మంత్రుల వద్ద కూల్చివేత పంచాయితీ?
అయిజ పురపాలికలో చేపట్టిన అనుమతిలేని కట్టడాల కూల్చివేత వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది. ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారగా పంచాయతీ ఇద్దరి మంత్రుల ముందుకు చేరినట్లు సమాచారం.
అయిజలో పొక్లెయిన్తో కూలుస్తున్న దృశ్యం(పాత)
న్యూస్టుడే, అయిజ: అయిజ పురపాలికలో చేపట్టిన అనుమతిలేని కట్టడాల కూల్చివేత వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది. ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారగా పంచాయతీ ఇద్దరి మంత్రుల ముందుకు చేరినట్లు సమాచారం. వ్యవహారంలో మంత్రులు జోక్యం చేసుకోవడంతో స్థానిక అధికారులతోపాటు జిల్లాస్థాయి అధికారులకు తలనొప్పిగా మారినట్లు తెలిసింది.
జిల్లాలో గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ పురపాలికల్లో కలిపి అధికారులు 82 అనుమతిలేని కట్టడాలను గుర్తించారు. వాస్తవానికి అనుమతిలేనివి రెట్టింపు ఉంటాయని అంచనా. డిసెంబరు 15న అయిజలో కట్టడాల కూల్చివేతను ప్రారంభించారు. 31 కట్టడాలు అనుమతి లేనివిగా గుర్తించగా 20 నిర్మాణాలను కూల్చేశారు. యజమానులకు నోటీసులు ఇవ్వకుండా కూల్చవచ్చు అనే నిబంధన ఉన్నప్పటికీ కనీసం కూల్చేసే సమయంలో సమాచారం ఇవ్వకుండా ఎందుకు కూల్చేశారని పాలకవర్గంతోపాటు అధికార పార్టీ నాయకులు అధికారులను ప్రశ్నించారు. పట్టణంలోని నిరుపేదలు, బడుగు, బలహీనవర్గాల వారివి మాత్రమే కూల్చారని పెట్రోల్బంక్ చౌరస్తాలో నిర్మిస్తున్న వ్యాపార సముదాయాన్ని ఎందుకు కూల్చలేదని ప్రస్తుతం మంత్రుల వద్ద పంచాయితీ పెట్టినట్లు పట్టణంలో చర్చ నడుస్తోంది.
అక్రమార్కులకు గుణపాఠంగా మారేనా..? : అనుమతి లేకుండా నిర్మించుకుంటున్న వారికి కూల్చివేత వ్యవహారం గుణపాఠంగా మారనుందని ప్రజలు భావిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు మొదలు పెట్టడం, ఆ తర్వాత అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం ఇక్కడ పంచాయతీగా ఉన్నప్పటి నుంచే అలవాటయిందని వారు పేర్కొంటున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరిస్తేనే అనుమతి తీసుకొన్న తర్వాత నిర్మాణాలు ప్రారంభిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..
నిబంధనల ప్రకారం చర్యలు
- నర్సయ్య, పుర కమిషనర్, అయిజ
70 గజాలలోపు నిర్మించేవారు కూడా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. కూల్చివేత అనంతరం మిగిలినవారు కూడా దరఖాస్తు చేసుకొన్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలను గుర్తించాం. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ మద్యం పట్టివేత
[ 25-04-2024]
రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ పట్టివేత, కేసు నమోదు
[ 25-04-2024]
తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. -
ప్రశాంతంగా సార్వత్రిక వార్షిక పరీక్షలు
[ 25-04-2024]
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. -
ఆలయాలను దర్శించుకున్న మంత్రి జూపల్లి
[ 25-04-2024]
ఆలంపూర్ శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. -
మలేరియాపై అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన గద్వాలలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కుపై అవగాహన
[ 25-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో పొదుపు సంఘాల మహిళలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు మంచి మార్కులు సాధించి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం బాలకిష్టాపూర్ విద్యార్థి ఆలూరి శివశంకర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 469 సాధించాడు. -
అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ అమ్మాయిలే పైచేయి సాధించారు. వృత్తి విద్యఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. -
పాలమూరు మెరుపులు
[ 25-04-2024]
కష్టపడి కాదు.. ఇష్టపడి చదివితేనే అనుకున్న లక్ష్యం సిద్ధిస్తుందని నమ్మారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. -
జిల్లాది 20వ స్థానం
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గతేడాది కంటే ఈసారి ఒక శాతం ఉత్తీర్ణత పెరిగింది. నిరుడు మొదటి సంవత్సరం 55 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 52.78 శాతం, ద్వితీయ సంవత్సరం గత ఏడాది 57 శాతం సాధించగా ఈసారి 58 శాతం ఫలితాలు వచ్చాయి. -
ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెనుకబాటు
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు బుధవారం ప్రకటించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థులు పూర్తిగా వెనుకబడిపోయారు. -
కారు, ఆటో, మినీ బస్సు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 25-04-2024]
ఆటోను అధిగమించేక్రమంలో కారు, మినీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతోపాటు ఆటోకు తగలడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 12 మందికి గాయాలయ్యాయి -
నామినేషన్లకు నేడే ఆఖరి రోజు
[ 25-04-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్, ఎన్నికల సహాయ అధికారి నగేశ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM