పాఠం.. పాట్లు
విద్యాసంస్థలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈనెల 8 నుంచి 16 వరకు మొదట సెలవులు ప్రకటించినా.. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
న్యూస్టుడే, మహబూబ్నగర్ అర్బన్
డోకూరులో ఆన్లైన్ తరగతి వింటున్న విద్యార్థిని
విద్యాసంస్థలకు ఈనెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సక్రాంతి సెలవుల నేపథ్యంలో ఈనెల 8 నుంచి 16 వరకు మొదట సెలవులు ప్రకటించినా.. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ 14 రోజులపాటు ఆన్లైన్ పాఠాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు సెలవుల పొడిగింపుపై పెదవి విరిస్తున్నాయి.
* కొవిడ్ విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగానే సెలువులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో సెలువులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒమిక్రాన్ భయపెడుతుండడతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలవైపే మొగ్గు చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయని విద్యావేత్తలు అంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ద్వారా పాఠాలు బోధించకుండా.. పరిస్థితులు మెరుగుపడేంత వరకు ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్ని తరగతుల విద్యార్థుల వారికి టీశాట్, దూరదర్శన్, యాదగిరి ఛానళ్ల ద్వారా వీడియో పాఠాలను అందుబాటులోకి తేవాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సమస్యలు అధిగమిస్తేనే..
జిల్లాలో వ్యవసాయ కూలీలు, కార్మికులు, నిరుపేదలే ఎక్కువ. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు కొత్తమే కాకపోయినా.. చాలామందికి స్మార్ట్ఫోన్లు, టీవీలు లేవు. మారుమూల పల్లెల్లో నెట్వర్క్ సమస్యలు గతంలో అధికంగానే ఎదురయ్యాయి. పాఠాలు ప్రసారమయ్యే సమయంలో విద్యుత్తు కోతలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమస్యలను పరిష్కరిస్తేనే పిల్లలకు కొంతవరకు మేలు కలగనుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం..
- ఉషారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. ఆఫ్లైన్, ఆన్లైన్ తరగతుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యక్ష, డిజిటల్ బోధనను అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండేలా చర్యలు చేపడుతున్నాం. విద్యాశాఖ విధివిధానాలు ప్రకటించిన వెంటనే ప్రణాళిక సిద్ధం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల అధికారులకు కరదీపికలు
[ 20-04-2024]
ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ విధులు నిర్వహించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు లోక్సభ నియోజకవర్గాలుండగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాలకు నామపత్రాల స్వీకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. -
రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
గొర్రెల పంపిణీ లేనట్టే
[ 20-04-2024]
గొర్రెల పంపిణీకి చెల్లించిన డబ్బులను వెనక్కి ఇవ్వాలని పశు సంవర్ధశాఖ శాఖ అధికారులు నిర్ణయించారు. -
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
[ 20-04-2024]
అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలని తాను సూచిస్తే కొందరు అధికారులు అక్రమార్కులకే వంత పాడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
తాపం తట్టుకుంటూ విధి నిర్వహణ
[ 20-04-2024]
నిత్యం లక్షలాది ప్రయాణికులను ఆర్టీసీ బస్సులు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బస్సుల్లో ఎక్కిన ప్రయాణికులే వేడి తట్టుకోలేకపోతున్నారు. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
[ 20-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో రెండో రోజు ఆరుగురు ఏడు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. -
సలేశ్వరం జాతరకు ఏర్పాట్లు
[ 20-04-2024]
ఏటా చైత్ర పూర్ణిమ నుంచి మూడు రోజుల పాటు నల్లమల కొండల్లో కొలువైన సలేశ్వరం జాతరకు అటవీ పరిసరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
ముస్లిం వ్యతిరేక పార్టీగా భాజపాపై దుష్ప్రచారం: డీకే అరుణ
[ 20-04-2024]
తమ రాజకీయ మనుగడ కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భాజపాను ముస్లీం వ్యతిరేక పార్టీగా దుష్ప్రచారం చేసి ముద్ర వేశాయని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
మృతిచెందిన యువతి గుర్తింపు
[ 20-04-2024]
మహబూబ్నగర్ సమీపంలోని మయూరి పార్కులో ఈ నెల 17న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన యువతిని గుర్తించారు. -
మత్తుతో యువత చిత్తు
[ 20-04-2024]
యువత మత్తు పదార్థాల విచ్చలవిడి వినియోగంతో పక్కదారి పడుతున్నారు. మరోవైపు మద్యం మత్తులో ప్రమాదాల బారినపడుతూ.. నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. -
అకాల వర్షం.. అన్నదాతకు అపార నష్టం
[ 20-04-2024]
ధన్వాడ మండలంలో గురువారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం కురిసింది. రైతులు, మామిడి తోటల పెంపకందారులను కోలుకోలేని దెబ్బతీసింది. -
విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు
[ 20-04-2024]
పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్ డిస్ట్రిక్ట్ హబ్) స్కానింగ్ సెంటర్లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
ఓటుహక్కు సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్
[ 20-04-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు