పునాదులు దాటని వంతెనలు
వరద వస్తే చాలు.. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. వరదల ప్రవాహం తగ్గేంత వరకు బిక్కుబిక్కు మంటు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గ్రామాల్లోనే ఉండాల్సిన దుర్భర పరిస్థితిలో గ్రామస్థులు మగ్గుతున్నారు. వర్షాకాలం అత్యవసర వైద్యానికి
వరద వస్తే రాకపోకలకు అంతరాయం
నిధుల కొరత, అటవీశాఖ అభ్యంతరంతో నిలిచిన పనులు
- న్యూస్టుడే, కల్వకుర్తి
కొల్లాపూర్ మారెడుమాను దిన్నె వాగుపై అసంపూర్తి వంతెన..
వరద వస్తే చాలు.. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. వరదల ప్రవాహం తగ్గేంత వరకు బిక్కుబిక్కు మంటు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గ్రామాల్లోనే ఉండాల్సిన దుర్భర పరిస్థితిలో గ్రామస్థులు మగ్గుతున్నారు. వర్షాకాలం అత్యవసర వైద్యానికి అవస్థలు పడాల్సిందే. పురుడు నొప్పులొచ్చినా కాలు బయటి పెట్టలేని దుస్థితి. జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆరేళ్లుగా వాగులపై వంతెనలు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. కల్వకుర్తి మండల సమీపంలో రఘుపతిపేట గ్రామానికి అనుసరించుకొని ఉన్న దుంధుబీ వాగుపై వంతెన లేక ఏటా వర్షాలకు వచ్చే వరదలతో రాకపోకలు నిలిచిపోతూ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కల్వకుర్తి మండలం రఘుపతిపేట సమీపంలోని దుంధుబీ వాగుపై శిథిలమైన కాజ్ వే..
మారేడుమాన్డిన్నె - నాల్లాపూర్ వాగుపై వంతెన ఏర్పాటుకు ఆరేళ్ల కిందట పనులకు శ్రీకారం చుట్టారు. వంతెన ఏర్పాటుతో అటవీ ప్రాంతంలోని వృక్ష సంపదకు, జంతువులకు రక్షణ ఉండదని అటవీశాఖాధికారులు పనులను అడ్డుకున్నారు. మరో వైపు పనులు ఆగటంతో నిధులు దారి మల్లాయి. పనులు చేపట్టాలని గుత్తేదారుకు అధికారులు శ్రీముఖాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. వరద వస్తే చాలు వాగు ఉద్రిక్తతకు ముక్కిడిగుండం, మొలచింతల పల్లి, సమీపంలోని మరో ఆరు గిరిజన గ్రామాల ప్రజలు కొల్లాపూర్కు రాకపోకలు సాగించలేని పరిస్థితి. వర్షాకాలంలోని నాలుగు నెలలపాటు అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే బీరం హార్షవర్థన్రెడ్డి రూ. కోటితో వంతెన పనులకు శ్రీకారం చుట్టారు.
* పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని ఉడుములవాగు- నార్లాపూర్ పెద్ద వాగు అయిదేళ్ల కిందట దాదాపు రూ.3 కోట్లతో వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో గుత్తేదారు పనులను మధ్యలోనే వదిలేశారు. అప్పటి నుంచి వంతెన పనులు ముందుకు కదలడం లేదు. వంతెన పూర్తయితే అచ్చంపేట, లింగాల నుంచి కొల్లాపూర్కు వెళ్లేందుకు దూరం తగ్గనుంది. అంచనాలు పెరగటంతో ప్రత్యేకంగా నిధి కింద రూ.5.7 కోట్లతో వంతెన పనులు మొదలు పెట్టారు. పనుల్లో మాత్రం వేగం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.40 కోట్ల అంచనాలు..
రఘుపతిపేట గ్రామ సమీపంలో దుంధుబీ వాగుపై ఉన్న సిమెంటు కాజువే పూర్తి దెబ్బతింది. ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సూచన మేరకు వాగుపై వంతెన ఏర్పాటుకు రూ.40 కోట్లతో అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిక ఆర్అండ్బి శాఖ పంపారు. తెల్కపల్లి, లింగాల, ఉప్పునుంతల మండలాల ప్రజలకు హైదరాబాద్కు వెల్లటానికి ఈ దారి నుంచి దాదాపు 30 కిలోమీట్ల దూరం తగ్గనుందని ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. వరద నీటికి కేఎల్ఐ కృష్ణాజలాలు పారటంతో వరద ఉద్రిక్తంగా ప్రవహిస్తే ఆర్టీసీ బస్సులు సైతం బందు పెడతారు. కాజువే పూర్తిగా దెబ్బతింది. రెండు చోట్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ఇప్పుడు నీరు ప్రవహించటంతో ఎప్పుడు ఏమి జరగనుందోనని ప్రయాణికులు భయపడుతున్నారు.
ప్రమాదకరంగా మారింది..
- శ్రీపతి రఘుపతిపేట గ్రామం కల్వకుర్తి.
దుంధుభీ వాగు పై ఉన్న కాజ్ వే పూర్తిగా శిథిలమైంది. మరో వైపు చీకటి వాగు నుంచి వచ్చే వరద వద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అక్కడే కాజువే పాడైయింది. వాగు అరకిలో మీటరు దూరం ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల వారు వరద వచ్చే సమయంలో కాలినడకన పోలేమా ధైర్యంతో వస్తు మార్గమద్యలోకి వచ్చాక వరద అధికమై ప్రమాదాల బారిన పడుతున్నారు. వంతెన నిర్మిస్తె ఎంతో మేలు జరగనుంది.
వర్షాకాలం వచ్చే లోపు పనులు పూర్తి..
- దామోదర్రావు పంచాయతీరాజ్, రమేశ్ ర.భ శాఖల ఈఈలు నాగర్కర్నూల్.
కొల్లాపూర్ ప్రాంతంలో మారేడుమాన్దిమ్మె, ఉడుముల వాగుపై జరుగుతున్న వంతెనల పనుల్లో వేగవంతం చేస్తాం. నిధుల కొరత, ఇతర కారాణాల చేత పనులు జరగకుండా ఆలస్యం కావటం వాస్తవమే. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వర్షా కాలం వచ్చే లోపు పనులు ముగించటానికి గుత్తేదారుల పై ఒత్తిడి తీసుకొచ్చి పనులు పూర్తి చేయిస్తాం. దుంధుబీ వాగు పై వంతెన ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం.
అత్యవసరం వేళ అగమ్యగోచరం
- గంగం మల్లేశ్యాదవ్ ముక్కిడిగుండం, కొల్లాపూర్
వాగుల పై వంతెనల పనులు ఆగిపోవటంతో వర్షాకాలంలో ఎప్పుడు ఏమి జరగనుందోనని భయంగా ఉంది. వరద వచ్చిందంటే కొల్లాపూర్కు రాకపోకలు నిలిచిపోతాయి. పక్క నున్న ఇతర గ్రామాలకు సంబంధాలే తెగిపోతాయి. ఈ పరిస్థితుల్లో జ్వరాలు వచ్చినా, పురిటి నొప్పులతో ఉన్న వారి పరిస్థితి చెప్పనక్కర లేదు. వర్షాకాలం రాకముందే వంతెన పనులు పూర్తి చేసి మా ఇబ్బందులు తొలగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!