ప్రతిభకు ఆటంకం
స్కూల్గేమ్స్ షెడ్యూలు ప్రకారం ఏటా 29 క్రీడాంశాలపై (గుర్తింపు పొందినవి) మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలి.
స్కూల్ గేమ్స్కు నిధులివ్వని ప్రభుత్వం
దాతలు, విద్యార్థుల నుంచి వసూలు
క్రీడా దుస్తులు లేకుండానే ఎస్జీఎఫ్ అండర్-19 హ్యాండ్బాల్ పోటీలో తలపడుతున్న క్రీడాకారులు
కర్నూలు క్రీడలు, ఎమ్మిగనూరు, న్యూస్టుడే: స్కూల్గేమ్స్ షెడ్యూలు ప్రకారం ఏటా 29 క్రీడాంశాలపై (గుర్తింపు పొందినవి) మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాలి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) కార్యదర్శుల సమక్షంలో వీటిని నిర్వహిస్తారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన వారికి వివిధ కోర్సులు, ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. దీంతో గ్రామీణ క్రీడాకారులు స్కూల్ గేమ్స్లో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తారు. వీటి నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పైసా విదిల్చడం లేదు. జిల్లా స్కూల్గేమ్స్ నిర్వహణ భారం తాము మోయలేమంటూ ఎస్జీఎఫ్ఐ అండర్-14, 17, 19 కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారు. ఎలాగైనా నిర్వహించాల్సిందేనని పెద్దలు ఒత్తిడి చేయడంతో దాతలు, విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.
2014 నుంచి 2019 వరకు సాఫీగా
మండలస్థాయి పోటీలు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేల నుంచి రూ.50 వేలు, జిల్లాస్థాయిలో రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలు, రాష్ట్రస్థాయి పోటీలకు రూ.3 లక్షలకుపైగా ఖర్చవుతుంది. మొదట జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శులు వెచ్చించేవారు. పోటీలు ముగిసిన ఆరునెలల లోపు బిల్లులు పెట్టుకుంటే ప్రభుత్వం నిధులు విడుదల చేసేది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఎలాంటి ‘ఆటంకం లేకుండా క్రీడలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక నిధులు కేటాయించడం లేదు. 2019లో పోటీలు నిర్వహించిన ఎస్జీఎఫ్ కార్యదర్శులు నిధుల కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఓ కార్యదర్శి ‘న్యూస్టుడే’ ఎదుట వాపోయారు.
నేడు
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) పోటీలకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. గతేడాది షెడ్యూలు ప్రకారం పోటీలు నిర్వహించకపోవడంతో క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లిలేకపోయారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోడంతో పోటీలు నిర్వహించేందుకు ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో దాతలను ఆశ్రయిస్తున్నారు.
నాడు
తెదేపా హయాంలో స్కూల్ గేమ్స్కు వచ్చే ప్రతి క్రీడాకారుడి రవాణా, భోజనం, దుస్తులు, ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు, పతకాలు, క్రీడా పత్రాల ముద్రణ తదితర వాటికి సంబంధించి అయ్యే ఖర్చులు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శులు భరించేవారు. అనంతరం బిల్లులు సమర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేది. పోటీలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోపే నిధులు ఎస్జీఎఫ్ కార్యదర్శుల ఖాతాల్లో జమయ్యేవి.
నాలుగేళ్లుగా కొరవడిన ప్రోత్సాహం
ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల తాలూకా స్థాయి పోటీలు నిర్వహించారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, షటిల్ బ్యాడ్మింటన్, చదరంగం తదితర పోటీలు జరిగాయి. నందవరం, గోనెగండ్ల, ఎమ్మిగనూరు మండలాల నుంచి 500 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. ప్రభుత్వం పైసా ఇవ్వకపోవడంతో వ్యాయామ ఉపాధ్యాయులే తమ జేబుల నుంచి ఖర్చు చేయాల్సి వచ్చింది. క్రీడాకారులు సొంతంగా రవాణా ఖర్చులు భరించారు. కనీసం నీళ్ల ప్యాకెట్లు ఇవ్వలేదు. క్రీడా కోడ్ ప్రకారం ఆటగాళ్లు ప్రత్యేక దుస్తులు ధరించి పోటీలో దిగాలి. కానీ చాలా మంది సాధారణ దుస్తులు ధరించి బరిలోకి దిగారు. దాతల సాయంతో ప్రారంభ, ముగింపు వేడకలు, క్రీడా పత్రాలు ముద్రిస్తున్నారు. ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీల్లో పాల్గొనేవారిని ప్రోత్సహిస్తూ ఇచ్చే పతకాలను గత నాలుగేళ్లుగా ఇవ్వకపోవడం గమనార్హం.
ఆటగాళ్లను ఆదుకోవాలి : చంద్రశేఖర్, నందవరం
ఎమ్మిగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. నాన్న ఆర్ఎంపీ. అమ్మ మగ్గం పని చేస్తూ బతికిస్తున్నారు.ఫుట్బాల్పై మక్కువతో వారంలో మూడు రోజులపాటు ఎమ్మిగనూరులోని మైదానంలో తర్ఫీదు పొందుతున్నా. గోల్ కీపర్గా రాణిస్తున్నా. 2022లో కర్నూలులో జరిగిన పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికయ్యా. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పోటీల్లో రాణించి క్రీడా అవార్డు గెలుచుకున్నా. 2019లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. అథ్లెటిక్స్ విభాగంలో మండల స్థాయిలో ఎంపికై జిల్లా స్థాయి జట్టు కోసం సాధన చేస్తున్నా. ప్రభుత్వ ప్రోత్సాహం పూర్తిగా కొరవడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉన్నోళ్లవి మాయం.. జాబితా గందరగోళం
[ 04-12-2023]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. శనివారం వెలవెలబోయినా.. ఆదివారం మాత్రం కొంతమేర స్పందన కనిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు ఉందో? లేదో? అని పరిశీలించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. -
నేడు, రేపు భారీ వర్షాలు
[ 04-12-2023]
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడుతోంది. తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
శ్రీశైలంలో భక్తజనం
[ 04-12-2023]
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం భక్తుల రద్దీతో కళకళలాడుతోంది. కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. -
పత్తి పరిశ్రమల బేలచూపు
[ 04-12-2023]
ఒకప్పుడు కళకళలాడిన పత్తి పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే పరిస్థితికి చేరాయి. వాణిజ్య పరంగా రెండో ముంబయిగా పేరుగాంచిన ఆదోనిలో ప్రసుత్తం పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా పత్తి వ్యాపారం కారణంగా.. -
వ్యవసాయ సంక్షోభంతో తీవ్ర నష్టం
[ 04-12-2023]
వ్యవసాయ సంక్షోభం కారణంగా అందరికీ తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షుడు టి.సాగర్ అన్నారు. -
ఊరించే మాటలు.. ఉడకని పప్పులు
[ 04-12-2023]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. నిత్యావసర సరకుల ధరలు కొండెక్కి కూర్చోవడంతో రేషన్ సరకుల్లో బియ్యంతోపాటు కందిపప్పు ఇస్తామని పాలకులు గత ఆరేడు నెలలుగా చెబుతూనే ఉన్నారు.. -
క్షేత్ర దర్శనం.. సమాజ చైతన్యం
[ 04-12-2023]
ఆ బృందం దేశవ్యాప్తంగా ఉన్న ధైవ క్షేత్రాలను సందర్శిస్తోంది. ఇదేదో తీర్థయాత్ర అనుకుంటే పొరపాటే. కాలుష్య నియంత్రణపై దృష్టిసారించారు. డీజిల్, పెట్రోలు వాడకంతో తలెత్తే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్యపరుస్తున్నారు. వారంతా వివిధ రంగాల్లో పనులు చేస్తున్నారు. వారి లక్ష్యమంతా ఒక్కటే.. ప్రకృతి సంపదను రక్షించాలి. -
సంగమేశ్వరుని దర్శనం.. సకల పాపహరణం
[ 04-12-2023]
సప్త నదుల్లో స్నానం ఆచరించి సంగమేశ్వరున్ని దర్శనం చేసుకుంటే పాపల నుంచి విముక్తి కలిగి మోక్షం లభించి నరక లోక ప్రవేశం తప్పుతుందని భక్తుల విశ్వాసం. అందువల్లే ఈ ఆలయం ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే దర్శన భాగ్యం ఉండటంతో సందర్శన కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. -
త్వరలో వైకాపా ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డుకట్ట
[ 04-12-2023]
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెదేపాదే అధికారమని, మంత్రాలయం నియోజకవర్గానికి తిక్కారెడ్డే కాబోయే రథసారథి అని, వైకాపా ఎమ్మెల్యే ఆగడాలకు త్వరలో అడ్డుకట్ట పడుతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. -
ప్రతిభ చాటుతూ.. పతకాలు సాధిస్తూ..
[ 04-12-2023]
పేద, మధ్య తరగతికి చెందిన బాలికలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నారు. పాఠశాల పీడీలు సుజాత, లూథియమ్మల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతూ పతకాలను దక్కించుకుంటూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
తాళం వేసిన ఇళ్లకు కన్నం
[ 04-12-2023]
ఆదోని పట్టణ శివారులోని తిరుమలనగర్, బాబా గార్డెన్ ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. 22 తులాల బంరం, 50 తులాల వెండి, రూ.2.55 లక్షల నగదు దోచుకెళ్లిళ్లారు. బాధితులు, ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం చేస్తున్న సాకరే పద్మావతి వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి కుమార్తె ఇంటికి వెళ్లారు. -
రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి
[ 04-12-2023]
రహదారులు అధ్వానంగా మారినా.. మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమని జనసేన పార్టీ నాయకులు అన్నారు. రహదారి మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదు. -
ఆర్యవైశ్యులంటే కులం కాదు.. కుటుంబం
[ 04-12-2023]
ఆర్యవైశ్యులంటే కులం కాదు, కుటుంబమని, అందరూ కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు టి.జి.భరత్ అన్నారు. కర్నూలు నగర శివారులోని గాయత్రీ గోశాలలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం, కార్తిక వనభోజనం నిర్వహించారు. -
ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు అండ
[ 04-12-2023]
ముస్లింల అభివృద్ధికి చేయూతనిచ్చింది తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమేనని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. బనగానపల్లిలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన తెదేపా ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
సీపీఎస్ రద్దు చేయాల్సిందే
[ 04-12-2023]
సీపీఎస్ను రద్దు చేసి వెంటనే పాత పింఛను విధానం అమలుచేయాలని ఎస్టీటీఎఫ్ (షెడ్యూల్డు ట్రైబల్స్ టీచర్స్ ఫెడరేషన్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రామకృష్ణ డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడారు.


తాజా వార్తలు (Latest News)
-
KTR: తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
-
Mamata Banerjee: కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి: మమత
-
CM Jagan: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్
-
Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్’పై పోస్ట్ తొలగించిన త్రిష
-
Bigg boss telugu 7: ఆటలు ఆడకపోయినా అందుకే శివాజీ హౌస్లో ఉంటున్నారు: గౌతమ్కృష్ణ
-
Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం