శ్రీనిధి.. బినామీల పెన్నిధి
మద్దికెర వైఎస్ఆర్ క్రాంతిపథం కార్యాలయం నుంచి పొదుపు సంఘాల సభ్యులకు అందాల్సిన శ్రీనిధి సొమ్మును సిబ్బందే బినామీ పేర్లతో కాజేస్తున్నారు.
రూ.30 లక్షల వరకు గోల్మాల్
మద్దికెరలో సిబ్బంది చేతివాటం
మద్దికెర, న్యూస్టుడే: మద్దికెర వైఎస్ఆర్ క్రాంతిపథం కార్యాలయం నుంచి పొదుపు సంఘాల సభ్యులకు అందాల్సిన శ్రీనిధి సొమ్మును సిబ్బందే బినామీ పేర్లతో కాజేస్తున్నారు. తిరిగి చెల్లించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పొదుపు సంఘాల సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా ఒక రూపాయి వడ్డీతో రుణం మంజూరు చేస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మండలానికి రూ.2.40 కోట్లు, 2023-24 ఏడాదికి రూ.4.39 కోట్లు విడుదలయ్యాయి. సంఘం సభ్యుల ఆమోదంతో ఈ నిధిని సభ్యురాలికి వైఎస్ఆర్ క్రాంతి పథం అధికారులు మంజూరు చేస్తారు. సొమ్మును తీసుకున్న సభ్యులు ప్రతి నెలా కొంత మేర చెల్లించడంతో పాటు, ఆ మొత్తానికి రూపాయి చొప్పున వడ్డీ జతచేసి తిరిగి చెల్లించాలి. శ్రీనిధి రుణాల చెల్లింపులో కొందరు సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. అధికారులకు కొంత మామూళ్లు ముట్టజెప్పి బినామీ పేర్లతో నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
రూ.30 లక్షలు ఎవరి చేతిలో
మద్దికెర మండలంలో 11 గ్రామాల పరిధిలో 863 పొదుపు సంఘాలున్నాయి. వైఎస్ఆర్ క్రాంతి పథం కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది సంఘం సభ్యులకు తెలియకుండానే శ్రీనిధి నుంచి బినామీ పేర్లతో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. వీరిలో మద్దికెర, యడవలి, బసినేపల్లి, బురుజుల తదితర గ్రామాలకు చెందిన వారు అత్యధికంగా ఉన్నారు. రూ.30 లక్షల మేర రుణ బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అంతకు రెట్టింపు ఉంటుందని సమాచారం. తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రతి నెలా అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంది.
మామూళ్లు ఇవ్వాల్సిందే
శ్రీనిధి నుంచి రుణాలు మంజూరు చేసేందుకూ అధికారులు, సిబ్బంది చేయి తడపాల్సిందే. రుణం పొందే సభ్యురాలు రూ.300 నుంచి రూ.500 ఇచ్చుకోవాల్సిందే. నిత్యం ఏదో సంఘం వారు రుణాలు పొందుతూనే ఉంటారు. వారంతా అధికారులు, సిబ్బందికి ఎంతో కొంత ఇవ్వాల్సిందే. కొందరు అధికారుల తమ ఇంటి అద్దెలు కింది స్థాయి సిబ్బందే చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ‘‘ వైఎస్ఆర్ క్రాంతి పథం ద్వారా శ్రీనిధి నుంచి 2019- 20 ఆర్థిక సంవత్సరంలో రూ.2.40 కోట్లు మంజూరు చేశారు. కాల పరిమితికి సంబంధించి దస్త్రాల్లో రూ.7.30 లక్షల బకాయిలు ఉన్నాయి. పూర్తిగా పరిశీలించి రికవరీ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ఈ రుణాల మంజూరులో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటామని’’ మద్దికెర ఏపీఎం మధుబాబు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
[ 05-12-2023]
మిగ్జాం తుపాన్ పట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ అధికారులను ఆదేశించారు. -
బడి బయట పిల్లల సమాచారం ఇవ్వాలి
[ 05-12-2023]
గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే 100 శాతం పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న డ్రాపవుట్లను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ తెలిపారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
[ 05-12-2023]
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సమయంలో సమగ్రశిక్షా ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారని.. వీటిని తక్షణమే అమలు చేయాలని ఎస్ఎస్ఏ ఐకాస కమిటీ. -
ఆడుదాం.. ఆంధ్రా రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించండి
[ 05-12-2023]
‘ఆడుదాం.. ఆంధ్రా’లో క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీవోలను కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. -
నకిలీ పత్రాల దందా అరికట్టాలి
[ 05-12-2023]
పశుసంవర్ధకశాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నకిలీ పత్రాల దందా జరుగుతోందని.. దీనిని అరికట్టాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పదోన్నతులిచ్చినా కుర్చీ వదలరు
[ 05-12-2023]
జిల్లా విద్యా శాఖలో ఇన్ఛార్జుల పాలన సాగుతోంది. ఉన్నత పదవుల్లో వారే ఉండటంతో పనులు సులువుగా చేసుకోవడంతోపాటు పని విభజన కింద ఉపాధ్యాయులను ఇష్టానుసారంగా బదిలీ చేయడం. -
ఉర్దూ వర్సిటీపై జగన్ వివక్ష
[ 05-12-2023]
ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని భావించిన తెదేపా ప్రభుత్వం ఓర్వకల్లు వద్ద డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని. -
మిరప కుప్పలు.. నిల్వకు తిప్పలు
[ 05-12-2023]
రూ.లక్షలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేసిన రైతులను మిగ్ జాం భయపెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 79,793 హెక్టార్లలో సాగు చేయగా ఒక్క కర్నూలు జిల్లాలో 60,100 హెక్టార్లలో సాగైంది. పశ్చిమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా సాగు చేశారు. -
కరవు నష్టం లెక్క తేల్చారు
[ 05-12-2023]
జిల్లాలో 24 కరవు మండలాల్లో లెక్క తేల్చారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థాయిలో వీఆర్వో, గ్రామ వ్యవసాయ సహాయకులు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పంటలు గణించారు. -
కాల్వ భూములుకబ్జా
[ 05-12-2023]
నంద్యాల జిల్లా కావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడి అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. -
తాగునీరు ఇస్తేనే.. ఓటేస్తాం
[ 05-12-2023]
తాము కొన్నేళ్లుగా కాలనీలో తాగునీరు, మురుగుకాల్వ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. -
ఓ విద్యార్థి మేలుకో.. భవిష్యత్తు కాపాడుకో
[ 05-12-2023]
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిని విద్యార్థులే సాగనంపుతారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. -
పెద్ద మంత్రి.. నీటికి అడ్డంకి
[ 05-12-2023]
గాజులదిన్నె జలాశయంలో నీళ్లు నింపకపోతే వేసవిలో కర్నూలు నగరం, డోన్, కృష్ణగిరి, కోడుమూరు, ఎమ్మిగనూరులో ప్ర‘జల’ దాహం కేకలు మిన్నంటే ప్రమాదం ఉంది. -
భూ హక్కుకు చిక్కులు
[ 05-12-2023]
‘‘ నా కోడలు సావిత్రికి సర్వే నంబర్లు 193-ఏలో 1.44 ఎకరాలు, 193-బిలో 1.02 ఎకరాల పొలం ఉంది.