నెలల పిల్లాడికి అరుదైన జబ్బు.. చికిత్సకు రూ.16కోట్లు అవసరం!
ఓ పిల్లాడికి అరుదైన జబ్బు సోకింది. చికిత్సకు రూ.కోట్లు ఖర్చవుతాయని వైద్యులు తేల్చారు. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రమే కావడం..
చికిత్స పొందుతున్న నివాన్ష్
కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే : ఓ పిల్లాడికి అరుదైన జబ్బు సోకింది. చికిత్సకు రూ.కోట్లు ఖర్చవుతాయని వైద్యులు తేల్చారు. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రమే కావడం.. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
కర్నూలు నగరంలోని ఎన్.ఆర్.పేటకు చెందిన వెంకటేష్ గౌడు, ఉషారాణి దంపతులకు వివాహమైన ఏడేళ్ల తర్వాత కుమారుడు నివాన్ష్ పుట్టాడు. చాలా సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టడంతో ఎంతో సంతోషించారు. కొద్దిరోజులకే వారి ఆనందం ఆవిరైంది. నెలలు గడుస్తున్నా పిల్లాడు కాలు, మెడ కదపలేని పరిస్థితి నెలకొంది. నాలుగు నెలల వయస్సులోనే అనారోగ్యానికి గురవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నగరంలోని చిన్నపిల్లల వైద్యులకు చూపించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించగా జన్యుపరమైన సమస్యతో వచ్చే జబ్బుగా వైద్యులు నిర్ధారించారు. వైద్యం అందించేందుకుగాను పిల్లాడికి రెండేళ్ల వయస్సులోపు వ్యాక్సిన్ వేయించేందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. పిల్లాడి తల్లిదండ్రులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అంత భారీ మొత్తం డబ్బు ఎలా సేకరించాలో అర్థంకాక వారు అల్లాడుతున్నారు. ఒకవైపు అనారోగ్యంతో రోజురోజుకు పిల్లాడి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకుంటే తప్ప పిల్లాడికి వైద్యం అందించలేని పరిస్థితి అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉన్నోళ్లవి మాయం.. జాబితా గందరగోళం
[ 04-12-2023]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. శనివారం వెలవెలబోయినా.. ఆదివారం మాత్రం కొంతమేర స్పందన కనిపించింది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు ఉందో? లేదో? అని పరిశీలించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. -
నేడు, రేపు భారీ వర్షాలు
[ 04-12-2023]
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడుతోంది. తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
శ్రీశైలంలో భక్తజనం
[ 04-12-2023]
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం భక్తుల రద్దీతో కళకళలాడుతోంది. కార్తిక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. -
పత్తి పరిశ్రమల బేలచూపు
[ 04-12-2023]
ఒకప్పుడు కళకళలాడిన పత్తి పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే పరిస్థితికి చేరాయి. వాణిజ్య పరంగా రెండో ముంబయిగా పేరుగాంచిన ఆదోనిలో ప్రసుత్తం పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా పత్తి వ్యాపారం కారణంగా.. -
వ్యవసాయ సంక్షోభంతో తీవ్ర నష్టం
[ 04-12-2023]
వ్యవసాయ సంక్షోభం కారణంగా అందరికీ తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షుడు టి.సాగర్ అన్నారు. -
ఊరించే మాటలు.. ఉడకని పప్పులు
[ 04-12-2023]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. నిత్యావసర సరకుల ధరలు కొండెక్కి కూర్చోవడంతో రేషన్ సరకుల్లో బియ్యంతోపాటు కందిపప్పు ఇస్తామని పాలకులు గత ఆరేడు నెలలుగా చెబుతూనే ఉన్నారు.. -
క్షేత్ర దర్శనం.. సమాజ చైతన్యం
[ 04-12-2023]
ఆ బృందం దేశవ్యాప్తంగా ఉన్న ధైవ క్షేత్రాలను సందర్శిస్తోంది. ఇదేదో తీర్థయాత్ర అనుకుంటే పొరపాటే. కాలుష్య నియంత్రణపై దృష్టిసారించారు. డీజిల్, పెట్రోలు వాడకంతో తలెత్తే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్యపరుస్తున్నారు. వారంతా వివిధ రంగాల్లో పనులు చేస్తున్నారు. వారి లక్ష్యమంతా ఒక్కటే.. ప్రకృతి సంపదను రక్షించాలి. -
సంగమేశ్వరుని దర్శనం.. సకల పాపహరణం
[ 04-12-2023]
సప్త నదుల్లో స్నానం ఆచరించి సంగమేశ్వరున్ని దర్శనం చేసుకుంటే పాపల నుంచి విముక్తి కలిగి మోక్షం లభించి నరక లోక ప్రవేశం తప్పుతుందని భక్తుల విశ్వాసం. అందువల్లే ఈ ఆలయం ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే దర్శన భాగ్యం ఉండటంతో సందర్శన కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. -
త్వరలో వైకాపా ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డుకట్ట
[ 04-12-2023]
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెదేపాదే అధికారమని, మంత్రాలయం నియోజకవర్గానికి తిక్కారెడ్డే కాబోయే రథసారథి అని, వైకాపా ఎమ్మెల్యే ఆగడాలకు త్వరలో అడ్డుకట్ట పడుతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. -
ప్రతిభ చాటుతూ.. పతకాలు సాధిస్తూ..
[ 04-12-2023]
పేద, మధ్య తరగతికి చెందిన బాలికలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నారు. పాఠశాల పీడీలు సుజాత, లూథియమ్మల పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతూ పతకాలను దక్కించుకుంటూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
తాళం వేసిన ఇళ్లకు కన్నం
[ 04-12-2023]
ఆదోని పట్టణ శివారులోని తిరుమలనగర్, బాబా గార్డెన్ ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. 22 తులాల బంరం, 50 తులాల వెండి, రూ.2.55 లక్షల నగదు దోచుకెళ్లిళ్లారు. బాధితులు, ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం చేస్తున్న సాకరే పద్మావతి వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి కుమార్తె ఇంటికి వెళ్లారు. -
రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి
[ 04-12-2023]
రహదారులు అధ్వానంగా మారినా.. మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమని జనసేన పార్టీ నాయకులు అన్నారు. రహదారి మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదు. -
ఆర్యవైశ్యులంటే కులం కాదు.. కుటుంబం
[ 04-12-2023]
ఆర్యవైశ్యులంటే కులం కాదు, కుటుంబమని, అందరూ కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు టి.జి.భరత్ అన్నారు. కర్నూలు నగర శివారులోని గాయత్రీ గోశాలలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం, కార్తిక వనభోజనం నిర్వహించారు. -
ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు అండ
[ 04-12-2023]
ముస్లింల అభివృద్ధికి చేయూతనిచ్చింది తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమేనని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. బనగానపల్లిలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన తెదేపా ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
సీపీఎస్ రద్దు చేయాల్సిందే
[ 04-12-2023]
సీపీఎస్ను రద్దు చేసి వెంటనే పాత పింఛను విధానం అమలుచేయాలని ఎస్టీటీఎఫ్ (షెడ్యూల్డు ట్రైబల్స్ టీచర్స్ ఫెడరేషన్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రామకృష్ణ డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడారు.


తాజా వార్తలు (Latest News)
-
Armed Forces: సాయుధ బలగాల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచుతాం : మోదీ
-
KCR: ప్రజాతీర్పును గౌరవిద్దాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం: కేసీఆర్
-
Kim Jong Un: ఇది ప్రతి ఇంటి సమస్య.. జనన రేటు క్షీణతపై కిమ్ ఆందోళన
-
Nagarjuna Sagar: సాగర్ వద్ద పూర్వస్థితిని పునరుద్ధరించండి: కేఆర్ఎంబీని కోరిన తెలంగాణ
-
Accidents: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స.. త్వరలో దేశవ్యాప్తంగా అమలు!
-
Election Commision: తెలంగాణలో ఎన్నికల కోడ్ ఎత్తివేత