24న వందేభారత్ వచ్చేస్తోంది
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 24 నుంచి కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ (బెంగళూరు) మార్గంలో పరుగులు పెట్టనుంది.
కర్నూలు, డోన్ మీదుగా యశ్వంత్పూర్కు
ట్రయల్ రన్లో భాగంగా కాచిగూడ నుంచి డోన్ రైల్వేస్టేషన్కు వచ్చి తిరిగి వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈనెల 24 నుంచి కాచిగూడ నుంచి యశ్వంత్పూర్ (బెంగళూరు) మార్గంలో పరుగులు పెట్టనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఒకేసారి తొమ్మిది రైళ్లను ప్రారంభించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి 2 గంటలకు మహబూబ్నగర్, 4.15 గంటలకు కర్నూలు నగరానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి 4.17 గంటలకు బయలు దేరి డోన్ మీదుగా వెళ్లనుంది. ఈ రైలు రెండు ఐటీ నగరాలు హైదరాబాద్, బెంగళూరుల మధ్య వెళ్లనుండటంతో ఆదరణ ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. - న్యూస్టుడే, డోన్ పట్టణం
8 గంటల్లో చేరుకోవచ్చు
వందేభారత్ రైలు గరిష్ఠ వేగం 160 కి.మీ కాగా, ఆ వేగాన్ని రైల్వే ట్రాక్లు తట్టుకునే సామర్థ్యం లేవనే ఉద్దేశంతో 130 కి.మీ.లకు పరిమితం చేసినట్లు సమాచారం. కానీ కాచిగూడ-యశ్వంత్పూర్ మధ్య సగటున 72.55 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణించనుంది. కాచిగూడ నుంచి యశ్వంత్పూర్కు 618 కి.మీ.లు దూరం ఉంది. ఈ రైలు ఏడు నుంచి 8 గంటల్లో చేరుకోనుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ రైలు కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే 11 నుంచి 12 గంటల పాటు సమయం పడుతుండగా, ఈ రైలు వల్ల నాలుగైదు గంటలు తగ్గుతుంది.
మరిన్ని వివరాలు...
- కర్నూలు నుంచి కాచిగూడకు 236 కి.మీ.లు, కర్నూలు నుంచి యశ్వంత్పూర్కు 375కి.మీ.లు ఉంటుంది.
- ఏసీ ఎగ్జిక్యూటివ్ కోచ్లకు (కాచిగూడ నుంచి యశ్వంత్పుర్కు) రూ.2,425లు, ఏసీ చైర్కార్లో రూ.1,545లు ఛార్జిని వసూలు చేయనున్నట్లు సమాచారం. వాటికి అదనంగా కేటరింగ్ ఛార్జీలు రూ.299 లుగా చెల్లించాల్సి ఉంటుందని, ఇంకా ఇవన్నీ ఖరారు కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
మూడు సార్లు ట్రయల్ రన్
ఈ రైలు ట్రయల్రన్ ఈ ఏడాది జులై 31న చెన్నై నుంచి రేణిగుంట, కడప, గుత్తి మీదుగా డోన్ రైల్వేస్టేషన్కు నిర్వహించారు. అదేరోజు స్థానిక రైల్వే స్టేషన్లోని ఒకటో ఫ్లాట్పారం నుంచి ఉదయం 6.50 గంటలకు అధికారులు ట్రయల్ రన్గా పంపించారు. 9న కాచిగూడ నుంచి డోన్ రైల్వేస్టేషన్కు, తిరిగి డోన్ నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్కు అధికారులు రెండోసారి ట్రయల్రన్ జరిపారు. ప్రస్తుతం మూడోసారి ఈ నెల 21న కాచిగూడ నుంచి నేరుగా కర్నూలు, డోన్ మీదుగా యశ్వంత్పూర్కు ట్రయల్రన్ చేపట్టారు.
ఏయే వసతులుంటాయంటే...?
వందేభారత్ ఎక్స్ప్రెస్లో 16 కోచ్లు అన్నీ ఏసీవే. రెండు ఎగ్జిక్యూటీవ్ చైర్కార్లు, 14 చైర్కార్లు, 1,128 సీట్ల సామర్థ్యంతో ఉన్న దీనికి ఆటోమేటిక్ తలుపులు, విశాలమైన లోకోపైలెట్ క్యాబిన్ సొంతం. బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్ కండీషనింగ్ సిస్టంతో పాటు వైఫైతో ఉన్న కవచ్ రైలు ప్రొటెక్షన్ సిస్టం, కోచ్లన్నింటిలో 32 ఇంచీల టెలివిజన్, రిక్లైనబుల్ సీట్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ యూనిట్ ప్రత్యేకం. సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్ మరుగుదొడ్లు, స్మోక్ అలారం, ఫుట్రెస్ట్, సెన్సార్తో పని చేసే కుళాయిలు, హయ్యర్ ఫ్లడ్ ప్రొటెక్షన్ వంటి వాటిని కల్పించారు.
ఎక్కడికి.. ఎప్పుడు..
కాచిగూడ నుంచి బయల్దేరి మహబూబ్నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం రైల్వే స్టేషన్లలో వందేభారత్ ఆగనుంది. తర్వాత నేరుగా యశ్వంత్పూర్ వెళ్తుంది. రోజూ కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు బయల్దేరి మహబూబ్నగర్కు 7గంటలకు, కర్నూలు సిటీకి 8.40 గంటలకు, డోన్కు 9.30 గంటలు, అనంతపురానికి 10.55, ధర్మవరానికి 11.30 గంటలకు, యశ్వంత్పూర్ మధ్యాహ్నం 2 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్పూర్ నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి ధర్మవరానికి సాయంత్రం 5.15కు, అనంతపురానికి 5.41, డోన్కు 7.15, కర్నూలు సిటీకి 7.51 గంటలకు, మహబూబ్నగర్కు రాత్రి 9.40, కాచిగూడకు రాత్రి 11.15 గంటలకు చేరుతుందంటున్నారు. రాత్రి 11.15 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఎలా వెళ్తుందంటే...?
దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ పరిధిలోని కాచిగూడ నుంచి షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు, గుంతకల్లు డివిజన్ పరిధిలోని డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, నైరుతి రైల్వే బెంగళూరు డివిజన్లోని పెనుగొండ, హిందూపురం, వంటి రైల్వేస్టేషన్ల మీదుగా యశ్వంత్పూర్ వెళ్తుంది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఆరు డివిజన్లు ఉండగా అన్ని రూట్లలో గరిష్ఠ వేగంతో రైళ్లు రాకపోకలు సాగించేందుకు లైన్లను ఆధునికీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
[ 05-12-2023]
మిగ్జాం తుపాన్ పట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ అధికారులను ఆదేశించారు. -
బడి బయట పిల్లల సమాచారం ఇవ్వాలి
[ 05-12-2023]
గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే 100 శాతం పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న డ్రాపవుట్లను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ తెలిపారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి
[ 05-12-2023]
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సమయంలో సమగ్రశిక్షా ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారని.. వీటిని తక్షణమే అమలు చేయాలని ఎస్ఎస్ఏ ఐకాస కమిటీ. -
ఆడుదాం.. ఆంధ్రా రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించండి
[ 05-12-2023]
‘ఆడుదాం.. ఆంధ్రా’లో క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీవోలను కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. -
నకిలీ పత్రాల దందా అరికట్టాలి
[ 05-12-2023]
పశుసంవర్ధకశాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నకిలీ పత్రాల దందా జరుగుతోందని.. దీనిని అరికట్టాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పదోన్నతులిచ్చినా కుర్చీ వదలరు
[ 05-12-2023]
జిల్లా విద్యా శాఖలో ఇన్ఛార్జుల పాలన సాగుతోంది. ఉన్నత పదవుల్లో వారే ఉండటంతో పనులు సులువుగా చేసుకోవడంతోపాటు పని విభజన కింద ఉపాధ్యాయులను ఇష్టానుసారంగా బదిలీ చేయడం. -
ఉర్దూ వర్సిటీపై జగన్ వివక్ష
[ 05-12-2023]
ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని భావించిన తెదేపా ప్రభుత్వం ఓర్వకల్లు వద్ద డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని. -
మిరప కుప్పలు.. నిల్వకు తిప్పలు
[ 05-12-2023]
రూ.లక్షలు పెట్టుబడి పెట్టి మిరప సాగు చేసిన రైతులను మిగ్ జాం భయపెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 79,793 హెక్టార్లలో సాగు చేయగా ఒక్క కర్నూలు జిల్లాలో 60,100 హెక్టార్లలో సాగైంది. పశ్చిమ ప్రాంతంలో రైతులు ఎక్కువగా సాగు చేశారు. -
కరవు నష్టం లెక్క తేల్చారు
[ 05-12-2023]
జిల్లాలో 24 కరవు మండలాల్లో లెక్క తేల్చారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థాయిలో వీఆర్వో, గ్రామ వ్యవసాయ సహాయకులు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పంటలు గణించారు. -
కాల్వ భూములుకబ్జా
[ 05-12-2023]
నంద్యాల జిల్లా కావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా అక్కడి అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. -
తాగునీరు ఇస్తేనే.. ఓటేస్తాం
[ 05-12-2023]
తాము కొన్నేళ్లుగా కాలనీలో తాగునీరు, మురుగుకాల్వ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. -
ఓ విద్యార్థి మేలుకో.. భవిష్యత్తు కాపాడుకో
[ 05-12-2023]
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిని విద్యార్థులే సాగనంపుతారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. -
పెద్ద మంత్రి.. నీటికి అడ్డంకి
[ 05-12-2023]
గాజులదిన్నె జలాశయంలో నీళ్లు నింపకపోతే వేసవిలో కర్నూలు నగరం, డోన్, కృష్ణగిరి, కోడుమూరు, ఎమ్మిగనూరులో ప్ర‘జల’ దాహం కేకలు మిన్నంటే ప్రమాదం ఉంది. -
భూ హక్కుకు చిక్కులు
[ 05-12-2023]
‘‘ నా కోడలు సావిత్రికి సర్వే నంబర్లు 193-ఏలో 1.44 ఎకరాలు, 193-బిలో 1.02 ఎకరాల పొలం ఉంది.