సరిహద్దుల్లో అప్రమత్తం
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ప్రజలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతోపాఉట జాతీయరహదారి, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రయాణ ప్రాంగణాల వద్ద వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.ఒక్కో షిఫ్టుకు వైద్యుడు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త విధుల్లో ఉండి వచ్చిన ప్రజలకు కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
సిబ్బందికి సౌకర్యాలు కరవు
న్యూస్టుడే, ఉండవల్లి, మానవపాడు
పుల్లూరు టోల్ప్లాజా వద్ద కొవిడ్ పరీక్ష నిర్వహిస్తున్న ఆశా కార్యకర్త
కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ప్రజలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతోపాఉట జాతీయరహదారి, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రయాణ ప్రాంగణాల వద్ద వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.ఒక్కో షిఫ్టుకు వైద్యుడు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త విధుల్లో ఉండి వచ్చిన ప్రజలకు కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
జిల్లాలో ఇక్కడ
రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన పుల్లూరు టోల్ప్లాజా, నందిన్నె, బల్గెర, అలంపూర్, గద్వాల రైల్వేస్టేషన్లు, గద్వాల బస్సు ప్రయాణ ప్రాంగణాల్లో వైద్యసిబ్బంది ప్రజలకు పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు హోంఐసోలేషన్లో ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి మెడికల్కిట్ అందజేస్తున్నారు.
టోల్ప్లాజా వద్ద వ్యర్థాలను డబ్బాలో పడేసిన దృశ్యం
నామమాత్రంగా పరీక్షలు
ప్రయాణ ప్రాంగణాలు వంటి ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ప్రజలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు కొంతమేర ఇబ్బంది లేకపోయినా.. జాతీయ రహదారిగుండా వచ్చే ప్రజలకు, రాష్ట్ర సరిహద్దుల వద్ద వైద్యసిబ్బందికి అది అసాధ్యం. దీంతో కొవిడ్ పరీక్షలు నామమాత్రంగా కొనసాగుతాయనడంలో సందేహం లేదు. గతంలో పుల్లూరు చెక్పోస్టు వద్ద వైద్యసిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించారు. పోలీసులు రహదారి గుండా వచ్చే వాహనాలను ఆపితే రెవెన్యూశాఖ అధికారులు వివరాలు నమోదు చేసుకుని వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించారు. దీంతో పనులు సజావుగా కొనసాగేవి. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొవిడ్ పరీక్షలు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. పుల్లూరు టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన కొవిడ్ పరీక్ష కేంద్రంలో అయిదు రోజులకు కేవలం 183 మందికే కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
వసతులేవీ..
జిల్లాలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు కొవిడ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ విధులు నిర్వహించే వైద్యసిబ్బందికి పూర్తి స్థాయిలో వసతులు కరవయ్యాయి. తాగునీటి సౌకర్యం అంతంతమాత్రంగానే ఉంది. కొవిడ్ పరీక్షలు చేసిన వ్యర్థాలను వేసేందుకు చెత్తబుట్టలు లేకపోవడంతో చిన్న అట్ట డబ్బాల్లో వేస్తున్నారు. మహిళా సిబ్బందికి తగిన సౌకర్యాలు లేవు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
- డా.చందూనాయక్, ఇన్ఛార్జి డీఎంహెచ్వో
జిల్లాలో ఏరియాఆసుపత్రి, సీహెచ్సీ, పీహెచ్సీలతోపాటు ఎంపిక చేసిన ఏడు ప్రాంతాల్లో నిత్యం 2,500లకుపైగా కొవిడ్ పరీక్షలు చేస్తున్నాం. రోజుకు 15 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అవి కూడా సరిహద్దు ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, బస్సు ప్రయాణ ప్రాంగణాల వద్ద నమోదవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో వైద్యసిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీసుశాఖ ఉద్యోగులు ఉంటే పరీక్షల నిర్వహణ సులువుగా ఉంటుందని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లా. వసతులు కల్పించడానికి కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే