంది మహిళలు ఉన్నారు.
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో 970 గ్రామ పంచాయతీలుండగా 485 మంది పురుషులు, 485 మంది మహిళలు సర్పంచులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 9,984 మంది వార్డు సభ్యులుండగా పురుషులు 4,992, మహిళలు 4,992 మంది ఉన్నారు.
అమలు అప్పుడే
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాత మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2026లో డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టడం ఖాయం. అంటే 2024 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029లోనే పార్లమెంటులో కోటా అమలయ్యే అవకాశముంది. 2026లో డీలిమిటేషన్ పూర్తయితే ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేసే అవకాశముంది.
శుభపరిణామం
గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం శుభపరిణామమే. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి. ఈ బిల్లు ద్వారా సాధారణ మహిళలు సైతం చట్టసభల్లోకి ప్రవేశించే అవకాశం దక్కుతుంది.
1996 నుంచి పోరాటం
- పి.నిర్మల, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
1996 నుంచి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చట్టం చేయాలని పలు రూపాల్లో పోరాడుతున్నాం. భాజపా గతంలో రెండుసార్లు దేశాన్ని పరిపాలించింది. ఆనాడు మహిళా బిల్లును ప్రవేశపెట్టలేదు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా మహిళా బిల్లును పెట్టింది.
ప్రాతినిధ్యం పెరుగుతుంది
బైరెడ్డి శబరి, భాజపా, నంద్యాల జిల్లా అధ్యక్షురాలు
27 ఏళ్ల తర్వాత పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమే. కొత్త పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లు మహిళా బిల్లు కావడం సంతోషకరం. మహిళలు వంటింటికే పరిమితం కారాదు. చట్టసభల్లో మూడో వంతు మహిళా సభ్యులు ఉండనున్నారు. దేశంలోని మహిళలంతా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపాలి. మహిళా బిల్లును ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ప్రధాని ఒక మోడల్గా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తుత్తి సవాళ్లు.. అడుగడుగునా అక్రమాలు
[ 08-12-2023]
నంద్యాల మిర్చి యార్డులో దళారులు రాజ్యమేలుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చిని శీతల గోదాముల్లో దాచుకుని విక్రయించేందుకు యార్డుకు తీసుకొస్తే విపణిలో ఉన్న అసలు ధరను దాచి రైతుల అవసరాలు గుర్తించి ఎంతోకొంత చేతుల్లో పెడుతున్నారు. -
పాఠాలు బోధపడక
[ 08-12-2023]
క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని పలు సమస్యలు వేధిస్తున్నాయి. నిధులలేమితో మౌలిక వసతులు కరవయ్యాయి. దీనికితోడు అధికారుల మధ్య సమన్వయం కరవవడం శాపంగా మారింది. చివరికి విద్యార్థులు సైతం ఇక్కడ చదివేందుకు విముఖత చూపుతున్నారు. ఇక్కడ విద్యనభ్యసించలేమని. -
కొత్తగా పనులు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
[ 08-12-2023]
‘గతంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు రాలేదు. కొత్తగా పనులు చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. -
యువతరం.. కదిలితేనే నవ్యపథం
[ 08-12-2023]
ప్రజాస్వామ్యానికి యువతే వెన్నెముక. అయినా ఓటు నమోదు విషయంలో వెనుకడుగు వేస్తోంది. 18 ఏళ్లు నిండినవారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు, పాలకులు కోరుతున్నా ప్రయోజనం లేకపోతోంది. -
జాబితాలో తప్పులు సవరించండి
[ 08-12-2023]
ఓటరు జాబితాలో తప్పులను వెంటనే సరి చేయాలని, స్వీప్ కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఓటరు అవగాహన సదస్సులు చేపట్టాలని రాష్ట్ర అదనపు ముఖ్య ఎలక్టోరల్ అధికారి హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. -
అధికారం అండగా.. మట్టి దందా
[ 08-12-2023]
కల్లూరు మండల పరిధిలోని తడకనపల్లె, ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సరిహద్దులో ఎర్రమట్టి మాఫియా పేట్రేగిపోతోంది. నిత్యం వందల సంఖ్యలో భారీ టిప్పర్లతో మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మట్టి దందా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. -
బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం
[ 08-12-2023]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, 11వ పీఆర్సీ, సంపాదిత సెలవుల బకాయిలు రూ.30 కోట్లకుపైగా ఉన్నాయని, వీటి చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు. ఎమ్మిగనూరులో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. -
గెలుపు కిరీటంలో పల్లెపగడాలు
[ 08-12-2023]
క్రీడల్లో పతకాలు.. చదువులో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. ఆ పాఠశాలకు ఆటస్థలం లేదు. ప్రస్తుతం వ్యాయామ ఉపాధ్యాయుడూ బదిలీపై వెళ్లారు. అప్పటి వ్యాయామ ఉపాధ్యాయుడు హరికృష్ణ తర్ఫీదుతో ఆ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. -
పన్ను చెల్లిస్తారా.. కుళాయి కనెక్షన్ తొలగించాలా
[ 08-12-2023]
చెత్త పన్ను చెల్లింపు విషయంలో కర్నూలు నగరంలోని సచివాలయ సిబ్బంది నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అపార్టుమెంటువాసులకు తాఖీదులు జారీ చేసి, వసూలు కోసం సాయంత్రాలు వెళ్తున్నారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్లోని సాయిసదన్ అపార్ట్మెంట్లో చెత్తపన్ను వసూలుకు సాయంత్రం వేళ వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. -
గాలిమరల ఉద్యోగిపై వైకాపా నాయకుల దాడి
[ 08-12-2023]
ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ పరిధిలోని గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న మేకల రాజేష్పై వైకాపా నాయకులు దాడిచేశారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మొలగవల్లి గ్రామానికి చెందిన మేకల రాజేష్ అక్కడే గాలిమరల కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. -
భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దు
[ 08-12-2023]
జిల్లా పరిషత్ స్థాయీసంఘ సమావేశాల ద్వారా ఆశించిన ప్రయోజనం ఏమాత్రం చేకూరడం లేదు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఇక్కడి వచ్చి అనవసర ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తోందని జడ్పీటీసీ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. -
నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలి
[ 08-12-2023]
నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. కార్డు ప్రైమ్ 2.0 నూతన రిజిస్ట్రేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబరు 30 నుంచి కర్నూలులో దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్డౌన్ నిరసన కార్యక్రమానికి తెదేపా మద్దతు ఇచ్చింది. -
అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ కనపడకూడదు
[ 08-12-2023]
అంగన్వాడీ కేంద్రాల్లో సీఎం బొమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సీడీపీవో చేసిన సూచనలు, హెచ్చరికల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
కాటసాని x బైరెడ్డి
[ 08-12-2023]
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, శాప్ అధ్యక్షుడు, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరు నాయకుల అనుచరులు పరస్పరం తమతమ నాయకులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా పోస్టింగులు చేస్తున్నారు. -
కొత్తగా పనులు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
[ 08-12-2023]
‘గతంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు రాలేదు. కొత్తగా పనులు చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ