logo

ఆటో, ద్విచక్రవాహనం ఢీ : యువకుడి మృతి

ఆటో- ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటనలో కోయిలకొండ మండలం అభంగపట్నానికి చెందిన వినోద్‌కుమార్‌(25) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్డె

Published : 17 Jan 2022 01:48 IST

హన్వాడ, న్యూస్‌టుడే : ఆటో- ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటనలో కోయిలకొండ మండలం అభంగపట్నానికి చెందిన వినోద్‌కుమార్‌(25) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వడ్డె వినోద్‌కుమార్‌, మునిమోక్షానికి చెందిన ఆయన మిత్రుడు చెన్నయ్యను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని శనివారం రాత్రి గొండ్యాల్‌లో తిరుమలనాథ ఉత్సవాలకు వెళుతుండగా.. అమ్మాపూర్‌ గేట్‌ దగ్గర వేపూర్‌ నుంచి హన్వాడ వస్తున్న ఆటో ఢీకొంది. ప్రమాదంలో వినోద్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. చెన్నయ్య కాలుకు బలమైన గాయాలు తగిలాయి. చెన్నయ్యను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినోద్‌కుమార్‌ మృతకి కారణమైన ఆటో డ్రైవర్‌ సంతోశ్‌పై పోలీసులు కేసు నమొదు చేసి విచారణ జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని