ఉపాధి కల్పన.. అరకొరే!
ఉపాధి కల్పన కార్యాలయాలు ప్రస్తుతం అలంకార ప్రాయాలుగా మారాయి. గతంలో ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో తమ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను నమోదు చేసుకుంటే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదనే భరోసా ఉండేది.. కానీ ప్రస్తుతం కేవలం నిరుద్యోగ అభ్యర్థుల నమోదుకే పరిమితమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్, రికార్డు అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయాలని అప్పటి ప్రభుత్వాలు బాధ్యతలను అప్పగించేవి..
నిరుద్యోగుల నమోదుకే పరిమితమవుతున్న కార్యాలయాలు
న్యూస్టుడే, పాలమూరు
ఉపాధి కల్పన కార్యాలయాలు ప్రస్తుతం అలంకార ప్రాయాలుగా మారాయి. గతంలో ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో తమ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను నమోదు చేసుకుంటే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదనే భరోసా ఉండేది.. కానీ ప్రస్తుతం కేవలం నిరుద్యోగ అభ్యర్థుల నమోదుకే పరిమితమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్, రికార్డు అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలను భర్తీ చేయాలని అప్పటి ప్రభుత్వాలు బాధ్యతలను అప్పగించేవి.. కానీ నేడు ఆ పరిస్థితి లేక అరకొరగా ఉద్యోగ మేళాలను నిర్వహించి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలను కల్పిస్తున్నారు.. అయిదు జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల్లో 74,592 మంది నిరుద్యోగులు నమోదై ఉండగా.. రెండేళ్లలో 932 మందికి మాత్రమే ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు చూపించడం గమనార్హం.
మూడు జిల్లాల్లోనే..
ఏడాది పొడవునా ఉపాధి కల్పన కార్యాలయ అధికారులు అరకొరగా ఉద్యోగ మేళాలను నిర్వహించారు. మూడు జిల్లాల్లో అప్పుడప్పుడు వీటిని నిర్వహించగా, మిగతా రెండు జిల్లాల్లో వీటిని నిర్వహించలేదు.
* మహబూబ్నగర్ జిల్లాలో 2020లో పదిసార్లు ఉద్యోగ మేళాలను నిర్వహించి 209 మందికి ప్రైవేటు సంస్థల్లో ఉపాధిని కల్పించారు. 2021లో పది సార్లు మేళాలను నిర్వహించగా కేవలం 60 మందికి మాత్రమే ఉపాధిని కల్పించారు.
* నాగర్కర్నూల్లో 2020లో పదిసార్లు ఉద్యోగ మేళాను నిర్వహించి అందులో 119 మందికి ఉపాధి కల్పించగా, 2021లో ఏడుసార్లు ఉద్యోగ మేళాలను నిర్వహించి 42 మందికి ఉపాధిని కల్పించారు.
* జోగులాంబ గద్వాలలో 2020లో ఆరుసార్లు మేళాను నిర్వహించి 22 మందికి, 2021లో 8 సార్లు మేళాను నిర్వహించి 392 మందికి ఉపాధిని కల్పించారు.
* వనపర్తిలో 2021లో కేవలం రెండుసార్లు మాత్రమే ఉద్యోగ మేళాను నిర్వహించి అతి తక్కువగా 88 మందికి మాత్రమే ఉపాధిని కల్పించారు.
* నారాయణపేట జిల్లాలో ఉద్యోగ మేళాల ఊసే లేకుండా పోయింది. ఈ జిల్లాలో ఒక్కసారి కూడా ఉద్యోగ మేళాను నిర్వహించకపోవడం విశేషం.
చర్యలు తీసుకుంటున్నాం
ఉద్యోగ మేళాలను నిర్వహించి అందులో అర్హత కలిగిన వారికి వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని మహబూబ్నగర్ జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్సింగ్ చెప్పారు. రెండేళ్ల నుంచి కొవిడ్ కారణంగా సక్రమంగా ఉద్యోగ మేళాలను నిర్వహించలేదన్నారు. ఈసారి మాత్రం ఎక్కువ మేళాలను నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు
[ 28-03-2024]
జిల్లాలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. గద్వాల పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత, మున్సిపల్ కౌన్సిలర్లతో వచ్చి ఓటు వేశారు. -
అలంపూర్ ఆలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే
[ 28-03-2024]
అలంపూర్ పట్టణంలోని శ్రీ జోగులాంబ దేవి, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు -
గద్వాల పట్టణంలో భారీ చోరీ
[ 28-03-2024]
జిల్లాలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గురువారం గద్వాల పట్టణంలో భారీ చోరీ జరిగింది. -
మండేకాలం.. వద్దు నిర్లక్ష్యం!
[ 28-03-2024]
వేసవి కాలంలో వాహనాల్లో పొగలు రావడం.. కార్లలో మంటలు ఎగిసిపడటం.. ద్విచక్ర వాహనాల టైర్లు పేలిపోవడం చూస్తుంటాం.. వాహనం ఇంజిన్లో నిప్పురవ్వలు వచ్చి పెద్దఎత్తున మంటలు వస్తే ఏకధాటిగా ప్రయాణం -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!
[ 28-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
మక్తల్ నుంచి భాజపా ఎన్నికల ప్రచారం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన విస్తృత పరిచే ప్రక్రియను మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ చేస్తున్నారు. -
నాగర్కర్నూల్ స్థానాన్ని గెలిచి కానుకగా ఇస్తాం
[ 28-03-2024]
భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామని పార్లమెంట్ సభ్యుడు పి.రాములు అన్నారు. -
డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ కన్ను
[ 28-03-2024]
మహబూబ్నగర్ డీసీసీబీ పీఠంపై హస్తం పార్టీ కన్నేసింది. ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పార్టీ పావులు కదుపుతోంది. -
మన్యంకొండలో పూర్ణాహుతి
[ 28-03-2024]
మన్యంకొండలో అలమేలుమంగ బ్రహ్మోత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో శ్రీనివాస సమేత అలమేలుమంగకు వేదపండితులు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో... -
మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్
[ 28-03-2024]
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వైద్యశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. -
అడుగంటుతున్న వరదాయని
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరదాయనిగా నిలిచిన రామన్పాడ్ జలాశయం అడుగంటి పోతోంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం అడుగంటింది. -
మహిళా సంఘాలకే ఎక్కువ కేంద్రాలు
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలులో పారదర్శకత కోసం పౌరసరఫరాల శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకే అధికంగా కేటాయించారు. -
చిన్నారులకు బాల ఆధార్
[ 28-03-2024]
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్కార్డు తప్పనిసరిగా మారింది. ఇది గుర్తింపుకార్డు మాత్రమే కాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు పొందాలంటే ఇదే ప్రామాణికంగా మారింది. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. అనారోగ్య సమస్యలు, కుమారుడితో గొడవలతో ఇబ్బంది పడుతూ... -
పెద్ద సార్లు తలచుకుంటే.. అంతా గప్చుప్!
[ 28-03-2024]
జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అనిశా వలలో తహసీల్దార్
[ 28-03-2024]
ఓ అవినీతి రెవెన్యూ అధికారి పనితీరుకు విసుగు చెందిన రైతు.. అతణ్ని అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టించారు. ఈ ఘటన గుండుమాల్ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. -
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 28-03-2024]
వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫి తీర్పు ఇచ్చినట్లు కోర్టు లైజన్ అధికారి బాలకృష్ణ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట